JN: కొడకండ్ల మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో యూత్ కాంగ్రెస్ సమీక్షా సమావేశం శుక్రవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా నియోజకవర్గ ఇంఛార్జ్ ఝాన్సీ రెడ్డి హాజరై మాట్లాడుతూ.. గ్రామ స్థాయిలో పార్టీ బలోపేతం కోసం నిరంతర చైతన్యం అవసరం అన్నారు. ప్రజల మధ్యకు పార్టీ సిద్ధాంతాలను తీసుకెళ్లి, పేద ప్రజలకు మద్దతుగా నిలవాలనీ కోరారు. రానున్న ఎన్నికల్లో యూత్ కీలకమన్నారు.