ADB: పట్టణంలోని 10వ తరగతి పరీక్ష నిర్వహిస్తున్న పరీక్ష కేంద్రాలను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పరీక్ష జరుగుతున్న తీరును ఆయన పరిశీలించారు. పరీక్షా కేంద్రాలలోనికి సెల్ ఫోన్, ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించకూడదన్నారు. దగ్గరలో ఉన్న జిరాక్స్ సెంటర్లు, ఇంటర్నెట్ సెంటర్లను పరీక్ష పూర్తి అయ్యేంతవరకు మూసి ఉంచాలని సూచించారు.