JN: పశుసంపదతో రైతులు ఆర్థిక అభివృద్ధిని సాధించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి రవీంద్ర శర్మ రైతులకు సూచించారు. గురువారం మండల కేంద్రంలోని శ్రీ గౌరీ గోశాల ఆధ్వర్యంలో 62 గోవులను రైతులకు ప్రధాన న్యాయమూర్తి రవీంద్ర శర్మ ఉచితంగా పంపిణీ చేశారు. రైతులను ఉద్దేశించి మాట్లాడారు. గోశాల ద్వారా ఉచితంగా రైతులను ఆదుకోవడం అభినందనీయం అన్నారు. గోవులను కాపాడుకోవాలన్నారు.