NLG: నాగార్జునసాగర్ ప్రాజెక్టు పరిధిలో వివిధ పనుల కోసం గతేడాది కంటే ఈసారి బడ్జెట్ను భారీగా పెంచింది. గతేడాది బడ్జెట్లో 96.07 కోట్లు మాత్రమే కేటాయించిన ప్రభుత్వం ఈసారి వాటిని 297.95 కోట్లకు పెంచింది. ఆ నిధులతో డ్యామ్ సంబంధిత ప్రధాన పనులు కాలువలు డిస్టబ్యూటరీ పనులను చేపడుతామని ప్రకటించింది. ప్రభుత్వ నిర్ణయంతో సాగర్ ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేశారు.
NLG: నల్గొండ పట్టణంలోని నడ్డివారి గూడెంలో పట్టణ పేదల సంఘం కన్వీనర్ దండంపెల్లి సత్తయ్య గురువారం సంతకాల సేకరణను చేపట్టారు. పట్టణ పేదలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం, ఉపాధి హామీ పథకం వర్తింప చేయాలని కోరుతూ… సీఎంకు పంపించే లేఖ పై పేదలతో ఆయన సంతకాలు చేయించారు. ఈనెల 24న ఆర్డీవో కార్యాలయం ముందు జరిగే ధర్నాలో పాల్గొనాలని కోరారు.
MDK: పౌర సరఫరాల శాఖ మెదక్ జిల్లా ఆధ్వర్యంలో సీజ్ చేసిన బియ్యాన్ని వేలం నిర్వహిస్తున్నట్లు మెదక్ జిల్లా పౌర సరఫరాల అధికారి పేర్కొన్నారు. 6a కేసు కింద సీజ్ చేసి నిల్వ ఉంచిన బియ్యాన్ని ఈనెల 24న ఉదయం 10 గంటలకు వేలం నిర్వహించనున్నారు. వేలంలో పాల్గొనేవారు 22 సాయంత్రం 5 గంటల లోపు రూ.2500 డిపాజిట్ చేయాలని సూచించారు.
MDK: జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లోని అన్ని మండలాల ఎమ్మార్వోలతో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఆయా మండలాలలోని ఎమ్మార్వో కార్యాలయంలోకి వచ్చే ప్రతి ఒక్క వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి రావాలని సూచించారు.
KNR: కరీంనగర్ నగరపాలక సంస్థపై కాషాయ జెండా ఎగర వేసేందుకు సిద్ధం కావాలని, ఆ కరీంనగర్ నగరపాలక సంస్థపై కాషాయ జెండా ఎగర వేసేందుకు సిద్ధం కావాలని, బీజేపీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి అన్నారు. బుధవారం కరీంనగర్లో ఆయన మాట్లాడుతూ.. కరీంనగర్ నగర అభివృద్ధి కేవలం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన స్మార్ట్ సిటీ నిధులతో జరిగిందని అన్నారు.
BHPL: విద్యార్థులు కృషి, పట్టుదలతో ముందుకు సాగితే మంచి భవిష్యత్తును సాధించగలరని భూపాలపల్లి పౌర సంబంధాల అధికారి శ్రీనివాస్ అన్నారు. గొల్లబుద్దారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ఆయన “అందరూ చదవాలి.. అందరూ ఎదగాలి” ప్రేరణ కరపత్రాన్ని విద్యార్థులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో డీఈవో రాజేందర్ పాల్గొన్నారు.
WGL: వేగవంతంగా కమర్షియల్ ట్రేడ్ వసూలు చేయాలని బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకాడే అధికారులను ఆదేశించారు. కమర్షియల్ ట్రేడ్ పన్ను వసూళ్లపై ప్రజా ఆరోగ్య విభాగ అధికారులు, డిప్యూటీ కమిషనర్తో ఏర్పాటు చేసిన సమావేశంలో కమిషనర్ తగు సూచనలు చేశారు. సానిటరీ ఇన్స్స్పెక్టర్లు, రెవిన్యూ అధికారులు, జవాన్లతో బృందాలను ఏర్పాటు చేసి, సర్కిల్కు 7 బృందాలు కేటాయించారు.
KNR: మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పై మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అసత్యపు, నిరాధారమైన ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాడని నిరసిస్తూ బుధవారం బెజ్జంకి మండల కేంద్రంలోని అంబేద్కర్ కూడలి వద్ద మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని ఆరు మండలాల నుండి తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు ధర్నా నిర్వహించారు.
SRD: మనూర్ పోలీస్ స్టేషన్ను ఎస్పీ పరితోష్ పంకజ్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్లోని రికార్డులను పరిశీలించి కేసుల గురించి అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర సరిహద్దు కావడంతో వాహనాల తనిఖీలు రెగ్యులర్ గస్ నిర్వహించాలని సూచించారు. పెండింగ్ కేసులు ఉంటే వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు పాల్గొన్నారు.
WGL: పోచంపల్లి ఫౌండేషన్, ఏపీఎల్ హెల్త్ కేర్ వారి ఆర్థిక సాయంతో పలువురు మహిళలకు బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బుధవారం ఉచిత కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, దాస్యం భాస్కర్లు హాజరై మాట్లాడారు. మహిళలు ఉపాధిని పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
NRML: జన సంచార ప్రదేశాల్లో వేసవికాలం దృష్ట్యా చలి కేంద్రాలు విరివిగా ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. బుధవారం నిర్మల్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం దగ్గర వారు చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బస్టాండ్, మంచిర్యాల తదితర ప్రాంతాలలో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని సిబ్బందిని ఆదేశించారు.
SRCL: తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ కాత్యాయని గారువేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారిని బుధవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనం అనంతరం అర్చకులు వారిని ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. వారి వెంట ఆలయ ఇన్స్పెక్టర్ నరేందర్, జూనియర్ అసిస్టెంట్ సింహాచారి, ఆలయ సిబ్బంది ఉన్నారు.
JN: స్టేషన్ ఘనపూర్ ఆర్డీవో వెంకన్న అఖిలపక్ష నాయకులతో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒకరు ఓటు హక్కు నమోదు చేసుకోవాలని, అన్ని పార్టీల నాయకులు బిఎల్ఏలను నియమించుకొని ప్రజలకు, ప్రభుత్వ అధికారులకు అందరికీ వారధిగా ఉంటూ సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో, వివిధ పార్టీల నేతలు ఉన్నారు.
WGL: రేవంత్ రెడ్డి పాపం రైతన్నలకు శాపం అని మాజీ మంత్రి, శాసన మండలి BRS పార్టీ విప్ సత్యవతి రాథోడ్ అన్నారు. ఎండిన వరితో అసెంబ్లీ ప్రాంగణంలో BRS ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈరోజు అందోళన చేపట్టారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరువు అని మండిపడ్డారు. రైతులు ఆత్మహత్య చేసుకుంటే అందాల పోటీలా? అంటూ విమర్శలు గుప్పించారు.
WGL: వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ బుధవారం కాకతీయ యూనివర్సిటీ వీసీ కర్నాటి ప్రతాపరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీపీ, వీసీకి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం విద్యా రంగం, శాంతి భద్రతలు వంటి పలు అంశాలపై వీరు చర్చించారు. సమావేశంలో విశ్వవిద్యాలయం సంబంధిత అధికారులు, పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.