• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

జమ్మికుంటలో బీజేపీ నేతల ముందస్తు అరెస్ట్

KNR: అసెంబ్లీ సమావేశాలను ముట్టడించనున్న బీజేపీ నాయకులను జమ్మికుంట పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న నేపథ్యంలో శాంతిభద్రతల దృష్ట్యా అరెస్ట్ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. హామీల అమలు కోసం ప్రశ్నించడానికి వెళ్తున్న తమను రాజ్యాంగ విరుద్ధంగా అరెస్ట్ చేయడం సారి కాదన్నారు.

March 23, 2026 / 09:04 AM IST

నడిగూడెంలో బీజేపీ నేతల ముందస్తు అరెస్ట్

SRPT: రాష్ట్ర బీజేపీ పిలుపు మేరకు ‘అసెంబ్లీ ముట్టడి’కి వెళ్లకుండా నడిగూడెం పోలీసులు ఇవాళ ఉదయం బీజేపీ నేతలను ముందస్తు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు బండారు వీరబాబు యాదవ్ మాట్లాడుతూ.. ప్రభుత్వం అక్రమ అరెస్టులతో ఉద్యమాలను అణచివేయలేదని, ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

March 23, 2026 / 09:01 AM IST

రేపు సిద్ధిరామేశ్వర స్వామి దేవాలయ హుండీ లెక్కింపు

కామారెడ్డి జిల్లాలోని భిక్కనూర్ మండల కేంద్రంలోని సిద్ధిరామేశ్వర స్వామి దేవాలయంలో రేపు హుండీలను లెక్కించనున్నట్లు దేవస్థానం ఈఓ శ్రీధర్ నేడు ఒక ప్రకటనలో తెలిపారు. ఆలయానికి వచ్చిన హుండీ ఆదాయాన్ని అధికారుల సమక్షంలో లెక్కించనున్నట్లు పేర్కొన్నారు. ఈ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తామన్నారు.

March 23, 2026 / 09:01 AM IST

బాధిత కుటుంబానికి బియ్యం అందజేత

BHPL: గణపురం మండలం గాంధీనగర్ గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మరణించిన మేకల సమ్మయ్య కుటుంబాన్ని సోమవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు పరామర్శించారు. ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు భువన సుందర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ నిరుపేదలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని అన్నారు. అనంతరం బాధిత కుటుంబానికి 50 కిలోల బియ్యం అందజేశారు.

March 23, 2026 / 08:53 AM IST

బాల్కొండ సర్పంచ్‌కు జాతీయ స్థాయి పోటీలో మూడో స్థానం

NZB: బాల్కొండ సర్పంచ్ గాండ్ల రాజేశ్‌కు అరుదైన గౌరవం లభించింది. ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా జాతీయ సర్పంచ్ సంవాద్ ఆన్‌లైన్ పోటీలను ఈనెల 18 నుంచి 20 వరకు దేశవ్యాప్తంగా సర్పంచ్‌లకు నిర్వహించారు. ఈ పోటీలో బాల్కొండ సర్పంచ్ రాజేశ్ జాతీయ స్థాయిలో మూడో స్థానంలో నిలిచారు.

March 23, 2026 / 08:52 AM IST

CMRF పథకం నిరుపేదలకు ఓ వరం: సూర్య

MLG: జిల్లా కేంద్రంలోని MLA క్యాంపు కార్యాలయంలో CMRF కింద మంజూరైన సుమారు 5 లక్షల రూపాయల చెక్కులను లబ్ధిదారులకు సోమవారం రాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కుంజా సూర్య పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. CMRF పథకం నిరుపేదలకు ఓ వరం అని అన్నారు. ఈ కార్యక్రమంలో SC, ST అట్రాసిటీ మానిటరింగ్ కమిటీ సభ్యులు జన్ను రవి తదితరులు ఉన్నారు.

March 23, 2026 / 08:49 AM IST

బాధితుడికి అండగా నిలిచిన PACS మాజీ ఛైర్మన్

SRD: ఖేడ్ మండలం సంజీవనరావుపేట గ్రామానికి చెందిన సారా కార్తీక్ (15) అనే బాలుడికి ఇటీవల ప్రమాదంలో కాలు కోల్పోయాడు. తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఆర్థిక సహాయం, దాతల అపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో PACS మాజీ చైర్మన్ ఊర్మిల రాంరెడ్డి ఆదివారం రూ. 1 లక్ష ఆర్థిక సహాయం బాధిత బాలుడికి అందించి అండగా నిలిచారు.

March 23, 2026 / 08:48 AM IST

యువకుడు దారుణ హత్య

MDK: చిన్న శంకరంపేట మండలం మిర్జాపల్లిలో దారుణం చోటు చేసుకుంది. గ్రామ శివారులో గుర్తు తెలియని యువకుడు ఆదివారం రాత్రి హత్యకు గురయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపడుతున్నారు. మిర్జాపల్లికి చెందిన ప్రజలు ఈ దారిన వెళ్లాలంటే భయభ్రాంతులకు గురవుతున్నారు. హత్య చేసింది ఎవరూ అనే విషయాలు తెలియాల్సి ఉంది.

March 23, 2026 / 08:47 AM IST

మంత్రికి మార్కెట్ సెక్యూరిటీ గార్డుల వినతి

JGL: వ్యవసాయ మార్కెట్ కార్యాలయాల్లో పనిచేస్తున్న తమకు కనీస వేతనం అమలు చేయాలని కోరుతూ సెక్యూరిటీ గార్డులు ఆదివారం రాష్ట్ర మంత్రి లక్ష్మణ్ కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేసి, ప్రభుత్వం నేరుగా జీతాలు చెల్లించాలని వారు కోరారు. కనీస వేతన చట్టం అమలుకు కృషి చేయాలని విన్నవించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

March 23, 2026 / 08:45 AM IST

పేకాట స్తావరంపై పోలీసుల దాడి.. ఐదుగురు అరెస్ట్

ASF: రెబ్బెన మండలం గంగాపూర్ పరిసరాల్లో ఆదివారం రాత్రి పేకాట ఆడుతున్న ముఠాపై మెరుపు దాడి చేసి ఐదుగురు పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకున్నట్లు SI వెంకటకృష్ణ ఓ ప్రకటనలో తెలిపారు. వారి వద్ద నుంచి రూ. 2,540 నగదును స్వాధీనం చేసుకున్నామన్నారు. పేకాట, బెట్టింగ్ వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

March 23, 2026 / 08:44 AM IST

వ్యవసాయ పనిముట్లు పంపిణీ చేసిన కాంగ్రెస్ నాయకులు మట్టా

KMM: వ్యవసాయ యాంత్రీకరణతోనే సాగు లాభసాటిగా మారుతుందని కాంగ్రెస్ రాష్ట్ర నేత మట్టా దయానంద్ అన్నారు. ఆదివారం పెనుబల్లిలో 50 శాతం సబ్సిడీపై రోటవేటర్లు, బేయిలర్లు, స్ప్రేయర్లను రైతులకు పంపిణీ చేశారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక రాయితీలు కల్పిస్తోందని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ ఛైర్మన్ బాగం నీరజ పాల్గొన్నారు.

March 23, 2026 / 08:43 AM IST

దేవాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మాజీ ఎమ్మెల్యే

MBNR: తిమ్మాజీపేట మండలం అవంచ గ్రామంలో నూతన ఆంజనేయస్వామి దేవాలయ నిర్మాణానికి మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సోమవారం శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన స్వగ్రామంలో నూతన దేవాలయం నిర్మిస్తుండడం సంతోషించదగ్గ విషయం అని అన్నారు. అందుకు తన వంతుగా సహాయ సహకారాలు అందిస్తానన్నారు.

March 23, 2026 / 08:43 AM IST

మగువలకు ‘మహాలక్ష్మి’ నిరాశ

NLG: మహిళల వంటింటి కష్టాలను తీర్చేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘మహాలక్ష్మి’ పథకం పట్టాలు తప్పుతోంది. రూ.500కే గ్యాస్ సిలిండర్ అందిస్తామన్న హామీపై NLG జిల్లాలోని పేద, మధ్య తరగతి మహిళలు పెట్టుకున్న నమ్మకం సడలుతోంది. 12 నెలలకు పైగానే లబ్ధిదారుల ఖాతాల్లో సబ్సిడీ సొమ్ము జమకాకపోవడంతో లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

March 23, 2026 / 08:43 AM IST

సివిల్ సప్లై హమాలి యూనియన్ జిల్లా కార్యవర్గం ఎన్నిక

PDPL: సివిల్ సప్లై హమాలీ యూనియన్ పెద్దపల్లి జిల్లా నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఎన్నకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా కడారి సునీల్, ప్రధాన కార్యదర్శిగా ఎం.గట్టయ్య, ఉపాధ్యక్షునిగా ఎం.కుమార్, సహాయ కార్యదర్శిగా ఎం.తిరుపతి కోశాధికారిగా బి. పోచమల్లు, కార్యవర్గ సభ్యులుగా జి.సమ్మయ్య, మహేశ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన కార్యవర్గాన్ని సత్కరించారు.

March 23, 2026 / 08:39 AM IST

బీజేపీ నాయకుల ముందస్తు అరెస్ట్

నిర్మల్ పట్టణంలో బీజేపీ నేతలను పోలీసులు ముందస్తుగా సోమవారం ఉదయం అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన అమలుకు నోచుకోని హామీలను ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా తెలంగాణ బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి పిలుపునిచ్చింది. హైదరాబాద్‌కు వెళ్లేందుకు సిద్ధమైన బీజేపీ నేతలను పోలీసులు ఈ సందర్భంగా అదుపులోకి తీసుకున్నారు.

March 23, 2026 / 08:38 AM IST