KMM: కల్లూరు సమీపంలోని నిర్మాణంలో ఉన్న గ్రీన్ ఫీల్డ్ హైవే రోడ్డు పనులు చకచకా పూర్తవుతున్నాయి. మండలంలో ముగ్గు వెంకటాపురం, లింగాల, ఓబుల్ రావు బంజర్ సమీపంలో ఉన్న బ్రిడ్జి పనులు పూర్తయ్యాయి. ఇటీవల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఓ సమావేశంలో ఆగస్టు 15 వరకు దాదాపుగా రోడ్డు పనులు పూర్తి చేసి ప్రారంభిస్తామన్నారు.
WGL: రైలు తగిలి చేయి తెగిపడ్డ ఘటన వరంగల్ రైల్వేస్టేషన్లో చోటు చేసుకుంది. వరంగల్ రామన్నపేటకు చెందిన నరసింహ (50) వరంగల్ రైల్వే స్టేషన్లో ఒకటో నంబర్ ప్లాట్ ఫాంపై నిలుచున్నాడు. అప్పుడే వచ్చిన జైపూర్ ఎక్స్ప్రెస్ అతడికి తగలడంతో చేయి తెగి పడింది. వెంటనే రైల్వే సిబ్బంది 108కు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అంబులెన్స్ సిబ్బంది, ప్రథమ చికిత్స అందించారు.
SRD: భద్రాచలం సీతారాముల తలంబ్రాలను ఆర్టీసీ కార్గో ద్వారా ఇంటి వద్దకే అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు రీజనల్ మేనేజర్ ప్రభులత మంగళవారం తెలిపారు. ఏప్రిల్ 6వ తేదీ వరకు లాజిస్టిక్ కేంద్రాలు 150 రూపాయలు చెల్లించి బుక్ చేసుకోవాలని చెప్పారు. సీతారాముల కళ్యాణం తర్వాత ఇంటికి వచ్చి తలంబ్రాలను తమ సిబ్బంది అందిస్తారని పేర్కొన్నారు.
NLG: ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 12 నియోజకవర్గాలకు ప్రభుత్వం ఇఫ్తార్ విందుకు నిధులు విడుదల చేసింది. నియోజకవర్గాల వారీగా నిధులు (రూ.లక్షలలో) నల్గొండ-5, మిర్యాలగూడ-4, దేవరకొండ-3, సాగర్-3, నకిరేకల్-3, మునుగోడు-3, కోదాడ-4, సూర్యాపట-3, హుజూర్ నగర్-3, తుంగతుర్తి-3, భువనగిరి-3, ఆలేరు-2 లక్షలు నిధులు మంజూరు చేసింది.
MHBD: గూడూరు మండలం బొద్దుగొండ సమీపంలోనున్న గండి తండ వద్ద సోమవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భూపతిపేట సబ్ స్టేషన్లో విధులు ముగించుకొని తిరిగీ ఇంటికి వస్తుండగా తండా యకాస్వామి తలపై నుంచి దూసుకెళ్లిన గుర్తుతెలియని వాహనం. మృతుడుది తొర్రూర్ మండలం పోలేపల్లి గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు నమోదు చేసినట్లు తెలిపారు.
KMM: పోగొట్టుకున్న 48 మొబైల్ ఫోన్లను సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ పోర్టల్ ద్వారా ట్రాక్ చేసి బాధితులకు అప్పగించినట్లు అడిషనల్ DCPఆడ్మీన్ నరేష్ కుమార్ తెలిపారు. బాధితులు పోగొట్టుకున్న/చోరీకి గురైన మొబైల్ ఫోన్ను CEIRపోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టి వాటిని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. వీటి విలువ రూ.7 లక్షలని పేర్కొన్నారు.
BDK: బీసీ గురుకుల విద్యాలయాల్లో 2025–2026 విద్యా సంవత్సరానికి గానూ 6, 7, 8, 9వ తరగతి (ఇంగ్లిషు మీడియం)లో ఖాళీగా ఉన్న బ్యాక్లాగ్ సీట్లకు ప్రవేశం కొరకు దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్లు ఉమ్మడి ఖమ్మం జిల్లా బీ.సీ గురుకుల ఆర్సీఓ సి.హెచ్. రాంబాబు సోమవారం తెలిపారు. ఆసక్తిగల బాల-బాలికలు 150 రూపాయల రుసుముతో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
HNK: హనుమకొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం మొదటి అంతస్తులోని జిల్లా ట్రెజరీ కార్యాలయంలో రేపు మంగళవారం ప్రత్యేక రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినట్లు జిల్లా అధికారి అక్కవరం శ్రీనివాస్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. తల సేమియా బాధితుల కోసం రక్తం సేకరించడం కోసం శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ ప్రావీణ్య రక్తదాన శిబిరాన్ని ప్రారంభించనున్నారు.
HNK: వివిధ సమస్యలపై ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన అర్జీలను సంబంధిత శాఖల అధికారులు త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ పి. ప్రావీణ్య ఆదేశించారు. సోమవారం హనుమకొండ కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి వివిధ సమస్యల పరిష్కారానికై 76 ఆర్జీలు వచ్చాయని కలెక్టర్ తెలిపారు. సమస్యలను పెండింగ్ లేకుండా త్వరగా పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలన్నారు.
BHPL: పదవ తరగతి విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోవడానికి వీలుగా రూట్లు వారిగా అదనపు బస్సులు ఏర్పాటు చేయాలని భూపాలపల్లి కలెక్టర్ రాహుల్ శర్మ ఆర్టీసీ సీఎంకు సూచించారు. పరీక్ష కేంద్రాల పరిసరాల్లో 163 సెక్షన్ అమలు చేయాలని పోలీస్ అధికారులకు సూచించారు. పరీక్షా కేంద్రాల సమీపంలో ఉన్న అన్ని జిరాక్స్ కేంద్రాలను మూసివేయాలని సూచించారు.
BDK: పినపాక మండలం వెంకట్రావుపేట గ్రామంలో ఇటీవల 76 క్వింటాల మిర్చి కల్లాన్ని తగలబెట్టిన ఇద్దరు నిందితులను సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. వ్యక్తిగత వివాదాల నేపథ్యంలో మిర్చి కల్లాన్ని తగలబెట్టినట్లు ఎస్ఐ రాజ్ కుమార్ వివరాలు వెల్లడించారు. నిందితులపై కేసు నమోదు చేసి డిమాండ్కు తరలిస్తున్నట్లు పేర్కొన్నారు.
NZB: ఇటీవల ఎమ్మెల్యే కోటాలో MLCగా ఏకగ్రీవంగా ఎన్నికయిన నల్గొండ డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్ను నిజామాబాద్ డీసీసీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. సోమవారం హైదరాబాద్లో మోహన్ రెడ్డి నూతన ఎమ్మెల్సీకి నాయక్కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా MLC మట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ వారిని నాయకత్వం గుర్తిస్తుందన్నారు.
KMR: నేడు కలెక్టరేట్లోని సమావేశం మందిరంలో ప్రజల నుండి వచ్చే ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విక్టర్ పేర్కొన్నారు. సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులను ఆన్లైన్లో నమోదు చేసి రసీదులను అందజేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ చందర్, ఆర్డీవో, ఏవో, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
WGL: ప్రభుత్వ డిగ్రీ కళాశాల నర్సంపేట (అటానమస్) ఆవరణలో గల మామిడి తోట ప్రస్తుత సంవత్సర కాపును వేలం వేయుటకు నిర్ణయించినట్లు ప్రిన్సిపల్ మల్లం నవీన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వేలంలో పాల్గొనాలనుకునే వారు కళాశాలలో ఈ నెల 18న మధ్యాహ్నం 2 గంటలకు హాజరు కావాలని కోరారు. ఇతర వివరాలకు సంప్రదించాలని సూచించారు.
KMR: జాతీయ రహదారి 161లో సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. నర్సింగ్ రావు పల్లి నుంచి పిట్లం వైపు బైకుపై వెళ్తున్న క్రమంలో మరో బైక్ వెనక నుంచి ఢీ కొట్టిందని హైవే సిబ్బంది తెలిపారు. ఈ ప్రమాదంలో నర్సింగ్ రావుపల్లి గ్రామానికి చెందిన రమేశ్ గౌడ్కి గాయాలు కాగా అంబులెన్స్లో పిట్లం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు హైవే సిబ్బంది తెలిపారు.