• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

‘శాంతి భద్రతల పరిరక్షణలో అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి’

SRCL: శాంతిభద్రతల పరిరక్షణలో అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని, జిల్లా ఎస్పీ మహేష్. బి.గితే సూచించారు. మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలకేంద్రంలోని పోలీస్ స్టేషన్‌ను ఎస్పీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన సిబ్బందికి పలు సూచనలు చేశారు. ప్రజల వద్ద నుండి ఫిర్యాదులు స్వీకరించి బాధితులకు న్యాయం చేయాలన్నారు.

March 18, 2025 / 05:19 PM IST

కలెక్టరేట్‌ను ముట్టడించిన అంగన్వాడీలు

WNP: కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్వాడీలు వనపర్తి కలెక్టరేట్ ముట్టడి నిర్వహించారు. ఆంజనేయులు, రాజు, శారద మాట్లాడుతూ.. ఎన్నికల ముందు అంగన్వాడీలకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయలేదన్నారు. వెంటనే డిమాండ్లను పరిష్కరించకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

March 18, 2025 / 05:17 PM IST

’15 రోజుల్లో పరిష్కరిస్తాం’

BDK: జిల్లాలో 2 రోజుల పర్యటనలో భాగంగా జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్, కావడిగుడ్ల, కొండారెడ్ల గ్రామంలో మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా గిరిజనులు ఎదుర్కొంటున్న పోడు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. గిరి వికాస్ పథకం ద్వారా కరెంటు బోర్ మోటార్ల ఏర్పాటు చేస్తామన్నారు. 15 రోజులలో పోడు సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

March 18, 2025 / 04:59 PM IST

పారిశుద్ధ్య కార్మికులకు అవగాహన సదస్సు

JGL: మెట్‌పల్లి పట్టణ మున్సిపల్ కమిషనర్ టి. మోహన్ ఆధ్వర్యంలో మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులకు అవగాహన సదస్సు నిర్వహించి హెల్త్ చెకప్ చేశారు. ఈ సంద్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. పారిశుద్ధ్య కార్మికులకు హెల్త్ చెకప్ చేయించి, అవసరమైన వారికి మందులు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు.

March 18, 2025 / 04:47 PM IST

‘వర్గీకరణ అమలయ్యే వరకు నియామకాలు నిలిపివేయాలి’

KMM: ఎస్సీ వర్గీకరణ అమలయ్యే వరకు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నియామకాలను నిలిపివేయాలని ఎమ్మార్పీఎస్ మండల నాయకులు వెంకటేశ్వరరావు అన్నారు. మంగళవారం వేంసూరు మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపట్టారు. కాగా ఈ దీక్ష శిబిరాన్ని మండల బీజేపీ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి సందర్శించి సంఘీభావం తెలిపారు.

March 18, 2025 / 04:03 PM IST

పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష కిట్ల పంపిణీ

HNK: ధర్మసాగర్ మండల కేంద్రంలో నేడు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పదవ తరగతి విద్యార్థులకు సక్సెస్ కిటును వర్ధిని ఫౌండేషన్ సభ్యులు పంపిణీ చేశారు. ఫౌండేషన్ సభ్యులు తన్నీరు రమేష్ ఆధ్వర్యంలో 2000 మంది విద్యార్థులకు కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బొడ్డు లేనిన్, చిలుక విన్నూ, మురళి పాల్గొన్నారు.

March 18, 2025 / 03:26 PM IST

ఉపాధి హామీ పనులను పరిశీలించిన డీఆర్డీవో

BHPL: ఎడ్లపల్లి గ్రామ పంచాయతీలోని వాటర్ హార్వెస్టింగ్ కమ్యూనిటీ పాండ్ పనులను డీఆర్డీవో నరేశ్ సందర్శించారు. కూలీలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేసి, రోజుకు రూ.300 సంపాదించేందుకు కొలతల ప్రకారం పని చేయాలని సూచించారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, మంచినీరు, మెడికల్ కిట్స్ ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.

March 18, 2025 / 02:57 PM IST

జయ నర్సింగ్ కళాశాలను సీజ్ చేసిన అధికారులు

HNK: గత మూడేళ్లుగా మున్సిపల్ కార్పొరేషన్‌కు బకాయి పడి ఉన్న ఆస్తి పన్ను రూ. 44 లక్షలు చెల్లించని కారణంగా కమిషనర్ ఆదేశాల మేరకు హన్మకొండలోని జయ నర్సింగ్ కాలేజీని సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. పన్నులు చెల్లించాలని కోరుతూ రెడ్ నోటీస్ జారీ చేసిన ఎలాంటి స్పందన లేకపోవడంతో నర్సింగ్ కళాశాల విద్యార్థులను సిబ్బందిని బయటికి పంపించి సీజ్ చేశారు.

March 18, 2025 / 02:00 PM IST

“బీసీలను బీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలు విస్మరించింది”

MBNR: గడచిన పది సంవత్సరాల కాలం బీఆర్ఎస్ ప్రభుత్వం బీసీలను పూర్తిగా విస్వరించిందని టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి జహీర్ అక్తర్ విమర్శించారు. జిల్లా కేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దక్కుతుందన్నారు.

March 18, 2025 / 01:52 PM IST

ఎదులాపురం మున్సిపల్ ఛైర్మన్‌గా ఆళ్ల శ్రీనివాస్

KMM: ఎదులాపురం మున్సిపాలిటీ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్‌గా మంగళవారం ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఖమ్మం మార్కెట్ కమిటీ ఛైర్మన్ మరియు కాంగ్రెస్ నాయకులు వారిని మర్యాదపూర్వకంగా కలిసి అభినందలు తెలిపారు. అనంతరం ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. నూతనంగా ఏర్పడిన ఎదులాపురం మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.

March 18, 2025 / 01:41 PM IST

‘ప్రైవేట్ వ్యక్తులతో పనులు చేయించొద్దు’

PDPL: ప్రమాదాలను అరికట్టడానికి విద్యుత్ అధికారులు పొలం బాట కార్యక్రమాలు చేపడుతున్నారని PDPL సర్కిల్ SE మాధవరావు పేర్కొన్నారు. తద్వారా రైతుల్లో, విద్యుత్ వినియోగదారుల్లో అవగాహన కలుగుతుందన్నారు. విద్యుత్ వినియోగదారులు గమనించి శాఖ పరమైన అధికారులు చేయవలసిన పనులను వ్యక్తిగతంగా/ప్రైవేట్ వ్యక్తులతో చేయించకూడదన్నారు.

March 18, 2025 / 01:29 PM IST

‘పొట్టి శ్రీరాములు యూనివర్సీటీ పేరు మార్చొద్దు’

PDPL: తెలుగు విశ్వవిద్యాలయానికి ఉన్న పొట్టి శ్రీరాములు పేరును మార్చకూడదని గోదావరిఖని ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు వెలిశెట్టి నటరాజశేఖర్ అన్నారు. ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలువురు ప్రతినిధులు మాట్లాడుతూ.. ఆర్యవైశ్యుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రభుత్వం పేరు మార్పిడి విధానాన్ని ఉపసంహరించుకోవాలన్నారు.

March 18, 2025 / 12:55 PM IST

ఈనెల 25న ప్రభుత్వ పథకాలపై అవగాహన సదస్సు

SRCL: కలెక్టరేట్లో ఈనెల 25న కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు జిల్లా పరిశ్రమల శాఖ మేనేజర్ హనుమంతరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. విశ్వకర్మ, ఎంప్లాయిమెంట్ జనరేషన్ ప్రోగ్రాం, ఫోర్మాలైజెసన్ అఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ పథకాలపై అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు.

March 18, 2025 / 12:38 PM IST

హత్య కేసులో ప్రధాన నిందితుడు అరెస్ట్

BHPL: సామాజిక కార్యకర్త రాజలింగమూర్తి హత్య కేసులో కీలక పరిణామం మంగళవారం భూపాలపల్లిలో చోటుచేసుకుంది. హత్య కేసులో ఏరిగా బీఆర్ఎస్ నేత హరిబాబు 24 రోజులుగా పోలీసుల కళ్లుగప్పి పరారీలో ఉన్నాడు. ఇతను మాజీ ఎమ్మెల్యే గండ్ర ప్రధాన అనుచరుడు. మాజీ ఎమ్మెల్యే గండ్ర ఆదేశాలతోనే తన భర్త హత్యకు హరిబాబు స్కెచ్ వేశాడని రాజలింగం భార్య సరళ ఆరోపించింది.

March 18, 2025 / 11:14 AM IST

‘ఎమ్మెల్యేను పరామర్శించిన డిప్యూటీ సీఎం’

NGKL: అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ అనారోగ్యానికి గురై బంజారాహిల్స్ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మంగళవారం ఆస్పత్రికి వెళ్లి ఎమ్మెల్యే వంశీకృష్ణను పరామర్శించారు. అనారోగ్యానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మెరుగైన వైద్యసేవలు అందించాలని వైద్యులకు సూచించారు.

March 18, 2025 / 11:10 AM IST