• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

తాటి చెట్టు నుంచి పడి గీత కార్మికుడికి తీవ్ర గాయాలు

KNR: హుజురాబాద్ మున్సిపల్ పరిధిలోని ఇప్పల నర్సింగాపూర్‌కు చెందిన పల్లె రవి అనే గీత కార్మికుడు తాటి చెట్టుపై నుంచి పడి తీవ్రంగా గాయపడ్డాడు. రోజువారి విధుల్లో భాగంగా చెట్టు ఎక్కిన రవి దిగే సమయంలో ప్రమాదవశాత్తు కింద పడిపోయాడు. సహచరులు వెంటనే గమనించి 108 అంబులెన్స్ ద్వారా హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం వరంగల్‌కు తరలించారు.

March 23, 2026 / 06:36 AM IST

కెరమెరిలో డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు

ASF: కెరమెరిలోని సాకడ ఎక్స్ రోడ్డు వద్ద ఎస్సై మధుకర్ ఆదివారం రాత్రి డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ద్విచక్రవాహనాలను ఆపి వారికి బ్రీత్ ఎనలైజర్‌‌తో తనిఖీలు చేశారు. మద్యం తాగి వాహనాలు నడిపినా, ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోయినా, అనుమతి పత్రాలు లైసెన్స్ లేకపోయినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

March 23, 2026 / 06:33 AM IST

ఇసుక అక్రమ రవాణా.. ఇద్దరిపై కేసు నమోదు

GDWL: ఊట్కూర్ మండలంలోని నాగిరెడ్డిపల్లి గ్రామ శివారులో వాగు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు దాడి చేశారు. తనిఖీలలో ఎలాంటి ప్రభుత్వ అనుమతి లేకుండా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో నాగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన మాణిక్యప్ప, కురుమూర్తులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రమేశ్ తెలిపారు.

March 23, 2026 / 06:33 AM IST

స్టెరాయిడ్ ఇంజెక్షన్లు సీజ్.. ఇద్దరు అరెస్ట్

హైదరాబాద్‌లోని చాదరాఘాట్‌లో చార్మినార్ టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు చేశారు. స్టెరాయిడ్స్ ముఠా గుట్టురట్టు చేసి,20 స్టెరాయిడ్ ఇంజెక్షన్లు, 3 ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో షేక్ సమీర్, వసీం ఖాన్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ నుంచి కొరియర్ ద్వారా తెప్పించి విక్రయాలు చేస్తున్నట్లు గుర్తించారు.

March 23, 2026 / 06:30 AM IST

ఫోన్ హ్యాక్ చేసి ఖాతా ఖాళీ చేసిన సైబర్ కేటుగాళ్లు

MBNR: బాలానగర్‌లో ఫోన్ హ్యాక్ చేసి సైబర్ నేరగాళ్లు రూ.50 వేలు కాజేసిన ఘటన చోటుచేసుకుంది. బాధితుడు రవి తెలిపిన వివరాలు.. ఫోన్ స్క్రీన్ గీతలు వచ్చి స్విచ్ ఆఫ్ అయింది. తిరిగి ఆన్ చేసి చూడగా ఖాతాలోని నగదు మాయమైంది. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. గుర్తుతెలియని లింకులు, యాప్‌ల పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.

March 23, 2026 / 06:30 AM IST

పిచ్చి కుక్కల దాడిలో వృద్ధురాలికి తీవ్రగాయాలు

MNCL: తాండూర్ మండలం అచ్చులాపూర్‌కి చెందిన కొండపెల్లి బయమ్మ అనే వృద్ధురాలిపై ఆదివారం రాత్రి పిచ్చి కుక్కలు దాడి చేయగా ఆమె తీవ్రంగా గాయపడింది. గమనించిన కుటుంబసభ్యులు బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షించి మెరుగైన వైద్యం కోసం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారని పేర్కొన్నారు.

March 23, 2026 / 06:30 AM IST

నేరడిగుంటలో ఆసుపత్రి నిర్మాణ పనుల పరిశీలన

SRD: ఆందోల్ మండలం నేరడిగుంట గ్రామంలో నిర్మిస్తున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పనులను జోగిపేట మార్కెట్ కమిటీ ఛైర్మన్ మక్త జగన్మోహన్ రెడ్డి పరిశీలించారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ రూ.2.50 కోట్లు మంజూరు చేశారని ఆయన తెలిపారు. నేరడిగుంటలో ప్రాథమిక కేంద్రం లేకపోవడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారని, మంత్రి చొరవతో ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న కళ నేరవేరిందని పేర్కొన్నారు.

March 23, 2026 / 06:29 AM IST

వాహనాల దొంగను పట్టుకున్న పోలీసులు

MDK: మెదక్ పట్టణంలో రాందాస్ చౌరస్తా వద్ద వాహనాలను దొంగతనం చేస్తున్న వల్లేపు గోపాల్‌‌ను పోలీసులు పట్టుకున్నారు. అతన్ని విచారించగా మెదక్ పట్టణం చర్చ్ కాంపౌండ్‌లో 2 దొంగతనాలు చేసినట్లు ఒప్పుకొన్నాడు. అనంతరం రిమాండ్‌కు పంపినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడుపై మెదక్, పెద్ద శంకరం పేట, కామారెడ్డి జిల్లాల్లో కేసులు ఉన్నాయని పేర్కొన్నారు.

March 23, 2026 / 06:25 AM IST

నేడు రాములోరి గోత్రనామాలపై హైకోర్టులో విచారణ

BDK: రాములోరి గోత్రనామాలపై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది. భద్రాచలం రామయ్య కళ్యాణం సందర్భంగా తెరపైకి రాములు వారి గోత్రనామాల వివాదం బయటికి వచ్చింది. గోత్రనామాల వివాదం 2022 నుంచి హైకోర్టులో విచారణ కొనసాగుతుంది. కాగా, ఐదుగురు పండితులతో హైకోర్టు విచారణ కమిటీ ఏర్పాటు చేయగా, రిపోర్టును ఆ కమిటీ దేవాదాయ శాఖకు సమర్పించింది.

March 23, 2026 / 06:24 AM IST

ఉత్సాహంగా ‘ఎద్దుల బండలాగు’ పోటీలు

GDWL: అయిజ మండలం చిన్న తాండ్రపాడులో సత్యమాంబ ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన ఎద్దుల బండలాగు పోటీలు అలరించాయి. ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ యూనియన్ ఛైర్మన్ సుధాకర్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీల్లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి ఎద్దుల జతలు పాల్గొన్నాయి. విజేతలకు సాయంత్రం నగదు బహుమతులు, షీల్డ్స్ అందజేసి రైతులను అభినందించారు.

March 23, 2026 / 06:22 AM IST

కాంగ్రెస్‌ది దగాకోరు బడ్జెట్‌: మాజీ ఎమ్మెల్యే

BHNG: కాంగ్రెస్‌ ప్రభుత్వం అసెంబ్లీలో దగాకోరు బడ్జెట్‌ను ప్రవేశపెట్టిందని ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతా విమర్శించారు. తెలంగాణ ప్రజలను మరోసారి వంచించే బడ్జెట్‌ ఇది అని పేర్కొన్నారు. రేవంత్‌ సర్కార్‌ ఒంటెద్దు పోకడలతో నియంతలా వ్యవహరిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం భువనగిరి పట్టణంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో వారు మాట్లాడారు.

March 23, 2026 / 06:16 AM IST

భద్రాచలానికి గోటి తలంబ్రాలు పంపిణీ

SDPT: భద్రాద్రి రామయ్య కళ్యాణం సందర్భంగా రాంసాగర్ రామాలయం నుంచి గోటి తలంబ్రాలు భద్రాచలానికి తరలించేందుకు సిద్ధం చేశారు. శ్రీరామకోటి భక్త సమాజం అధ్యక్షుడు రామకోటి రామరాజు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా భక్తులు సమకూర్చిన తలంబ్రాలను ఆదివారం రామరాజుకు అందజేశారు. భక్తితో సమర్పించిన ఈ తలంబ్రాలు రామయ్య సేవలో భాగం కావడం అదృష్టమన్నారు.

March 23, 2026 / 06:16 AM IST

గరికపాటి వ్యాఖ్యలపై ఉపాధ్యాయ సంఘాల ఆగ్రహం

SRCL: ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకంపై ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలను ధర్మ టీచర్ యూనియన్ (DTU), TPTF సంఘాలు తీవ్రంగా ఖండించాయి. ఆదివారం వేములవాడలో నిర్వహించిన కార్యక్రమంలో యూనియన్ నేతలు సంపతి రమేశ్, దూస సంతోశ్ మాట్లాడుతూ.. పేద విద్యార్థుల పౌష్టికాహారం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకంపై మాట్లాడడం సరికాదన్నారు.

March 23, 2026 / 06:10 AM IST

నేడు మండలంలో వార్డ్ మెంబర్లకు శిక్షణ తరగతులు

KMM: కామేపల్లి మండల పరిధిలోని పంచాయతీ వార్డు మెంబర్లకు ఈరోజు నుంచి ఈనెల 28 వరకు శిక్షణ తరగతులను కామేపల్లి రైతు వేదికలో నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో జి.రవీందర్, ఎంపీవో వీవీఎస్ శాస్త్రి తెలిపారు. 12 పంచాయతీలకు సంబంధించిన 114 మంది వార్డు మెంబర్లుకు తొలి విడతలో శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. వార్డు మెంబర్లు సకాలంలో శిక్షణ కార్యక్రమానికి హాజరు కావాలని కోరారు.

March 23, 2026 / 06:10 AM IST

నేడు అసెంబ్లీ ముట్టడికి పిలుపు.. హైఅలర్ట్

HYD: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు పిలుపు మేరకు ఇవాళ అసెంబ్లీని బీజేపీ నేతలు ముట్టడించనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను విస్మరించిందని, పాలనలో అవినీతి, కమీషన్ల దందా పెరిగిపోయిందని బీజేపీ ఆరోపిస్తోంది. నిరుద్యోగులు, రైతుల సమస్యల మీద ప్రభుత్వ వైఫల్యాలను నిలదీసేందుకు శ్రేణులు భారీగా తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు.

March 23, 2026 / 06:09 AM IST