MDK: నర్సాపూర్ జవహర్ విద్యాలయం(వర్గల్)లో 2025-26 విద్యాసంవత్సరం ప్రవేశాలకు శనివారం ప్రవేశపరీక్ష నిర్వహించనున్నట్లు క్లస్టర్ స్థాయి అధికారి డాక్టర్ రవి, బ్లాక్ అధికారి తారాసింగ్లో ఒక ప్రకటనలో తెలిపారు. బీయూపీ ఎస్ 216, విష్ణు ఉన్నత పాఠశాలలో 173 మంది పరీక్షలు రాయనున్నారు. నిర్ణీత సమయానికి పరీక్షకు హాజరు కావాలని సూచించారు.
SDPT: తొగుట మండలంలో శనివారం దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పర్యటించనున్నట్లు బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టు నుంచి దుబ్బాక ప్రధాన కాలువకు నీటిని విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. మధ్యాహ్నం 2:45 గంటలకు ఎమ్మెల్యే నీటిని విడుదల చేస్తున్నట్లు తెలిపారు.
NLG: ప్రజా సంఘాలకు మద్దతుగా ఉండి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం కోరారు. శుక్రవారం గట్టుప్పల్ మండల కేంద్రంలో ప్రజాసంఘాల సభ్యత్వం నమోదు కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
NLG: సీపీఐ జిల్లా కార్యదర్శి నెల్లి కంటి సత్యం తల్లి నెల్లికంటి పార్వతమ్మ అనారోగ్యంతో ఇటీవల మరణించారు. శుక్రవారం మునుగోడులో ఆమె చిత్రపటానికి బీజేపీ రాష్ట్ర నాయకులు పిల్లి రామరాజు యాదవ్ పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించారు. అనంతరం సత్యం కుటుంబాన్ని పరామర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సురిగి చలపతి, పందుల యాదయ్య తదితరులు పాల్గొన్నారు.
NLG: ప్రభుత్వం సంక్షేమ పథకాలకు అర్హులను గుర్తించాలని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనిత రామచంద్రన్ ఆదేశించారు. శుక్రవారం కనగల్లో కొత్త రేషన్ కార్డుల మంజూరి కోసం అధికారులు చేపట్టిన సర్వేను పరిశీలించారు. రైతు భరోసాపై కలెక్టర్ ఇలా త్రిపాఠితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ బి. పద్మ తదితరులు పాల్గొన్నారు.
HYD: తుర్కయంజాల్ మున్సిపాలిటీ రాగన్నకూడా వద్ద బైక్ – కార్ ఢీకొట్టడంతో రోడ్డు ప్రమాదం జరిగింది. ఇబ్రహీంపట్నం నుంచి వేగంగా వచ్చిన బైకర్స్.. కారు ఢీ కొట్టడంతో అదుపుతప్పి కింద పడిపోయారు. బైక్పై ప్రయాణిస్తున్న ఇద్దరికీ స్వల్ప గాయాలయ్యాయి. కొద్దిసేపటి వరకు రోడ్డంతా ట్రాఫిక్తో నిండిపోయింది. గాయాలైన వారిని దగ్గరలో ఉన్న ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
HYD: JNTU అఫిలియేటెడ్ కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకి సంబంధించి అఫిలియేటెడ్ ఆడిట్ సెల్ డైరెక్టర్ తారా కళ్యాణి ఆధ్వర్యంలో వర్సిటీలో ఫ్యాకల్టీలకు ఇంటర్వ్యూలో నిర్వహించారు.17వ తేదీ నుంచి 20 వరకు ఈ ఇంటర్వ్యూలు కొనసాగుతాయని వర్సిటీ ఇంఛార్జ్ వీసీ బాల క్రిష్టారెడ్డి తెలిపారు. రసాయన, ఆంగ్ల, గణిత శాస్త్ర విభాగానికి సంబంధించి అభ్యర్థులకు ఇంటర్వూలు నిర్వహించారు.
HYD: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలపై BJP ఎంపీ DK అరుణ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఎవరెన్ని కుట్రలు చేసినా.. ఢిల్లీ పీఠం తమదేనని, కాంగ్రెస్కు గుణపాఠం ఖాయమని ఎంపీ అన్నారు. ఢిల్లీలో పరిపాలన గాడి తప్పిందని, ప్రజల అవసరాలు తీర్చడం, నమ్మకాన్ని నిలబెట్టుకోవడంలో ఆప్ ఫెయిల్ అయ్యిందని, ఢిల్లీ ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్నారు.
HYD: రాష్ట్రపతి భవన్లో జరిగిన జాతీయ క్రీడా అవార్డుల ప్రదానోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా తెలంగాణ క్రీడా రత్నం, వరంగల్ ముద్దుబిడ్డ పారా ఓలింపియన్ అథ్లెట్ దీప్తి జీవంజి అవార్డులు అందుకున్నారు. ఈ సందర్భంగా జీవంజికి సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు.
HYD: తెలంగాణలో మందు బాబులకు సర్కార్ షాకివ్వనుంది. మద్యం ధరలు పెంచేందుకు రంగం సిద్దం చేస్తోంది. అయితే గత 4 ఏళ్లుగా రాష్ట్రంలో మద్యం ధరలు పెంచకుండా స్థిరంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే సదరు మద్యం కంపెనీలు.. ధరలు పెంచాలని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నారు.
SDPT: సైదాపూర్ మండలంలో ఇటీవల మరణించిన పలువురి కుటుంబాలను మంత్రి పొన్నం ప్రభాకర్ పరామర్శించారు. దుద్ధినపల్లిలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన పొన్నం మహేందర్ కుటుంబాన్ని పరామర్శించారు. వెన్నెంపల్లిలో పేరాల శ్రీకాంత్ రావు, సోమారంలో పిట్టల లక్ష్మి చిత్రపటాలకు నివాళులు అర్పించారు. వారి కుటుంబాలను పరామర్శించి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
HYD: అభివృద్ధి పనులపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎంఐఎం ఎమ్మెల్సీ మిర్జా రేహమత్ బేగ్ అన్నారు. శుక్రవారం చార్మినార్ జోనల్ కమిషనర్ వెంకన్న, టౌన్ ప్లానింగ్ అధికారులతో ఎమ్మెల్సీ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా చార్మినార్ పరిధిలోని అభివృద్ధి పనులు, సమస్యలపై చర్చించారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యా దులను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ ఉండాలని ఎమ్మెల్సీ సూచించారు.
HYD: సంక్రాంతి పండగ నేపథ్యంలో హైదరాబాద్ వాసులంతా సోంతూళ్లకు వెళ్లారు. దీంతో నగరంలో వాయు కాలుష్యం తగ్గుముఖం పట్టింది. ముఖ్యంగా నివాస వాణిజ్య ప్రాంతాల్లో కాలుష్య కారకాలు గణనీయంగా తగ్గిపోగా… పారిశ్రామిక వాడల్లో మాత్రం కాస్త అధికంగా నమోదైంది. ఈ నేపథ్యంలో సంక్రాంతి పండుగ ముగియడంతో మళ్లీ హైదరాబాదులో కాలుష్యం గణనీయంగా పెరిగిపోతుందని అధికారులు పేర్కొన్నారు.
మేడ్చల్: మీర్పేట హౌసింగ్ బోర్డు కాలనీ డివిజన్ ఓల్డ్ మీర్పేట్ ఎన్టీఆర్ నగర్లో మున్సిపల్ అధికారులతో కలిసి మల్టీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏర్పాటు విషయమై బండబావి స్థలాన్ని ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సందర్శించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో విశాలమైన స్థలం ఉందని, ఈ స్థలం అభివృద్ధి దృష్ట్యా అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులతో చర్చించారు.
HYD: కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి పని చేస్తోందని ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంఛార్జ్ మందుమూల పరమేశ్వర్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఇవాళ మల్లాపూర్ కురుమ సంఘం నాయకులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కురుమ సంఘం నాయకులు ఆయనకు తలపాగను చుట్టి కురుమల సాంప్రదాయాన్ని చాటుకున్నారు.