• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

వాహనం ఢీకొని విద్యుత్ ఉద్యోగి మృతి

MHBD: గూడూరు మండలం బొద్దుగొండ సమీపంలోనున్న గండి తండ వద్ద సోమవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భూపతిపేట సబ్ స్టేషన్‌లో విధులు ముగించుకొని తిరిగీ ఇంటికి వస్తుండగా తండా యకాస్వామి తలపై నుంచి దూసుకెళ్లిన గుర్తుతెలియని వాహనం. మృతుడుది తొర్రూర్ మండలం పోలేపల్లి గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు నమోదు చేసినట్లు తెలిపారు.

March 17, 2025 / 08:08 PM IST

48 మొబైల్ ఫోన్లను బాధితులకు అప్పగింత

KMM: పోగొట్టుకున్న 48 మొబైల్ ఫోన్లను సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ పోర్టల్ ద్వారా ట్రాక్ చేసి బాధితులకు అప్పగించినట్లు అడిషనల్ DCPఆడ్మీన్ నరేష్ కుమార్ తెలిపారు. బాధితులు పోగొట్టుకున్న/చోరీకి గురైన మొబైల్ ఫోన్ను CEIRపోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టి వాటిని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. వీటి విలువ రూ.7 లక్షలని పేర్కొన్నారు.

March 17, 2025 / 07:12 PM IST

BC గురుకుల విద్యాలయాల్లో దరఖాస్తుల ఆహ్వానం

BDK: బీసీ గురుకుల విద్యాలయాల్లో 2025–2026 విద్యా సంవత్సరానికి గానూ 6, 7, 8, 9వ తరగతి (ఇంగ్లిషు మీడియం)లో ఖాళీగా ఉన్న బ్యాక్లాగ్ సీట్లకు ప్రవేశం కొరకు దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్లు ఉమ్మడి ఖమ్మం జిల్లా బీ.సీ గురుకుల ఆర్సీఓ సి.హెచ్. రాంబాబు సోమవారం తెలిపారు. ఆసక్తిగల బాల-బాలికలు 150 రూపాయల రుసుముతో దరఖాస్తు చేసుకోవాలన్నారు.

March 17, 2025 / 06:49 PM IST

రేపు కలెక్టరేట్ కార్యాలయంలో రక్తదాన శిబిరం

HNK: హనుమకొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం మొదటి అంతస్తులోని జిల్లా ట్రెజరీ కార్యాలయంలో రేపు మంగళవారం ప్రత్యేక రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినట్లు జిల్లా అధికారి అక్కవరం శ్రీనివాస్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. తల సేమియా బాధితుల కోసం రక్తం సేకరించడం కోసం శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ ప్రావీణ్య రక్తదాన శిబిరాన్ని ప్రారంభించనున్నారు.

March 17, 2025 / 06:30 PM IST

ప్రజావాణిలో 76 ఆర్జీలు: కలెక్టర్

HNK: వివిధ సమస్యలపై ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన అర్జీలను సంబంధిత శాఖల అధికారులు త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ పి. ప్రావీణ్య ఆదేశించారు. సోమవారం హనుమకొండ కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి వివిధ సమస్యల పరిష్కారానికై 76 ఆర్జీలు వచ్చాయని కలెక్టర్ తెలిపారు. సమస్యలను పెండింగ్ లేకుండా త్వరగా పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలన్నారు.

March 17, 2025 / 06:14 PM IST

‘పరీక్ష కేంద్రాల పరిసరాల్లో 163 సెక్షన్ అమలు చేయాలి’

BHPL: పదవ తరగతి విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోవడానికి వీలుగా రూట్లు వారిగా అదనపు బస్సులు ఏర్పాటు చేయాలని భూపాలపల్లి కలెక్టర్ రాహుల్ శర్మ ఆర్టీసీ సీఎంకు సూచించారు. పరీక్ష కేంద్రాల పరిసరాల్లో 163 సెక్షన్ అమలు చేయాలని పోలీస్ అధికారులకు సూచించారు. పరీక్షా కేంద్రాల సమీపంలో ఉన్న అన్ని జిరాక్స్ కేంద్రాలను మూసివేయాలని సూచించారు.

March 17, 2025 / 06:10 PM IST

మిర్చి కల్లాన్ని తగలబెట్టిన ఇద్దరు నిందితులు అరెస్ట్

BDK: పినపాక మండలం వెంకట్రావుపేట గ్రామంలో ఇటీవల 76 క్వింటాల మిర్చి కల్లాన్ని తగలబెట్టిన ఇద్దరు నిందితులను సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. వ్యక్తిగత వివాదాల నేపథ్యంలో మిర్చి కల్లాన్ని తగలబెట్టినట్లు ఎస్ఐ రాజ్ కుమార్ వివరాలు వెల్లడించారు. నిందితులపై కేసు నమోదు చేసి డిమాండ్‌కు తరలిస్తున్నట్లు పేర్కొన్నారు.

March 17, 2025 / 06:08 PM IST

నూతన ఎమ్మెల్సీని కలిసిన డీసీసీ అధ్యక్షుడు

NZB: ఇటీవల ఎమ్మెల్యే కోటాలో MLCగా ఏకగ్రీవంగా ఎన్నికయిన నల్గొండ డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్‌ను నిజామాబాద్ డీసీసీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. సోమవారం హైదరాబాద్‌లో మోహన్ రెడ్డి నూతన ఎమ్మెల్సీకి నాయక్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా MLC మట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ వారిని నాయకత్వం గుర్తిస్తుందన్నారు.

March 17, 2025 / 04:04 PM IST

‘ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదును సత్వరమే పరిష్కరించాలి’

KMR: నేడు కలెక్టరేట్‌లోని సమావేశం మందిరంలో ప్రజల నుండి వచ్చే ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విక్టర్ పేర్కొన్నారు. సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులను ఆన్లైన్‌లో నమోదు చేసి రసీదులను అందజేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ చందర్, ఆర్డీవో, ఏవో, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

March 17, 2025 / 11:15 AM IST

‘డిగ్రీ కళాశాలలో మామిడి తోట కాపు వేలం’

WGL: ప్రభుత్వ డిగ్రీ కళాశాల నర్సంపేట (అటానమస్) ఆవరణలో గల మామిడి తోట ప్రస్తుత సంవత్సర కాపును వేలం వేయుటకు నిర్ణయించినట్లు ప్రిన్సిపల్ మల్లం నవీన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వేలంలో పాల్గొనాలనుకునే వారు కళాశాలలో ఈ నెల 18న మధ్యాహ్నం 2 గంటలకు హాజరు కావాలని కోరారు. ఇతర వివరాలకు సంప్రదించాలని సూచించారు.

March 17, 2025 / 11:10 AM IST

‘జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం’

KMR: జాతీయ రహదారి 161లో సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. నర్సింగ్ రావు పల్లి నుంచి పిట్లం వైపు బైకుపై వెళ్తున్న క్రమంలో మరో బైక్ వెనక నుంచి ఢీ కొట్టిందని హైవే సిబ్బంది తెలిపారు. ఈ ప్రమాదంలో నర్సింగ్ రావుపల్లి గ్రామానికి చెందిన రమేశ్ గౌడ్‌కి గాయాలు కాగా అంబులెన్స్‌లో పిట్లం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు హైవే సిబ్బంది తెలిపారు.

March 17, 2025 / 11:09 AM IST

అసెంబ్లీ‌లో మంత్రి పొన్నం ప్రభాకర్‌తో సమావేశమైన ఎమ్మెల్యే అది

SRCL: అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ బీసీ ఎమ్మెల్యేలతో మంత్రులు పొన్నం ప్రభాకర్ కొండ సురేఖ సోమవారం సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్‌లు ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. శాసన సభలో బీసీలకు స్థానిక సంస్థల్లో, విద్యా, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో సమావేశమయ్యారు.

March 17, 2025 / 10:41 AM IST

అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన పట్టణ అధ్యక్షుడు

KMM: తల్లాడ మండల కేంద్రంలో సోమవారం పలు అభివృద్ధి పనులకు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దగ్గుల నాగిరెడ్డి శంకుస్థాపన చేశారు. సీసీ రోడ్డు లేక స్థానిక ప్రజలు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యే రాగమయి ప్రభుత్వం నుంచి నిధులను మంజూరు చేయించి పనులను చేపట్టినట్లు పట్టణ అధ్యక్షుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

March 17, 2025 / 10:35 AM IST

మిర్చి దండలు వేసుకొని నిరసన తెలిపిన ఎమ్మెల్సీ

ఖమ్మం: రాష్ట్ర ప్రభుత్వం మిర్చి పంటకు మద్దతు ధర ప్రకటించి కొనుగోళ్లు చేపట్టాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ డిమాండ్ చేశారు. సోమవారం శాసనమండలి ఆవరణంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలతో కలిసి తాతా మధు మిర్చి రైతులకు మద్దతుగా ధర్నా చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం క్వింటా మిర్చి పంటను రూ. 25 వేలకు కొనుగోలు చేయాలని పేర్కొన్నారు.

March 17, 2025 / 10:24 AM IST

ఓయూ బంద్‌కు ABVP పిలుపు

HYD: ఓయూలో ఆందోళనలు, నిరసన ప్రదర్శనలకు ఇక మీదట అనుమతి లేదని తాజాగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇది నియంతృత్వ పోకడ అంటూ ABVP మండిపడుతోంది. అధికారుల తీరుకు వ్యతిరేకంగా నేడు ఉస్మానియా యూనివర్సిటీ బంద్‌కు నాయకులు పిలుపునిచ్చారు. రిక్రూట్‌మెంట్, నిధుల కొరత, ఆహార నాణ్యత అంశాలపై విద్యార్థులు ప్రశ్నిస్తున్నారనే నేపంతో ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపిస్తున్నారు.

March 17, 2025 / 06:58 AM IST