NZB: నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడానికి ఆదివారం జిల్లాకు వస్తున్న ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటన నూడ ఛైర్మన్ కేశవేణు తెలిపారు. జిల్లా కేంద్రంలో అమృత్ పథకం కింద 18 మంచినీటి ట్యాంకుల నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేయనున్నారు. ఈ సందర్భంగా మంత్రి పైలాన్ ఆవిష్కరించనున్నారు.
NZB: పురుగుల మందు తాగి ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడినట్లు మూడో టౌన్ ఎస్సై హరిబాబు శనివారం తెలిపారు. ఎస్సై వివరాల ప్రకారం.. నిజామాబాద్ హమాల్వాడికి చెందిన నాగం సాయికుమార్ మద్యానికి బానిసై తరచూ భార్యతో గొడవ పడేవాడు. దీంతో అతని భార్య పుట్టింటికి వెళ్లిందనే మనస్తాపంతో పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.
JGL: కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ నూతన ఈవోగా శ్రీకాంత్ రావు శనివారం బాధ్యతలు స్వీకరించారు. కొండగట్టు ఈవోగా పనిచేసిన రామకృష్ణారావును సికింద్రాబాద్లోని గణేష్ ఆలయానికి బదిలీ చేసిన విషయం తెలిసిందే. కాగా.. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఈవో శ్రీకాంత్ రావు ఆలయ పరిసర ప్రాంతాలను కలియ తిరిగి పరిశీలించారు.
NZB: వేల్పూర్ మండలం రామన్నపేటకు చెందిన నేరేళ్ళ శ్రీధర్ గౌడ్కు భూభౌతిక శాస్త్రం(Geophysics)లో ఉస్మానియా యూనివర్సిటీ డాక్టరేట్ ప్రదానం చేశారు. ప్రొఫెసర్ వీరయ్య పర్యవేక్షణలో ” జియోఫిజికల్ స్టడీస్ ఫర్ డిలీనియేషన్ ఆఫ్ సబ్సర్ఫేస్ స్ట్రక్చరల్ కన్ఫిగరేషన్ & మినెరలైజ్డ్ జోన్స్ ఇన్ నార్త్- ఈస్టర్న్ ధర్వర్ క్రేటన్, ఇండియ” అనే అంశంపై పరిశోధన చేశారు.
KNR: జిల్లా పట్టు పరిశ్రమల సహాయ అధికారిగా మహమ్మద్ రషీద్ పదోన్నతి పొందారు. భీమదేవరపల్లి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన రషీద్ హుజురాబాద్ డివిజన్ సెరికల్చర్ అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. శాఖాపరమైన అర్హతలు ఉన్నందున రషీద్ సహాయ పట్టు పరిశ్రమ అధికారిగా పదోన్నతి కల్పిస్తూ డైరెక్టర్ ఆఫ్ సెరికల్చర్ యాస్మిన్ భాష ఉత్తర్వులు జారీ చేశారు.
JGL: జిల్లాలో సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి శనివారం రూ.2,49,539 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ. 1,31,444 ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.95,765, అన్నదానం రూ.22,330, వచ్చినట్లు ఆలయ కార్యనిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలిపారు.
మేడ్చల్: సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు గొప్ప వరమని మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి అన్నారు. శామీర్పేట మండలం మజీద్ పూర్ గ్రామానికి చెందిన అబ్బగౌని శంకరమ్మకు మంజూరైన సీఎంఆర్ఎఫ్ రూ.52,500 చెక్కును ఆమె కొడుకు బిక్షపతికి మల్లారెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు వెంకట్ రెడ్డి, శ్రీకాంత్ గౌడ్, వెంకటయ్య గౌడ్ పాల్గొన్నారు.
SRPT: సూర్యాపేటలో బొడ్రాయి బజార్ వద్ద వేదాంత భజన మందిరంలో శనివారం గోదాదేవి రంగనాథ స్వామి కళ్యాణం, సీతారామచంద్ర మాస కళ్యాణ, మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. గోదాదేవి రంగనాథ కళ్యాణ మహోత్సవం సందర్భంగా స్వామివారికి పంచామృత అభిషేకం, స్వామివారికి పట్టు వస్త్రాలు దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో సమర్పించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దర్శించుకున్నారు.
KNR: తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి వద్ద శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గోలి చంద్రారెడ్డి (55) దుర్మరణం చెందారు. బైక్పై వెళుతున్నప్పుడు కారు ఢీకొనడంతో ఆయన అక్కడికక్కడే మరణించారు. ఈ విషయం తెలిసిన వెంటనే మానకొండూర్ శాసనసభ్యుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ హుటాహుటిన ప్రమాదస్థలికి చేరుకున్నారు.
SRPT: జాజిరెడ్డిగూడెం మండలం రామన్నగూడెంలో భూముల సర్వేను శనివారం మండల ప్రత్యేక అధికారి శ్రీధర్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని, అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా అధికారులు చూడాలన్నారు. వారి వెంట తహశీల్దార్ శ్రీనివాసులు, ఏవో గణేష్, ఆర్ఐ ప్రసన్న, శోభారాణి, సిబ్బంది పాల్గొన్నారు.
KNR: తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీ కాలనీలోని దుర్గాబాయి దేశ్ ముఖ్ మహిళా ప్రాంగణాన్ని మానకొండూర్ శాసనసభ్యుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ శనివారం సందర్శించారు. ఈ సందర్శన సందర్భంగా ఆయన ప్రాంగణంలో ఉన్న వివిధ భవనాలను, కుట్టు శిక్షణ కేంద్రాన్ని పరిశీలించి సౌకర్యాలపై ఆరా తీశారు. అనంతరం ప్రాంగణ అభివృద్ధిపై ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో సమావేశం అయ్యారు.
SRPT: నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపిన మహనీయుడు నందమూరి తారక రామారావు అని టీడీపీ నియోజకవర్గ ఇంఛార్జ్ నాతల రాంరెడ్డి అన్నారు. శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ పార్కులో ఎన్టీఆర్ 29వ వర్ధంతి వేడుకల్లో పాల్గొని, ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాలకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.
SRPT: 76వ గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ తేజాస్ నంద్ లాల్ పవార్ అన్నారు. శనివారం సూర్యాపేట జిల్లాలోని ఐడిఓసి ప్రదాన సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. వేడుకలకు అన్ని ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
NLG: ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి, స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని ఎమ్మెల్యే బాలు నాయక్ అన్నారు. శనివారం నేరేడుగొమ్ము మండల కేంద్రంలో నిర్వహించిన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా చూడాల్సిన బాధ్యత కార్యకర్తలదేనన్నారు.
HYD: జహీరాబాద్ డిపోలో శనివారం నిర్వహించిన డయల్ యువర్ డీఎం కార్యక్రమానికి విశేషణ స్పందన లభించిందని డీఎం జాకీర్ హుస్సేన్ తెలిపారు. జహీరాబాద్ నుంచి హైదరాబాద్కు ప్రయాణికుల సంఖ్యను బట్టి బస్సులు పెంచాలని అప్పం శ్రావణ్ కుమార్ కోరగా, మొగడం పల్లి వద్ద బస్సులు ఆపడం లేదని జంసెద్ అహ్మద్ అనే ప్రయాణికుడు ఫిర్యాదు చేశారని తెలిపారు.