• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

ఎడ్యుకేషన్ ఫెయిర్‌ను ప్రారంభించిన మేయర్

KMM: తెలంగాణ విద్యా సమితి ఆధ్వర్యంలో ఖమ్మం స్వర్ణభారతి ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన ఎడ్యుకేషన్ ఫెయిర్‌ను మేయర్ పునకొల్లు నీరజ ప్రారంభించారు. ప్రముఖ యూనివర్సిటీ ప్రతినిధులు పాల్గొన్న ఈ వేదిక విద్యార్థులకు తల్లిదండ్రులకు ఎంతో ఉపయోగకరమని ఆమె తెలిపారు. మారుతున్న కాలానికి అనుగుణంగా కోర్సుల ఎంపికలో అప్రమత్తంగా ఉండాలని విద్యార్థులకు సూచించారు.

March 22, 2026 / 04:39 PM IST

‘బీజేపీ పాలనలో ప్రజలకు ఎలాంటి మేలు జరగలేదు’

MNCL: దేశంలో బీజేపీ పాలనలో ప్రజలకు ఎలాంటి మేలు జరగలేదని పీడీఎస్యూ జిల్లా ఉపాధ్యక్షుడు సికందర్ ఆరోపించారు. ఆదివారం జైపూర్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఈనెల 23 నుంచి 30 వరకు జరగనున్న భగత్ సింగ్, రాజ్ గురు, సుక్ దేవ్ 95వ వర్ధంతి సభల పోస్టర్లను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. యువత డ్రగ్స్, గంజాయి, మాదక ద్రావ్యాల మత్తులో ఉన్నారని తెలిపారు.

March 22, 2026 / 04:36 PM IST

ఘాట్‌కేసర్‌లో 20 రోజులకు గ్యాస్ సిలిండర్ డెలివరీ

MDCL: ఘట్‌కేసర్, పోచారం, అన్నోజిగూడ, సింగపూర్ టౌన్షిప్ ఏరియాల్లో నివాసం ఉంటున్న గ్యాస్ వినియోగదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సిలిండర్ బుక్ చేసిన 15 నుంచి 20 రోజుల తర్వాత డెలివరీ అవుతున్నట్లుగా తెలిపారు. మార్చి మొదటి వారంలో బుక్ చేసిన వారికి ఇటీవలే గ్యాస్ డెలివరీ జరిగింది. డెలివరీ ఆలస్యం జరుగుతుండడంతో ఇబ్బందులు పడుతున్నామన్నారు.

March 22, 2026 / 04:34 PM IST

చలి వేంద్రాన్ని ప్రారంభించిన సర్పంచ్

ADB: నార్నూర్ మండలంలోని కొత్తపల్లి(H) గ్రామంలో ఆదివారం సర్పంచ్ చౌహన్ డిగంబర్ చలి వేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ.. వేసవి కాలం ప్రారంభమైన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లలను అనవసరంగా ఇళ్ల నుంచి బయటకు వెళ్లకుండా దృష్టి పెట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో సక్రు, అగన్, గ్రామస్థులు పాల్గొన్నారు.

March 22, 2026 / 04:30 PM IST

జనగణలో బీసీ కుల గణన చేపట్టాలి: బీసీ జేఏసీ

NLG: జనగణనలో బీసీ కులగణన చేపట్టాలనే ప్రధాన డిమాండ్‌తో ఢిల్లి లోని జంతర్ మంతర్ వద్ద జరిగే ధర్నా కార్యక్రమానికి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరే దురంతో ఎక్స్‌ప్రెస్ వద్ద బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ జండా ఊపి ప్రారంభించారు. కొన్ని దశాబ్దాలుగా దేశవ్యాప్తంగా సమగ్ర కులగణను చేపట్టాలని కోరారు.

March 22, 2026 / 04:30 PM IST

బెజ్జంకిలో పోచమ్మ బోనాలు

SDPT: బెజ్జంకి మండలం తిమ్మాయపల్లి గ్రామంలో పోచమ్మ తల్లి బోనాలు ఘనంగా నిర్వహించారు. మహిళలు బోనాలు ఎత్తుకుని పోతారాజుల విన్యాసాలతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని భక్తి శ్రద్ధలతో మొక్కులు సమర్పించారు. గ్రామ ప్రజల ఆయురారోగ్యాలు, వర్షాలు సమృద్ధిగా కురవాలని ప్రార్థించారు. కార్యక్రమంలో సర్పంచ్, ఉపసర్పంచ్, గ్రామస్థులు పాల్గొన్నారు.

March 22, 2026 / 04:30 PM IST

సీఎం సభకు తరలివెళ్లిన కాంగ్రెస్ నాయకులు

సిద్దిపేట జిల్లా నర్మెట్టలో సీఎం రేవంత్ రెడ్డి ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవ సభకు హుస్నాబాద్ చెందిన రైతులు, నాయకులు తరలివెళ్లారు. ఈ కార్యక్రమంలో 2వ వార్డు కౌన్సిలర్ బూరుగు లత కృష్ణ స్వామి, 10వ వార్డ్ కౌన్సిలర్ సావుల మంజుల, మాలపల్లె గ్రామ సర్పంచ్ వెన్న స్వర్ణలత -రాజు, సావుల వెంకటస్వామి, బూరుగు సతీష్, నల్వాల ఆనందం తదితరులు పాల్గొన్నారు.

March 22, 2026 / 04:29 PM IST

‘ప్రజా సంక్షేమ పథకాలను గడపగడపకూ చేరవేయాలి’

MDK: జిల్లాలోని రామాయంపేట పట్టణంలో నిర్వహించిన ‘దీన్ దయాల్ ఉపాధ్యాయ’ ప్రశిక్షణ కార్యక్రమంలో మూడు జిల్లాల బీజేపీ ఇంఛార్జ్ రంజిత్ మోహన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..​ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికీ చేరవేసి, పార్టీని బూత్ స్థాయి నుంచి బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.

March 22, 2026 / 04:25 PM IST

విగ్రహ ప్రతిష్టాపనకు ఎంపీకి ఆహ్వానం

SRD: గడ్డపోతారం మున్సిపాలిటీ మాదారం గ్రామంలో పంచముఖి హనుమాన్ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి మెదక్ పార్లమెంట్ సభ్యుడు రఘునందన్ రావును ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, బీజేపీ నాయకులు కలిసి పాల్గొన్నారు. ఈ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు కొనసాగుతున్నాయని తెలిపారు.

March 22, 2026 / 04:22 PM IST

వార్డు సభ్యులకు శిక్షణ కార్యక్రమం

SRCL: తంగళ్ళపల్లిలోని ఎంపీడీవో కార్యాలయంలో వార్డు సభ్యులకు ఆదివారం శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. గ్రామాలను అభివృద్ధి చేయడంలో వార్డు సభ్యుల పాత్ర చాలా కీలకమన్నారు. ప్రతి వార్డు సభ్యుడు గ్రామ అభివృద్ధి కోసం పాటుపడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీవో మీర్జా, వార్డు సభ్యులు కీర్తన, పద్మ తదితరులు పాల్గొన్నారు.

March 22, 2026 / 04:20 PM IST

’27న సీతారాముల కళ్యాణం వేడుకలు’

MBNR: మిడ్జిల్ మండలం వెలుగోముల గ్రామంలో ఈనెల 27న శ్రీసీతారాముల కళ్యాణ మహోత్సవం నిర్వహించనున్నారు. ఆదివారం సర్పంచ్ సువర్ణమ్మ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించి ఏర్పాట్లపై చర్చించారు. కళ్యాణం, అన్నదాన ఖర్చులను కటికి నిరంజన్ భరించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ ఛైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, గ్రామస్థులు పాల్గొన్నారు.

March 22, 2026 / 04:20 PM IST

ఈనెల 27న వరంగల్‌లో ‘హిందూ సంకల్ప యాత్ర బైక్ ర్యాలీ’

WGL: BJP రాష్ట్ర అధికార ప్రతినిధి చికోటి ప్రవీణ్ ఈనెల 27న నగరానికి రానున్నట్లు హిందూ సేవా సమితి అధ్యక్షులు నాగపురి వెంకటేష్ తెలిపారు. శ్రీరామనవమి సందర్బంగా నిర్వహించే ‘హిందూ సంకల్ప యాత్ర బైక్ ర్యాలీ’లో ఆయన పాల్గొంటారన్నారు. KZP కడిపికొండ బ్రిడ్జి వద్ద ఈ ర్యాలీ ప్రారంభమై WGLచౌరస్తా వరకు జరుగుతుందని, అనంతరం ముగింపు సభ ఉంటుందని, విజయవంతం చేయాలని కోరారు.

March 22, 2026 / 04:20 PM IST

నర్మెట్లలో రైతు ఉత్సవాలకు తరలిన రైతులు

PDPL: సిద్దిపేట జిల్లా నర్మెట్టలో జరిగే రైతు ఉత్సవాలకు పాలకుర్తి మండలానికి చెందిన రైతులు 2 ప్రత్యేక బస్సులలో బయలుదేరినట్లు AO బండి ప్రమోద్ కుమార్ తెలిపారు. మండలంలోని సుమారు 60 మంది రైతులు, అభ్యుదయ రైతులు రైతు మేళాకు తరలి వెళ్లారు. ఆధునిక వ్యవసాయ సాగు విధానాలపై శాస్త్రవేత్తలు రైతు మేళాలో అవగాహన కల్పించనున్నట్లు AO తెలిపారు.

March 22, 2026 / 04:13 PM IST

‘జనగణనలో వివరాలు కచ్చితత్వంతో ఉండాలి’

JN: జనగణన ప్రక్రియలో అన్ని వివరాలు కచ్చితత్వంతో ఉండాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. జనగణన-2027 ఫేస్-1గృహ గణన నిర్వహణపై టెక్నికల్ అసిస్టెంట్లు, ఛార్జ్ క్లర్క్‌లకు ఏర్పాటు చేసిన 3 రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ఇవాళ ప్రారంభించారు. సాంకేతిక పరికరాల వినియోగంతో డేటా సేకరణలో పారదర్శకత ఉండాలని ఆదేశించారు.

March 22, 2026 / 04:12 PM IST

మృతుల కుటుంబాలను పరామర్శించిన మట్ట దయానంద్

KMM: సత్తుపల్లి మండలం నారాయణపురం వద్ద ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలను కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకులు డాక్టర్‌ మట్టా దయానంద్‌ ఆదివారం పరామర్శించారు.పెనుబల్లి మండలం మండాలపాడుకు చెందిన మృతుడు పానెం సులోమాన్ నివాసానికి వెళ్లిన ఆయన సులోమాన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు.

March 22, 2026 / 04:08 PM IST