NZB: మాదకద్రవ్యాల మహమ్మారిని జిల్లా నుంచి తరిమికొట్టేందుకు ప్రజలందరూ పోలీసులతో కలిసి నడవాలని సీపీ సాయి చైతన్య పిలుపునిచ్చారు. డ్రగ్స్ వాడకం లేదా విక్రయాల గురించి మీ చుట్టుపక్కల ఏదైనా అనుమానాస్పద సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలపాలని సూచించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు అత్యంత గోప్యంగా ఉంచుతామని ఆయన హామీ ఇచ్చారు.
SRPT: ఆద్య పాలకుడు శాలివాహన చక్రవర్తి జయంతిని ఈరోజు పెన్ పహాడ్ మండల కేంద్రంలో కుమ్మర సంఘం నాయకులు జయరామకృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. శాలివాహన మొట్టమొదటి తెలుగు చక్రవర్తి అని వారు తెలిపారు. కుమ్మరుల ఆర్థిక, విద్యా, వైద్య అభివృద్ధికి ప్రభుత్వం తోడ్పాటును అందించాలన్నారు.
నల్లగొండ క్యాంపు కార్యాలయంలో శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆదివారం సీఎంఆర్ఎఫ్ పథకం ద్వారా మంజూరు అయిన రూ.19 లక్షల విలువగల చెక్కులను 48 మంది లబ్ధిదారులకు అందజేశారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. పేద ప్రజల సంక్షేమం కొరకు రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని, రాష్ట్రాభివృద్ధి కొరకు అనేక సంక్షేమ పథకాలు సీఎం నేతృత్వంలో అమలు అవుతున్నాయని చెప్పారు.
NRML: కుబీర్ మండలంలోని సోమేశ్వర్, బ్రాహ్మశ్వర్ గ్రామాలకు రూ. 8 లక్షలు, మార్లగొండ పంచాయతీ అనుబంధ గ్రామాలకు రూ. 21 లక్షలు, సేవాదాస్ నగరానికి రూ. 3 లక్షలు సీసీ, డ్రైనేజ్ నిర్మాణానికి మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అందజేశారు. గ్రామస్తులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆదిలాబాద్ జిల్లా ఇంఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావుకు ధన్యవాదాలు తెలిపారు.
MNCL: రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్ డాక్టర్ షమీమ్ అక్తర్ జన్నారం మండలంలో పర్యటించనున్నారని జిల్లా అధికారులు వెల్లడించారు. సోమవారం జన్నారం మండలంలోని కవ్వాల్ పులుల అభయారణ్యంలో నివసిస్తున్న గిరిజనులతో సమావేశం నిర్వహించి వారికి కల్పిస్తున్న సౌకర్యాలను అధికారులతో సమీక్షిస్తారన్నారు. ప్రభుత్వ సంస్థలను సందర్శించి సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహిస్తారు.
KMM: మధిర మండలం ఆత్కూరు గ్రామ సమీపంలోని సాయి బాలాజీ కోల్డ్ స్టోరేజ్ అగ్ని ప్రమాద స్థలాన్ని ఆదివారం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అధికారులతో కలిసి పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలు నష్టం వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. మంటల పరిస్థితిపై సమీక్ష నిర్వహించి బాధిత రైతులకు తక్షణ సహాయం అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
MDK: తూప్రాన్ మండలం గుండారెడ్డిపల్లె గౌరీగుడం శివారులో వాగులో జరుగుతున్న అక్రమ ఇసుక రవాణాపై పోలీసులు, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. పక్కా సమాచారం మేరకు ఆకస్మికంగా తనిఖీలు చేపట్టి, హిటాచీ ప్రొక్లెయినర్ యంత్రంతో పాటు మూడు ట్రాక్టర్లను సీజ్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
NLG: గడ్డి కట్టలు మిషన్ కడుతుండగా అక్కడే ఉన్న ఓ మహిళకు గాయాలైన సంఘటన వేములపల్లి మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. మండలంలోని సల్కునూరు గ్రామానికి చెందిన మమత తన పొలంలో గడ్డి కట్టలు కడుతుండగా ప్రమాదవశాత్తు మిషన్లో చెయ్యి పడింది. దీంతో తీవ్ర గాయాలవగా స్థానికులు 108కు ఫోన్ చేసి మిర్యాలగూడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
BHPL: గంగారం క్రాస్ రోడ్డు కొయ్యూరులో క్రికెట్ టోర్నమెంట్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యేలు పుట్ట మధుకర్, గండ్ర వెంకటరమణారెడ్డి, BRS రాష్ట్ర నాయకులు ఎనుగుల రాకేష్ రెడ్డి ప్రారంభించారు. వారు మాట్లాడుతూ.. క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంపొందించడానికి ఎంతగానో దోహదపడతాయని, విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలన్నారు.
మహబూబ్నగర్ జిల్లా వీరన్నపేట నీలకంఠ స్వామి దేవాలయంలో బాలసంస్కార కేంద్రం ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. సుమారు 85 మంది బాలబాలికలు లింగాష్టకం, గోవింద నామావళి, హనుమాన్ చాలీసా, భగవద్గీత శ్లోకాలను భక్తితో పఠించారు. ధ్యానం, మంగళహారతి నిర్వహించి పిల్లల్లో నైతిక విలువలు పెంపొందించారు.
SRCL: నీటిని వృథా చేయవద్దని తంగళ్ళపల్లి ఎంపీడీవో లక్ష్మీనారాయణ అన్నారు. తంగళ్ళపల్లి మండలం మల్లాపూర్లో ఆదివారం జల మహోత్సవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ.. నీటిని కేవలం ఒక వస్తువుగా కాకుండా అమూల్యమైన జాతీయ ఆస్తిగా భావించాలన్నారు. నీటి విషయంలో ప్రతి గ్రామం స్వయం సమృద్ధి సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీవో మిర్జా, అధికారులు ఉన్నారు.
ASF: సిర్పూర్ మండలంలోని వివిధ గ్రామ పంచాయతీలకు చెందిన తమకు ప్రభుత్వ నుంచి జీతాలు మంజూరు చేయాలని వార్డ్ సభ్యులు కోరారు. ఈ మేరకు ఆదివారం MPDOకు వినతిపత్రం అందజేశారు. గ్రామాల అభివృద్ధి కోసం, ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం శ్రమిస్తున్న తమకు జీతం లభించకపోవడం వల్ల బాధ్యతల నిర్వహణ క్లిష్టంగా మారిందన్నారు.
PDPL: వేసవి ప్రారంభంలోనే గోదావరి నది ఎండిపోవడంతో రాష్ట్రంలో రైతులకు సాగునీరు లేక ఇబ్బంది పడుతున్నారని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. గోదావరిఖని గోదావరి నది నీటి పాయ వద్ద సీఎం చిత్రపటానికి BRS పార్టీ శ్రేణులు పిండ ప్రధానం చేశారు. ఎండిన గోదావరి నది ఇసుకలో ఆటలాడుతూ వినూత్న రీతిలో నిరసన తెలిపారు.
NZB: రెంజర్ల మండలంలోనికి చెందిన ఇద్దరు కాంగ్రెస్ నాయకులకు జిల్లా కాంగ్రెస్ కమిటీ (DCC) కార్యవర్గంలో కీలక పదవులు దక్కాయి. జిల్లా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా మగ్గిడి ముత్యం రెడ్డి, సెక్రటరీగా ఆకుల రమేష్ ఎంపికయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామన్నారు.
WGL: నగరంలోని ఏనుమాముల డివిజన్లో ఆదివారం నిర్వహించిన ‘దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ అభియాన్’లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ పాల్గొని కార్యకర్తలకు మార్గనిర్దేశం చేశారు. పార్టీ కేవలం రాజకీయ సంస్థ మాత్రమే కాకుండా దేశ నిర్మాణంలో కీలక శక్తిగా ఉందని పేర్కొన్నారు. పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ అంత్యోదయ భావనను కార్యరూపంలోకి తీసుకువెళ్లాలని సూచించారు.