NLG: కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అద్దంకి MLC రేసులో ముందు వరుసలో ఉన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎన్నో పోరాటాలు చేసిన అద్దంకి రాష్ట్రం ఏర్పడ్డాక కాంగ్రెస్లో చేరారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తుంగతుర్తి టికెట్ ఆశించగా సామేలుకు కేటాయించడంతో నిరాశే ఎదురైంది. నామినేటెడ్ పోస్టుల భర్తీలోనూ అవకాశం దక్కలేదు.
ADB: జిల్లాలోని తెలంగాణ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో 6వ తరగతి ప్రవేశ పరీక్షను ఈ నెల 16న నిర్వహిస్తున్నట్లు గిరిజన గురుకులాల ఆర్సీఓ అగస్టిన్, ఉట్నూర్ ఈఎంఆర్ఎస్ ప్రిన్సిపల్ సౌరబ్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూర్, సిర్పూర్ కాగజ్ నగర్లో పరీక్షా సెంటర్లు ఉంటాయన్నారు.
SRD: పైపుల మరమ్మతుల కారణంగా మిషన్ భగీరథ నీటి సరఫరా 48గంటల పాటు నిలిపివేస్తున్నట్లు మిషన్ భగీరథ అధికారి విజయలక్ష్మి తెలిపారు. పైపుల లీకేజీ వల్ల 6 మండలాల్లో సంగారెడ్డి జిల్లా పరిధిలోని సంగారెడ్డి, అమీన్ పూర్, పటాన్ చేరువు, కంది, కొండాపూర్, సదాశివపేట తదితర మండలాల్లో 48 గంటల పాటు నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు తెలిపారు.
KMR: పట్టణ మున్సిపల్ అధికారులతో సోమవారం ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి సమావేశం నిర్వహించనున్నట్లు మున్సిపల్ కార్యాలయ సిబ్బంది తెలిపారు. మున్సిపల్ కార్యాలయంలో అన్ని విభాగాల అధికారులతో విడివిడిగా సమావేశం ఉంటుందని ప్రతి అధికారి, మున్సిపల్ కార్మిక సంఘాల నాయకులు సమావేశానికి హాజరు కావాలన్నారు.
NGKL: పెద్దకొత్తపల్లి మండలంలోని యాపట్ల గ్రామంలో ఆదివారం నూతనంగా నిర్మించ తలపెట్టిన 33/11 కేవీ నూతన సబ్ స్టేషన్ నిర్మాణానికి, ఎస్సీ సబ్ ప్లాన్ కింద మంజూరైన సీసీ రోడ్ల నిర్మాణానికి మంత్రి జూపల్లి భూమి పూజ చేయనున్నట్లు గ్రామ మాజీ సర్పంచ్ రంగినేని రమేశ్ రావు తెలిపారు. మంత్రి పర్యటనను కార్యకర్తలు, నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని మాజీ సర్పంచ్ తెలిపారు.
NZB: వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు సభ్యుల దొంగల ముఠాను అరెస్ట్ చేసినట్లు నిజామాబాద్ ACP వెంకట్ రెడ్డి తెలిపారు. నాగారం ప్రాంతానికి చెందిన షేక్ సాదక్, దొడ్డి కొమరయ్య కాలానికి చెందిన సురేకర్ ప్రకాశ్, సాయినాథ్ విట్టల్ రావు ముక్తే, నాగారానికి చెందిన సయ్యద్ షాదుల్లా అనే నలుగురిని అరెస్ట్ చేశామన్నారు. వీరి నుంచి రూ.10.17 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
NLG: పేదల సొంతింటికి రూపం ఇందిరమ్మ ఇల్లు అని జిల్లా ఇంఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. నల్గొండలో ఇందిరమ్మ ఇంటి నమూనాను ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్రంలో అర్హత కలిగిన నిరుపేద కుటుంబానికి ఇళ్లు వస్తాయని అన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాటి, ఎమ్మెల్యేలు బాలునాయక్, వీరేశం, జైవీర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
NLG: జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే లబ్ధిదారులకు పారదర్శకంగా సరుకులు అందించాలని లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టం తీసుకొచ్చింది. గతంలో అంగన్వాడీ లబ్ధిదారులకు అందించే సరుకుల విషయంలో జాబితాలో పేర్లు ఒకరివి ఉంటే మరొకరికి ఇస్తున్నారని ఆరోపణల నేపథ్యంలో కొత్త విధానం అమలు చేయాలని నిర్ణయించింది.
BDK: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి దేవస్థానంలో శ్రీరామ నవమి తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాలు ఈ నెల 30 నుంచి ప్రారంభమయ్యి వచ్చే నెల 12న ముగుస్తాయి. శ్రీరామ నవమి బ్రహ్మోత్సవాలు ప్రతి ఏటా చైత్ర మాసంలో నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాలలో అత్యంత పవిత్రమైన రోజు శ్రీరామ నవమి. ఈ పవిత్రమైన రోజున శ్రీసీతారామ కల్యాణం వైభవంగా నిర్వహిస్తారు.
NLG: ఈనెల 16, 17,18 తేదీల్లో హుజురాబాద్లో జరిగే రాష్ట్రస్థాయి హకి పోటీలకు ఉమ్మడి NLG జిల్లా పురుషుల హాకీ జట్టు ఎంపికలు పట్టణంలోని మేకల అభినవ స్టేడియంలో ఈనెల10న జరుగుతాయని హాకీ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఇమామ్ కరీం తెలిపారు. సెలక్షన్లో పాల్గొనే క్రీడాకారులు హాకీ ఇండియా ఐడీకార్డ్ ఆధార్ కార్డ్ వెంట తెచ్చుకోవాలన్నారు.
BDK: జిల్లా కోర్టు ఆవరణలో కొత్తగా నిర్మించిన వెయిటింగ్ హాల్ ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. నేడు జరిగే ప్రాంభోత్సవానికి ముఖ్య అతిథిగా జిల్లా పోర్టు పోలియో జడ్జి, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూరేపల్లి నందు హాజరుకానున్నారు. అదేవిధంగా హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బి.నగేష్, జస్టిస్ జె.శరత్ హైదరాబాద్ నుంచి వర్చువల్గా పాల్గొననున్నారు.
BDK: జాతీయ ఆరోగ్య మిషన్లో వైద్యాధికారుల పోస్టుల భర్తీ కొరకు ఇటీవల విడుదల చేసిన మెరిట్ జాబితాలో ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఈనెల 10వ తేదీలోగా రాతపూర్వకంగా తెలియజేయాలని డా.భాస్కర్ నాయక్ శనివారం ఒక ప్రకటనలో కోరారు. అభ్యర్థులు సంబంధిత వివరాలతో నిర్దిష్ట ఫార్మాట్లో సమర్పించాలన్నారు. పూర్తి వివరాలకు అధికార వెబ్సైట్ చూడాలని కోరారు.
KMM: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వరంలో జిల్లా వాప్తంగా నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో 19,345 కేసులు పరిష్కారమయ్యాయి. 62మోటారు వాహన ప్రమాద కేసులను పరిష్కరించి బాధితులకు రూ.2,71,77,000 నష్ట పరిహారాన్ని ఇప్పించారు. ప్రి-లిటిగేషన్ 18, క్రిమినల్ 643, 22 51, 35 2,318, 26, 78, ట్రాఫిక్ చలానాలు 16,169 పరిష్కారమయ్యాయని జిల్లా న్యాయమూర్తి తెలిపారు.
WNP: షార్ట్ సర్క్యూట్తో పూరి గుడిసె దగ్ధమైన సంఘటన పెద్దమందడి మండలం అల్వాల గ్రామంలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం అల్వాల గ్రామానికి చెందిన హరికృష్ణకు చెందిన పూరిగుడిసె విద్యుతాఘాతం వల్ల పూర్తిగా కాలిపోయింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. రూ.2 లక్షల నగదు పూర్తిగా దగ్ధమయ్యాయని బాధితుడు వాపోయాడు.
NRPT: పోలీస్ వాహనాలను కండిషన్లో ఉంచుకోవాలని ఎస్పీ యోగేష్ గౌతమ్ పోలీస్ డ్రైవర్లకు సూచించారు. శనివారం నారాయణపేట ఎస్పీ పరేడ్ మైదానంలో జిల్లాలోని పోలీస్ వాహనాలను పరిశీలించారు. వాహనాల మెయింటెనెన్స్ గురించి అడిగి తెలుసుకున్నారు. వాహనాలను ప్రతి రోజు శుభ్రపరచాలి, వాహనాల్లో సమస్యలు వస్తె వెంటనే రిపేర్లు చేయించాలని అన్నారు.