KMM: ఎస్సీ వర్గీకరణ అమలయ్యే వరకు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నియామకాలను నిలిపివేయాలని ఎమ్మార్పీఎస్ మండల నాయకులు వెంకటేశ్వరరావు అన్నారు. మంగళవారం వేంసూరు మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపట్టారు. కాగా ఈ దీక్ష శిబిరాన్ని మండల బీజేపీ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి సందర్శించి సంఘీభావం తెలిపారు.
HNK: ధర్మసాగర్ మండల కేంద్రంలో నేడు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పదవ తరగతి విద్యార్థులకు సక్సెస్ కిటును వర్ధిని ఫౌండేషన్ సభ్యులు పంపిణీ చేశారు. ఫౌండేషన్ సభ్యులు తన్నీరు రమేష్ ఆధ్వర్యంలో 2000 మంది విద్యార్థులకు కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బొడ్డు లేనిన్, చిలుక విన్నూ, మురళి పాల్గొన్నారు.
BHPL: ఎడ్లపల్లి గ్రామ పంచాయతీలోని వాటర్ హార్వెస్టింగ్ కమ్యూనిటీ పాండ్ పనులను డీఆర్డీవో నరేశ్ సందర్శించారు. కూలీలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేసి, రోజుకు రూ.300 సంపాదించేందుకు కొలతల ప్రకారం పని చేయాలని సూచించారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, మంచినీరు, మెడికల్ కిట్స్ ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
HNK: గత మూడేళ్లుగా మున్సిపల్ కార్పొరేషన్కు బకాయి పడి ఉన్న ఆస్తి పన్ను రూ. 44 లక్షలు చెల్లించని కారణంగా కమిషనర్ ఆదేశాల మేరకు హన్మకొండలోని జయ నర్సింగ్ కాలేజీని సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. పన్నులు చెల్లించాలని కోరుతూ రెడ్ నోటీస్ జారీ చేసిన ఎలాంటి స్పందన లేకపోవడంతో నర్సింగ్ కళాశాల విద్యార్థులను సిబ్బందిని బయటికి పంపించి సీజ్ చేశారు.
MBNR: గడచిన పది సంవత్సరాల కాలం బీఆర్ఎస్ ప్రభుత్వం బీసీలను పూర్తిగా విస్వరించిందని టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి జహీర్ అక్తర్ విమర్శించారు. జిల్లా కేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దక్కుతుందన్నారు.
KMM: ఎదులాపురం మున్సిపాలిటీ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్గా మంగళవారం ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఖమ్మం మార్కెట్ కమిటీ ఛైర్మన్ మరియు కాంగ్రెస్ నాయకులు వారిని మర్యాదపూర్వకంగా కలిసి అభినందలు తెలిపారు. అనంతరం ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. నూతనంగా ఏర్పడిన ఎదులాపురం మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.
PDPL: ప్రమాదాలను అరికట్టడానికి విద్యుత్ అధికారులు పొలం బాట కార్యక్రమాలు చేపడుతున్నారని PDPL సర్కిల్ SE మాధవరావు పేర్కొన్నారు. తద్వారా రైతుల్లో, విద్యుత్ వినియోగదారుల్లో అవగాహన కలుగుతుందన్నారు. విద్యుత్ వినియోగదారులు గమనించి శాఖ పరమైన అధికారులు చేయవలసిన పనులను వ్యక్తిగతంగా/ప్రైవేట్ వ్యక్తులతో చేయించకూడదన్నారు.
PDPL: తెలుగు విశ్వవిద్యాలయానికి ఉన్న పొట్టి శ్రీరాములు పేరును మార్చకూడదని గోదావరిఖని ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు వెలిశెట్టి నటరాజశేఖర్ అన్నారు. ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలువురు ప్రతినిధులు మాట్లాడుతూ.. ఆర్యవైశ్యుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రభుత్వం పేరు మార్పిడి విధానాన్ని ఉపసంహరించుకోవాలన్నారు.
SRCL: కలెక్టరేట్లో ఈనెల 25న కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు జిల్లా పరిశ్రమల శాఖ మేనేజర్ హనుమంతరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. విశ్వకర్మ, ఎంప్లాయిమెంట్ జనరేషన్ ప్రోగ్రాం, ఫోర్మాలైజెసన్ అఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ పథకాలపై అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు.
BHPL: సామాజిక కార్యకర్త రాజలింగమూర్తి హత్య కేసులో కీలక పరిణామం మంగళవారం భూపాలపల్లిలో చోటుచేసుకుంది. హత్య కేసులో ఏరిగా బీఆర్ఎస్ నేత హరిబాబు 24 రోజులుగా పోలీసుల కళ్లుగప్పి పరారీలో ఉన్నాడు. ఇతను మాజీ ఎమ్మెల్యే గండ్ర ప్రధాన అనుచరుడు. మాజీ ఎమ్మెల్యే గండ్ర ఆదేశాలతోనే తన భర్త హత్యకు హరిబాబు స్కెచ్ వేశాడని రాజలింగం భార్య సరళ ఆరోపించింది.
NGKL: అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ అనారోగ్యానికి గురై బంజారాహిల్స్ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మంగళవారం ఆస్పత్రికి వెళ్లి ఎమ్మెల్యే వంశీకృష్ణను పరామర్శించారు. అనారోగ్యానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మెరుగైన వైద్యసేవలు అందించాలని వైద్యులకు సూచించారు.
KMM: కల్లూరు సమీపంలోని నిర్మాణంలో ఉన్న గ్రీన్ ఫీల్డ్ హైవే రోడ్డు పనులు చకచకా పూర్తవుతున్నాయి. మండలంలో ముగ్గు వెంకటాపురం, లింగాల, ఓబుల్ రావు బంజర్ సమీపంలో ఉన్న బ్రిడ్జి పనులు పూర్తయ్యాయి. ఇటీవల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఓ సమావేశంలో ఆగస్టు 15 వరకు దాదాపుగా రోడ్డు పనులు పూర్తి చేసి ప్రారంభిస్తామన్నారు.
WGL: రైలు తగిలి చేయి తెగిపడ్డ ఘటన వరంగల్ రైల్వేస్టేషన్లో చోటు చేసుకుంది. వరంగల్ రామన్నపేటకు చెందిన నరసింహ (50) వరంగల్ రైల్వే స్టేషన్లో ఒకటో నంబర్ ప్లాట్ ఫాంపై నిలుచున్నాడు. అప్పుడే వచ్చిన జైపూర్ ఎక్స్ప్రెస్ అతడికి తగలడంతో చేయి తెగి పడింది. వెంటనే రైల్వే సిబ్బంది 108కు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అంబులెన్స్ సిబ్బంది, ప్రథమ చికిత్స అందించారు.
SRD: భద్రాచలం సీతారాముల తలంబ్రాలను ఆర్టీసీ కార్గో ద్వారా ఇంటి వద్దకే అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు రీజనల్ మేనేజర్ ప్రభులత మంగళవారం తెలిపారు. ఏప్రిల్ 6వ తేదీ వరకు లాజిస్టిక్ కేంద్రాలు 150 రూపాయలు చెల్లించి బుక్ చేసుకోవాలని చెప్పారు. సీతారాముల కళ్యాణం తర్వాత ఇంటికి వచ్చి తలంబ్రాలను తమ సిబ్బంది అందిస్తారని పేర్కొన్నారు.
NLG: ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 12 నియోజకవర్గాలకు ప్రభుత్వం ఇఫ్తార్ విందుకు నిధులు విడుదల చేసింది. నియోజకవర్గాల వారీగా నిధులు (రూ.లక్షలలో) నల్గొండ-5, మిర్యాలగూడ-4, దేవరకొండ-3, సాగర్-3, నకిరేకల్-3, మునుగోడు-3, కోదాడ-4, సూర్యాపట-3, హుజూర్ నగర్-3, తుంగతుర్తి-3, భువనగిరి-3, ఆలేరు-2 లక్షలు నిధులు మంజూరు చేసింది.