PDPL: వేసవి ప్రారంభంలోనే గోదావరి నది ఎండిపోవడంతో రాష్ట్రంలో రైతులకు సాగునీరు లేక ఇబ్బంది పడుతున్నారని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. గోదావరిఖని గోదావరి నది నీటి పాయ వద్ద సీఎం చిత్రపటానికి BRS పార్టీ శ్రేణులు పిండ ప్రధానం చేశారు. ఎండిన గోదావరి నది ఇసుకలో ఆటలాడుతూ వినూత్న రీతిలో నిరసన తెలిపారు.
NZB: రెంజర్ల మండలంలోనికి చెందిన ఇద్దరు కాంగ్రెస్ నాయకులకు జిల్లా కాంగ్రెస్ కమిటీ (DCC) కార్యవర్గంలో కీలక పదవులు దక్కాయి. జిల్లా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా మగ్గిడి ముత్యం రెడ్డి, సెక్రటరీగా ఆకుల రమేష్ ఎంపికయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామన్నారు.
WGL: నగరంలోని ఏనుమాముల డివిజన్లో ఆదివారం నిర్వహించిన ‘దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ అభియాన్’లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ పాల్గొని కార్యకర్తలకు మార్గనిర్దేశం చేశారు. పార్టీ కేవలం రాజకీయ సంస్థ మాత్రమే కాకుండా దేశ నిర్మాణంలో కీలక శక్తిగా ఉందని పేర్కొన్నారు. పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ అంత్యోదయ భావనను కార్యరూపంలోకి తీసుకువెళ్లాలని సూచించారు.
HNK: కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను బీజేపీ శ్రేణులు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పెసరు విజయ్ చందర్ రెడ్డి అన్నారు. పరకాలలో ముఖ్య నేతల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జీజేపీ స్థానిక నాయకులు పాల్గొన్నారు.
ADB: సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ఉందని జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి బాలూరి గోవర్ధన్ రెడ్డి అన్నారు. జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి మాట్లాడారు. రేషన్ కార్డు గల ప్రతి కుటుంబానికి రూ. 5 లక్షల జీవిత భీమా పథకం రాష్ట్రానికి గర్వకారణమని పేర్కొన్నారు.
GDWL: రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీల పట్ల మొండివైఖరి ప్రదర్శిస్తోందని బీఆర్ఎస్ నేత అతీక్కుర్ రెహమాన్ మండిపడ్డారు. గద్వాల కార్యాలయంలో మాట్లాడుతూ.. బడ్జెట్లో మైనారిటీల సంక్షేమానికి నిధులు తగ్గించారని ఆరోపించారు. రంజాన్ తోఫాల పంపిణీలో అవినీతి జరిగిందని, కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. మైనారిటీల సంక్షేమాన్ని విస్మరించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
SRD: విద్యారంగానికి 20 శాతం నిధులు కేటాయించాలని కోరుతూ సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఈనెల 24వ తేదీన ధర్నా నిర్వహిస్తున్నట్లు టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సోమశేఖర్, రామచందర్ తెలిపారు. ఇవాళ సంగారెడ్డిలోని సంఘ భవనంలో వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం బడ్జెట్లో 8.2 శాతం నిధులు కేటాయించడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
NLG: గుండ్లపల్లి(డిండి) మండలం ఖానాపూర్లో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను, సీసీ రోడ్ల నిర్మాణ పనులను ఎమ్మెల్యే బాలునాయక్ ఆదివారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు అందుతుందని తెలిపారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని అన్నారు. ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి ఉందని తెలిపారు.
MDCL: కాప్రా, ఘట్కేసర్, మేడిపల్లి మండలాలకు వాట్సప్ మెసేజ్ ద్వారా ఆదాయ, OBC ఇతర ధ్రువీకరణ పత్రాల కోసం అనేకమంది దరఖాస్తు చేసుకున్నప్పటికీ, దరఖాస్తులు పెండింగ్లో ఉంటున్నట్లుగా దరఖాస్తుదారులు తెలిపారు. ఇప్పటికి 3 మండలాల పరిధిలో 12కు పైగా పెండింగ్ ఉన్నట్లుగా పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నత యంత్రాంగం తగిన విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.
WGL: నగరంలోని బస్టాండ్ సెంటర్లో యూత్ ఫర్ సొసైటీ ఆధ్వర్యంలో 34వ ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా నీటి పొదుపుపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. సోసైటీ రాష్ట్ర అధ్యక్షులు కోడిమాల శ్రీనివాసరావు, పర్యావరణవేత్త ప్రొఫెసర్ రతన్ సింగ్ ఠాగూర్ పాల్గొని మంచినీటి ప్రాముఖ్యతను వివరించారు. ఈ ఏడాది “నీరు-లింగ సమానత్వం” అనే థీమ్తో ప్రజల్లో అవగాహన పెంపొందించడమే లక్ష్యమని తెలిపారు.
RR: చేవెళ్ల నియోజకవర్గం పూలపల్లి గ్రామంలోని 4వ, 6వ వార్డు మెంబర్లుతో పాటు సర్పంచ్ భాగ్యలక్ష్మి మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో చేవెళ్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ భీమ్ భరత్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిని చూసి పార్టీలో చేరుతున్నారని భీమ్ భరత్ అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
NRML: దిలావర్పూర్ మండలంలోని లంబడి తండా గ్రామంలో నియంత్రిక కెపాసిటీ తక్కువగా ఉండటం సమస్యగా మారింది. వార్డు మెంబర్ రాథోడ్ రవి, గ్రామస్తులతో కలిసి విద్యుత్ అధికారులకు తెలియజేశారు. లైన్మెన్, అసిస్టెంట్ లైన్మెన్, తిరుపతి విద్యుత్ సిబ్బంది రెండు రోజుల్లో కొత్త నియంత్రిక ఏర్పాటు చేసి సమస్యను తీర్చారు. గ్రామస్తులు అభినందనలు తెలిపారు.
MNCL: జన్నారం మండలంలోని వివిధ గ్రామాల శివార్లలో భూగర్భ జలాలు పెరిగే విధంగా చర్యలు తీసుకుంటున్నామని ఈజీఎస్ మండల ఏపీవో రవీందర్ తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. గ్రామాలలో ఉన్న నిరుపేదలకు ఈజీఎస్, అటవీ శాఖల ఆధ్వర్యంలో అటవీ సమీప గ్రామాల శివారులో ట్రెంచ్, కందకాలను రెండు సంవత్సరాలుగా తవ్వడం జరుగుతుందన్నారు. ఆయా పనులు భూగర్భ జలాల పెంపునకు ఎంతో దోహదపడ్డాయన్నారు.
SDPT: భద్రాచల సీతారాముల కళ్యాణానికి అందించే కోటి తలంబ్రాల దీక్షలో భాగంగా ఇవాళ గజ్వేల్ మున్సిపల్ మాజీ ఛైర్మన్ రాజమౌళి అనసూయ దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామనామ స్మరణ చేస్తూ గోటితో వడ్లను ఓలిచి శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ వ్యవస్థాపక, అధ్యక్షుడు రామకోటి రామరాజుకు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. గోటి తలంబ్రాల్లో రామకోటి రామరాజు కృషి అమోఘం అని పేర్కొన్నారు.
BDK: పాల్వంచ మండలం, జగన్నాధపురం ప్రారంభంలో పెద్దమ్మతల్లి గుడి సమీపంలో మార్బుల్ స్టోన్ లోడ్తో వెళ్తున్న ట్రాలీ లారీ ఆదివారం అదుపుతప్పి డివైడర్పైకి ఎక్కింది. సేఫ్టీ చర్యలు లేకపోవడం వల్ల ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.