KMR: బిక్కనూర్ మండలంలోని ఇసన్న పల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేసేందుకు , ఎప్పటికప్పుడు లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తున్నామని, పంచాయతీ కార్యదర్శి సుమేధ చెప్పారు. సోమవారం గ్రామంలో ఇందిరమ్మ పథకం ద్వారా, ఇల్లు నిర్మించుకున్న లబ్ధిదారుడి ఇంటిని, స్థానిక సర్పంచ్ మేకల రాములుతో కలిసి ఆమె ప్రారంభించారు.
SRCL: విద్యార్థినిలు వేధింపులపై నిర్భయంగా సంప్రదించాలని ఎస్పీ మహేష్ బి గీతే అన్నారు. సిరిసిల్లలోని ఎస్పీ కార్యాలయంలో సోమవారం ఆయన మాట్లాడారు. మార్చి నెలలో షీ టీంకు అందిన ఫిర్యాదులపై మూడు FIRలు, 4 పెట్టి కేసులు నమోదు చేశామన్నారు. మహిళలు, విద్యార్థినిలను వేధిస్తున్న వ్యక్తులను గుర్తించి వారికి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇచ్చామని పేర్కొన్నారు.
SDPT: బెజ్జంకి మండలం వీరాపూర్ గ్రామంలో యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. మెరుగు భాగ్యరెడ్డి (35) ఆదివారం సాయంత్రం తనకు చెందిన వ్యవసాయ బావిలో దూకి ప్రాణాలు తీసుకున్నాడు. సోమవారం ఉదయం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దాచారం గ్రామానికి చెందిన గజఈతగాళ్లతో శవాన్ని బయటకు తీశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
NRPT: మరికల్ మండల కేంద్రంలో సోమవారం బిజెపి ఆవిర్భావ దినోత్సవం పార్టీ మండల శాఖ అధ్యక్షుడు వేణుగోపాల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పాత బస్టాండ్ దగ్గర పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. బీజేపీ ద్వారానే గ్రామలు అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో రమేష్, రాజేష్,మోహన్ రెడ్డి, బాలరాజుగౌడ్, శివకుమార్, రాము, అశోక్, శ్రవణ్, తదితరులు పాల్గొన్నారు6.
NLG: చిట్యాల పట్టణ 9వ వార్డుకు చెందిన మునుగోటి వెంకన్న అకాల మరణంతో వారి 2006-07 పదో తరగతి మిత్రులు మానవత్వాన్ని చాటుకున్నారు. అందరూ కలిసి రూ.1,23,000 సేకరించి, వెంకన్న కుమార్తె రేణుక పేరున పోస్టాఫీసులో ‘సుకన్య సమృద్ధి యోజన’ కింద డిపాజిట్ చేశారు. ఆ పత్రాలను కుటుంబ సభ్యులకు సోమవారం అందజేసి భవిష్యత్తులోనూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
BHPL: గోరికొత్తపల్లి మండలం నిజాంపల్లి గ్రామంలో BJP 46వ ఆవిర్భవ దినోత్సవ వేడుకలు BJP భూత్ ఇంఛార్జ్ రంగినేని కమలాకర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కమలాకర్ జెండా ఆవిష్కరించారు. ముఖ్య అతిథిగా BJP మండల అధ్యక్షుడు విష్ణు యాదవ్ మాట్లాడుతూ.. పార్టీ బలోపేతానికి అందరూ కృషి చేయాలి అని పిలుపునిచ్చారు. BJP నేతలు తదితరులు పాల్గొన్నారు.
KMR: నిజాంసాగర్ ప్రాజెక్టు ప్రధాన కాలువ ద్వారా పంట సాగు కోసం 5వ విడతలో భాగంగా సోమవారం 1,300 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు ఏఈఈ అక్షయ్ కుమార్ తెలిపారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 17.802 టీఎంసీలు కాగా ప్రస్తుతం 8.887 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు వెల్లడించారు. ఈ నీటితో ఆయా పరిధిలోని రైతులు నీటిని పొదుపుగా పంట సాగుకు ఉపయోగించుకోవాలన్నారు.
మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ రజనీకుమారి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి మాట్లాడారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను ప్రాధాన్యత క్రమంలో త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యంగా భూ సమస్యలు, ఇతర సివిల్ దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి బాధితులకు న్యాయం చేయాలని కోరారు.
ADB: CM పర్యటన నేపథ్యంలో ఇంద్రవెల్లి మండలం ముత్నూరికి చెందిన ఎమ్మారర్పీఎస్ రాష్ట్ర నాయకుడు బాలాజీ కాంబ్లే సహా పలువురు నాయకులను సోమవారం పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. బాలాజీ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కును అడ్డుకోవడం సిగ్గుచేటన్నారు. అక్రమ అరెస్టులతో తమను ఆపలేరని డిమాండ్ చేశారు.
ASF: జిల్లా జైనూర్కు చెందిన మవాలే దత్త మాంగ్కు దళిత రత్న అవార్డు లభించింది. హైదరాబాద్లోని రవీంద్రభారతిలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చేతుల మీదుగా ఈ అవార్డును అందజేశారు. రాష్ట్రవ్యాప్తంగా నలుగురికి ఈ పురస్కారం ప్రదానం చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
WNP: గోపాలపేట మండలంలో రిజర్వాయర్ నిర్మాణం వల్ల రైతాంగం దాదాపు 10 వేల ఎకరాలు నష్టపోతుందని బీఆర్ఎస్ జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ అన్నారు. అఖిలపక్ష వ్యతిరేక పోరాట సమితి 98 రోజు నుంచి చేపడుతున్న నిరసన దీక్షకు వారు సంపూర్ణ మద్దతు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు న్యాయం చేయకుండా నష్టం కలిగించే పనుల్లో చేపడుతున్నారని విమర్శించారు.
KMR: దోమకొండకోట కేవలం ఒక కట్టడం కాదు, అది 18వ శతాబ్దపు అద్భుత కళాఖండం. మొఘల్, రాజస్థానీ శైలి కలయికతో కూడిన వాస్తుశిల్పాన్ని అధ్యయనం చేయవచ్చు. కోట లోపలి ‘అద్దాల మేడ’లో అలంకరణలు, చెక్కతో చేసిన కిటికీలు ఆనాటి కళాపోషణకు నిదర్శనం. యునెస్కో మెరిట్ అవార్డు పొందిన ఈ కోటలో రక్షణ కోసం నిర్మించిన భారీ బురుజులు, రాతి ప్రాకారాలు శత్రువు నుంచి రక్షణ పొందే వ్యూహాలను చూడొచ్చు.
నల్గొండ పట్టణ కేంద్రంలో బీజేపీ 47వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది. పట్టణ అధ్యక్షుడు గర్రె మురళి జెండా ఆవిష్కరించి, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చా రాష్ట్ర ప్రతినిధి చిన్నేని జానీ, సైదులు, శ్రీను, రేణుక తదితరులు పాల్గొని పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
NZB: సిరికొండ మండలం రామడుగులో రూ. 2.10 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను సర్పంచ్ వరలక్ష్మి సంతోష్ పంపిణీ చేశారు. రూరల్ ఎమ్మెల్యే ఆర్. భూపతి రెడ్డి ఆదేశాల మేరకు.. లబ్ధిదారులు ఆకుల లక్ష్మి, సాయిలు, రమ్య, నరసయ్యలకు ఈ ఆర్థిక సాయం అందజేశారు. అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న పేదలకు ఈ నిధులు ఎంతో ఆసరాగా నిలుస్తాయని సర్పంచ్ పేర్కొన్నారు.
NRML: బాసర క్షేత్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మనువడు రేయాన్స్ రెడ్డికి అక్షరాభ్యాసం చేయించారు. సోమవారం సతీమణి గీతా రెడ్డితో కలిసి అమ్మవారిని దర్శించుకున్న సీఎం, ఆలయ పండితులు సంజీవ్ ఆధ్వర్యంలో వేడుక నిర్వహించారు. మనువడిని ఒడిలో కూర్చోబెట్టుకుని పలకపై ఓనమాలు దిద్దించారు. అనంతరం గర్భగుడిలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.