ADB: భీంపూర్ మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని సోమవారం నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న మండలాధ్యక్షుడు అంకం అశోక్ మండల నాయకులతో కలిసి పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోనే అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూరిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, తదితరులున్నారు.
ADB: నార్నూర్ మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు భిక్కు రాథోడ్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎన్నో త్యాగాల పునాదిపై బీజేపీ నిర్మితమై ప్రపంచంలోనే అతిపెద్ద సభ్యత్వం కలిగిన పార్టీగా ఎదిగిందన్నారు. కార్యక్రమంలో ప్రకాష్, రాజాబాబు, హనుమంతు ఉన్నారు.
KMM: జిల్లాలో వర్షాల వల్ల విద్యుత్ అంతరాయం కలగకుండా అధికారులు 5 ఎమర్జెన్సీ రీస్టోరేషన్ టీమ్స్ను రంగంలోకి దించారు. ఐటీఐ నిపుణులతో కూడిన ఈ బృందాలు ఖమ్మం, మధిర, సత్తుపల్లిలో అందుబాటులో ఉంటాయి. వీరికి ప్రత్యేక వాహనాలు, పనిముట్లు అందించారు. సమస్య తలెత్తితే వెంటనే 1912 నంబర్కు ఫిర్యాదు చేయాలని ఎస్ఈ శ్రీనివాసాచారి సూచించారు.
ASF: దహేగాం మండలం బోర్లకుంట గ్రామపంచాయతీ పరిధి రాళ్లగూడెంలో క్రికెట్ టోర్నమెంట్ను గ్రామ సర్పంచ్ స్రవంతి – సుధాకర్ సోమవారం ఘనంగా ప్రారంభించారు. గ్రామ యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు ఈ టోర్నమెంట్ను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. సర్పంచ్ మాట్లాడుతూ.. క్రీడల ద్వారా యువత ఆరోగ్యంగా ఉండాలని, ఐక్యత పెరగాలని వారు ఆకాంక్షించారు.
KNR: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆధ్వర్యంలో ఈనెల 11న హుజురాబాద్ కందుగుల బొడ్రాయి ఆవరణలో ‘విరాట్ హిందూ సమ్మేళనం’ నిర్వహించనున్నారు. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా 8 గ్రామాలతో జరిగే ఈ కార్యక్రమ గోడపత్రికను సోమవారం ఆవిష్కరించారు. ఈ సమ్మేళనానికి హిందూవులు కుటుంబ సమేతంగా తరలివచ్చి విజయవంతం చేయాలని సమితి అధ్యక్షులు కొండం రాజేందర్ రెడ్డి కోరారు.
MNCL: ఇందారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం నాన్ కమ్యూనికబుల్ డీసీస్ (ఎన్సీడీ) క్యాంపు నిర్వహించారు. గ్రామస్థులకు పరీక్షలు చేసి అంటూ వ్యాధులు కానటువంటి జబ్బులపై వైద్య బృందం ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వైద్య బృందం, ఇందారం పాలకవర్గం పాల్గొన్నారు.
BDK: దమ్మపేట మండలం మొద్దులగూడెం గ్రామానికి చెందిన రవికుమార్, చెన్నారావు ఆర్థిక సహాయంతో ప్రాథమిక పాఠశాలకు ఆట వస్తువులు, టీవీ తదితర సామాగ్రిని అందజేశారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పాల్గొని వస్తువులను ఆవిష్కరించి పాఠశాలకు అందజేశారు. అనంతరం దాతలను అభినందించి సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.
VKB: బంట్వారం మండలంలో బోర్ల సంఖ్య తక్కువగా ఉండగా, ఒక్కో బోరుకు రెండు ట్యాంకులు కలపడంతో మోటార్లు దెబ్బ తింటున్నాయి. దీంతో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతోంది. ముఖ్యంగా దుర్గమ్మ గుడి గల్లీలో సమస్య తీవ్రంగా ఉందని స్థానికులు వాపోతున్నారు. ట్యాంక్లకు కప్పు లేక నీరు కలుషితం అవుతుందని, బోర్ల సంఖ్యను పెంచి ట్యాంక్లపై కప్పులు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు
JGL: రాయికల్ పట్టణంలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను ఇంటి పన్ను బకాయిలు ఉన్నవారు ఏప్రిల్ 1-30 లోపు చెల్లించినట్లయితే 5% రాయితీని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుందని రాయికల్ మున్సిపల్ కమిషనర్ నాగరాజు తెలిపారు. కావున పట్టణ ప్రజలు గమనించి ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఇంటి పన్ను చెల్లించి, పట్టణ అభివృద్ధికి సహకరించాలని ఆయన కోరారు.
PDPL: ప్రజలు తమ ఆహారంలో సరైన ఆహారం, సరైన సమయానికి తీసుకోవాలని DMHO డా. ప్రమోద్ కుమార్ సూచించారు. ఇవాళ ఆయన ఫుడ్ సేఫ్టీ డే లో భాగంగా పెద్దపల్లి ITI నుంచి ఆసుపత్రి వరకు నిర్వహించిన ఈట్ రైట్ అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈనెల 11 వరకు ఆరోగ్య వారోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈరోజు ఫుడ్ రిజిస్ట్రేషన్ మేళా, హోటల్స్ తనిఖీ కార్యక్రమాలు చేపడతామన్నారు.
WGL: వర్ధన్నపేట పురపాలక సంఘం 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇంటి పన్నులపై 5% డిస్కౌంట్ కల్పించినట్లు మున్సిపల్ కమిషనర్ సుధీర్ కుమార్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సదుపాయం ఏప్రిల్ 30 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. పట్టణ ప్రజలందరూ ఈ అవకాశాన్ని గమనించి సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ కోరారు.
BHPL: ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా BHPL జిల్లా కేంద్రంలో ఇవాళ కమిషనర్ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో WALKTHON నిర్వహించారు. ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ హాజరై, జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. నేటి నుంచి ఈనెల 11వ తేదీ వరకు ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు జరుగుతాయని కలెక్టర్ వెల్లడించారు.
GDWL: అయిజ మండలంలో సిమ్ మార్పు సేవలపై వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కంపెనీ నిబంధనల ప్రకారం సిమ్ మార్పుకు రూ.50 మాత్రమే వసూలు చేయవలసినప్పటికీ, కొంతమంది రిటైలర్లు రూ.200 వరకు వసూలు చేస్తున్నారు. ప్రజలు అధికారులు తక్షణమే స్పందించి న్యాయం చేయాలని కోరుతున్నారు.
MLG: ములుగు మున్సిపాలిటీలో 2026-27 ఆస్తిపన్ను ముందస్తు చెల్లింపులకు 5% రాయితీ ప్రకటించారు. మున్సిపల్ కమిషనర్ టీ. రమేష్ తెలిపిన వివరాల ప్రకారం.. పన్ను పూర్తిగా చెల్లించిన వారికి ఈ ఎర్లీబర్డ్ సదుపాయం వర్తిస్తుంది. గత ఆర్థిక సంవత్సరం బకాయిలు ఉన్నవారు ముందుగా వాటిని క్లియర్ చేస్తేనే రాయితీ పొందవచ్చు. పట్టణ ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.
HNK: ఆహార భద్రతపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, పరిశుభ్రమైన, నాణ్యమైన ఆహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. హనుమకొండ పబ్లిక్ గార్డెన్లో EAT RIGHT WALK కార్యక్రమాన్ని ఎమ్మెల్యే జెండా ఊపి ప్రారంభించారు. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లపై అవగాహన పెంపొందించడం అత్యంత అవసరమని పేర్కొన్నారు.