తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే ప్రధాన పార్టీల అభ్యర్థుల తుదిజాబితాలు వచ్చేశాయి. తాజాగా బీజేపీ 14 మందితోకూడిన లిస్టును ప్రకటించగా..నిన్న రాత్రి కాంగ్రెస్ పార్టీ కూడా నలుగురితోకూడిన జాబితాను వెలువరించింది. అయితే సీట్ దక్కిన వారు సంతోషంగా ఉండగా..రాని వారు మాత్రం తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
హైదరాబాద్ బంజారాహిల్స్ సమీపంలోని షేక్పేట్లో అత్యంత విలువైన రెండెకరాల భూమి కేటాయింపులో నిబంధనలను ఉల్లంఘించారనే ఆరోపణలపై టాలీవుడ్ సినీ దర్శకుడు కె.రాఘవేంద్రరావుతో పాటు మరికొందరికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
బెల్లంపల్లికి చెందిన శేజల్ సరికొత్త నిర్ణయం తీసుకుంది. తాజాగా ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరి కండువా కప్పుకున్నారు. ఈ క్రమంలో ప్రస్తుత అధికార పార్టీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై తన పోరాటం కొనసాగుతుందని వెల్లడించారు. అంతేకాదు చిన్నయ్య అనేక మంది అమాయకులపై అక్రమ కేసులు పెట్టించారని వ్యాఖ్యానించారు.
నేడు నామినేషన్ల సందర్భంగా ప్రధాన పార్టీ ముఖ్య నేతలంతా నామినేషన్లు వేశారు. ఈ సందర్భంగా వారి వారి ఆస్తులు, అప్పులను అఫిడవిట్లో వెల్లడించారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా తనపై 89 పెండింగ్ కేసులు ఉన్నాయని, తనకు రూ.1.30 కోట్ల అప్పు ఉందని అఫిడవిట్లో నమోదు చేశారు.
ఢిల్లీ మద్యం కేసులో ఎమ్మెల్సీ కవిత జైలుకు వెళ్లడం ఖాయం అని కేంద్ర మంత్రి అశ్విని చౌబే అన్నారు. తెలంగాణలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందని, ప్రజల బాధలు తీరుస్తుందని పేర్కొన్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు మరికొన్ని రోజుల్లో జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ(telangana congress) మైనారిటీ డిక్లరేషన్ ను ప్రకటించింది. అయితే దీనిని కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్(salman khurshid) విడుదల చేయగా..దీనికి మైనారిటీ వర్గాలకు కీలకమైన హామీలను ప్రకటించారు.
తనకు కారు, భూమి లేదని, రూ.17 కోట్లకు పైగా అప్పులు ఉన్నాయని సీఎం కేసీఆర్ తన అఫిడవిట్లో నమోదు చేశారు. సెంటు భూమి కూడా తన పేరుపై లేదని, కుటుంబానికి 62 ఎకరాలు ఉన్నట్లు తెలిపారు. తనపై 9 పోలీస్ కేసులు ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం రసవత్తరంగా మారుతోంది. ముఖ్యంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు దూసుకుపోతున్నాయి. ఈ నేపథ్యంలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ మంత్రి ఎర్రవెల్లి దయాకర్ రావుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. శత్రువులతో చేతులు కలిపి ఆయన తనను జైలుకు పంపించాడని రేవంత్ వ్యాఖ్యలు చేశారు.
మొగలి రేకులు సీరియల్ నటుడు సాగర్ కు అరుదైన అవకాశం దక్కింది. ఇటివల జనసేన పార్టీలో చేరిన సాగర్ కు తెలంగాణ ఎన్నికల పార్టీ ప్రచార కార్యదర్శి పదవి లభించింది. అంతేకాదు తన స్వగ్రామమైన రామగుండం నుంచి కూడా సాగర్ పోటీ చేస్తుండటం విశేషం.
తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి కేటీఆర్ పాల్గొన్న రోడ్ షోలో అపశృతి చోటుచేసుకుంది. ఈ ఘటనలో ప్రచార వాహనం రెయిలింగ్ విరిగి పడడంతో పై నుంచి సురేష్ రెడ్డి, జీవన్ రెడ్డి కిందపడ్డారు.
నామినేషన్ వేసే సందర్భంలో ఇబ్రహీంపట్నంలో కాంగ్రెస్- బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య గొడవ జరిగింది. ఇరువర్గాలను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీలకు పనిచెప్పారు.
కానిస్టేబుల్పై మోజుతో ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు సీఐ ఇఫ్తికర్. శకుంతలను వేధించడంతో ఆమె భర్త కానిస్టేబుల్ జగదీశ్ దాడి చేశాడు. తీవ్రగాయాలతో సీఐ ఆస్పత్రిలో చనిపోయాడు.
పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ దాడులను పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఖండించారు. ప్రజాస్వామ్యంలో దాడులు చేయడం మంచి పద్ధతి కాదని సూచించారు.
అసెంబ్లీ ఎన్నికల అఫిడవిట్లో నేతలు ఆస్తులు, అప్పుల వివరాలు ప్రకటిస్తున్నారు. ఒక్కో నేత తనకు కారు లేదని పేర్కొన్నారు. వందల కోట్ల ఆస్తి కలిగి ఉన్నానని.. కానీ తన పేరు మీద కార్లు లేవని చెబుతున్నారు.
కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి బర్రెలక్క శిరీష ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు.