గుర్తు తెలియని వ్యక్తులతో చాట్ చేయొద్దని.. ఫోటోలు, వీడియోలు షేర్ చేయొద్దని హైదరాబాద్ సీపీ సందీప్ శాండిల్య యువతులకు సూచించారు.
తెలంగాణలో ఇకపై వార్తా సంస్థల్లో రాజకీయ ప్రకటనలను నిలిపివేయాలని సీఈవో స్పష్టంచేశారు. నేతలు, అభ్యర్థులు నిబంధనలను అతిక్రమించడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.
ప్రధాని మోడీ సభలో ఓ యువతి కలకలం రేపింది. విద్యుత్ స్తంభం పైకి ఎక్కింది. దీంతో మోడీ కలుగజేసుకొని.. కిందకి దిగాలని పదే పదే కోరారు.
అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు వాహనంపై కాంగ్రెస్ కార్యకర్తలు రాళ్ల దాడి చేశారు. దీంతో స్వల్పంగా గాయపడ్డ బాలరాజుకు అచ్చంపేటలో చికిత్స అందజేసి.. మెరుగైన ట్రీట్ మెంట్ కోసం హైదరాబాద్ తరలించారు.
బీజేపీ సీఎం అభ్యర్థిపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీసీ అభ్యర్థి అవుతారని.. క్యాండెట్ను హైకమాండ్ నిర్ణయిస్తుందని తెలిపారు.
ఎస్సీ వర్గీకరణకు కమిటీ వేస్తానని ప్రధాని మోడీ ప్రకటన చేశారు. మీ బాధలు తనకు తెలుసు అని.. న్యాయం చేస్తామని మాదిగలకు భరోసానిచ్చారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత దళితుడిని సీఎం చేస్తానని చెప్పిన కేసీఆర్.. ఆ మాటే మరిచారని ప్రధాని మోడీ విమర్శించారు. పరేడ్ గ్రౌండ్స్లో జరిగిన మాదిగల విశ్వరూప మహాసభలో ఆయన ప్రసంగించారు.
బీజేపీ నేత విజయశాంతి కాంగ్రెస్లో చేరబోతున్నారు. గత కొంత కాలంగా ఆ పార్టీలో జరుగుతున్న పరిణామాల పట్ల అసంతృప్తితో ఉన్న ఆమె బీజేపీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సటీ విద్యార్థి సంఘ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. అన్ని పోస్టులను గెలుచుకొని క్లీన్ స్వీప్ చేసింది.
ప్రధాని నరేంద్ర మోదీ వరుసగా మూడు రోజులు రాష్ట్రంలో పర్యటించనున్నారు. మూడు రోజులు పలు ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం సభల్లో పాల్గొంటారు. హైదరాబాద్ లో నిర్వహించే భారీ రోడ్ షోనూ మోదీ పాల్గోనున్నారు.
సనత్ నగర్ నియోజకవర్గం నుంచి తనను గెలిపిస్తే రూపాయికే నాలుగు సిలిండర్లు ఇస్తానని ఆలిండియా ఫార్వార్డ్ బ్లాక్ పార్టీ నేత కుమ్మరి వెంకటేశ్ యాదవ్ హామీనిచ్చారు.
సర్పంచ్ నవ్య తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఇండిపెండెంట్గా నామినేషన్ దాఖలు చేశారు. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం నుంచి ఆమె పోటీ చేయబోతున్నారు. ఆమె తన భర్తతో కలిసి నామినేషన్ వేశారు.
కార్తీక మాసం(karthika masam 2023) సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రత్యేక ప్యాకేజీని అనౌన్స్ చేసింది. అది ఏటంటే రాష్ట్రంలోని ప్రముఖ శివాలయాలను సందర్శించే విధంగా బస్సులను నడపాలని నిర్ణయించింది. ఈ బస్సులు ప్రతి ఆదివారం హైదరాబాద్ నుంచి మొదలవుతాయని ప్రకటించారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
నేడు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (MRPS) ఆధ్వర్యంలో హైదరాబాద్లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు ప్రధాని నరేంద్ర మోడీ హాజరుకానున్నారు. MRPS లేవనెత్తుతున్న డిమాండ్లపై కీలక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. మోడీ రాక నేపథ్యంలో ఈ సభకు కీలక బీజేపీ నేతలు హాజరుకానున్నారు.
ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. జిల్లాకు చెందిన పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలు సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలోకి చేరారు.