దీపావళి దగ్గర పడుతోంది. ఈ పండగ మెరిసే దీపాలు, అందమైన అలంకరణల గురించి మాత్రమే కాదు; ఇది మన జీవితాల్లో విజయం మరియు శ్రేయస్సును ఆహ్వానించడం గురించి కూడా. మీరు ఈ పవిత్రమైన వేడుకకు సిద్ధమయ్యే ముందు, సానుకూల శక్తిని , ఆశీర్వాదాలను తీసుకురావడానికి సహాయపడే సాంప్రదాయ పద్ధతులు ఉన్నాయి.
కేసీఆర్ దుష్టపాలనకు కామారెడ్డి చరమగీతం పాడుతుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు.తెలంగాణ ప్రజల భవిష్యత్తను కామారెడ్డి ప్రజానీకం నిర్ణయించబోతుందన్నారు.
ఎల్లుండి దీపావళి పండుగ జరుగనుంది. ఈ సందర్భంగా పటాకులు కాల్చడంపై హైదరాబాద్ సిటీ పోలీసులు ప్రజలకు మార్గదర్శకాలు జారీ చేశారు. పర్యావరణ అనుకూలమైన, సురక్షితమైన దీపావళిని జరుపుకోవడానికి ప్రభుత్వ మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని సూచించారు.
ఆఖరి నిమిషంలో వేములవాడ అసెంబ్లీ టికెట్ను బీజేపీ మార్చడంతో తుల ఉమ కంటతడి పెట్టారు. బీసీ మహిళలకు పార్టీలో గౌరవం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నామినేషన్లకు గడువు నేటి సాయంత్రంతో ముగిసింది. మధ్యాహ్నం 3 గంటలతో గడువు ముగిసింది. 3 గంటల తర్వాత లైన్లో ఉన్నవారికి మాత్రం నామినేషన్లు వేసే అవకాశం కల్పించింది
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు బిగ్ షాక్ తగిలింది. తెలంగాణలో జనసేన పార్టీకి ఎన్నికల సంఘం గుర్తును కేటాయించలేదు
తెలంగాణలో పటాన్ చెరు కాంగ్రెస్ టిక్కెట్ గురించి చర్చనీయాంశంగా మారింది. ఇక్కడి రాజకీయాలు రచ్చకెక్కాయి. ఇక్కడి స్థానిక నేత నీలం మధు టిక్కెట్ ఆశించి బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చారు. కానీ కాంగ్రెస్ మొదట పేరు ప్రకటించి చివరి జాబితాలో పేరు లేకపోవడంతో తాజాగా మధు బీఎస్పీ పార్టీలో చేరారు.
తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే ప్రధాన పార్టీల అభ్యర్థుల తుదిజాబితాలు వచ్చేశాయి. తాజాగా బీజేపీ 14 మందితోకూడిన లిస్టును ప్రకటించగా..నిన్న రాత్రి కాంగ్రెస్ పార్టీ కూడా నలుగురితోకూడిన జాబితాను వెలువరించింది. అయితే సీట్ దక్కిన వారు సంతోషంగా ఉండగా..రాని వారు మాత్రం తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
హైదరాబాద్ బంజారాహిల్స్ సమీపంలోని షేక్పేట్లో అత్యంత విలువైన రెండెకరాల భూమి కేటాయింపులో నిబంధనలను ఉల్లంఘించారనే ఆరోపణలపై టాలీవుడ్ సినీ దర్శకుడు కె.రాఘవేంద్రరావుతో పాటు మరికొందరికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
బెల్లంపల్లికి చెందిన శేజల్ సరికొత్త నిర్ణయం తీసుకుంది. తాజాగా ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరి కండువా కప్పుకున్నారు. ఈ క్రమంలో ప్రస్తుత అధికార పార్టీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై తన పోరాటం కొనసాగుతుందని వెల్లడించారు. అంతేకాదు చిన్నయ్య అనేక మంది అమాయకులపై అక్రమ కేసులు పెట్టించారని వ్యాఖ్యానించారు.
నేడు నామినేషన్ల సందర్భంగా ప్రధాన పార్టీ ముఖ్య నేతలంతా నామినేషన్లు వేశారు. ఈ సందర్భంగా వారి వారి ఆస్తులు, అప్పులను అఫిడవిట్లో వెల్లడించారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా తనపై 89 పెండింగ్ కేసులు ఉన్నాయని, తనకు రూ.1.30 కోట్ల అప్పు ఉందని అఫిడవిట్లో నమోదు చేశారు.
ఢిల్లీ మద్యం కేసులో ఎమ్మెల్సీ కవిత జైలుకు వెళ్లడం ఖాయం అని కేంద్ర మంత్రి అశ్విని చౌబే అన్నారు. తెలంగాణలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందని, ప్రజల బాధలు తీరుస్తుందని పేర్కొన్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు మరికొన్ని రోజుల్లో జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ(telangana congress) మైనారిటీ డిక్లరేషన్ ను ప్రకటించింది. అయితే దీనిని కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్(salman khurshid) విడుదల చేయగా..దీనికి మైనారిటీ వర్గాలకు కీలకమైన హామీలను ప్రకటించారు.
తనకు కారు, భూమి లేదని, రూ.17 కోట్లకు పైగా అప్పులు ఉన్నాయని సీఎం కేసీఆర్ తన అఫిడవిట్లో నమోదు చేశారు. సెంటు భూమి కూడా తన పేరుపై లేదని, కుటుంబానికి 62 ఎకరాలు ఉన్నట్లు తెలిపారు. తనపై 9 పోలీస్ కేసులు ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం రసవత్తరంగా మారుతోంది. ముఖ్యంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు దూసుకుపోతున్నాయి. ఈ నేపథ్యంలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ మంత్రి ఎర్రవెల్లి దయాకర్ రావుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. శత్రువులతో చేతులు కలిపి ఆయన తనను జైలుకు పంపించాడని రేవంత్ వ్యాఖ్యలు చేశారు.