తెలంగాణలో మరో నాలుగు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో పలుచోట్ల భీకర వర్షాలు కురుస్తాయని, అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంతో తనకు మంచి అనుబంధం ఉందని, ఇక్కడ సభను నిర్వహించే తాను ప్రధానిని అయ్యానని మోదీ అన్నారు. బీసీ ఆత్మగౌరవ సభలో ప్రజలనుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. తెలంగాణకు బీసీ ముఖ్యమంత్రి రాబోతున్నట్లు తెలిపారు.
కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు, నిధులు, నియామకాలు సరిగ్గా అమలు అవుతున్నాయా అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రజలను ప్రశ్నించారు. మాటలు కాకుండా పనులు చేసే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని పవన్ ప్రజలను కోరారు.
హైదరాబాద్ లోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రిలో టీడీపీ అధినేత చంద్రబాబుకు కంటి శస్త్రచికిత్స పూర్తయ్యింది. అలాగే చర్మ సంబంధిత పరీక్షలు కూడా ఏఐజీ ఆస్పత్రిలో పూర్తయ్యాయి. ఆపరేషన్ తర్వాత ఆయన హైదరాబాద్ లోని తన ఇంటికి చేరుకున్నారు.
తెలంగాణ బీఆర్ఎస్ మంత్రి మల్లారెడ్డి తమ భూములు ఆక్రమించారని గిరిజనులు నిరసన వ్యక్తం చేశారు. సుమారు 150 కోట్ల విలువైన 47 ఎకరాలు భూమి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆరోపణలు చేశారు. అయితే ఈ భూమి ఎక్కడుంది. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
మరో 3 రోజుల్లో తనపై, కుటుంబ సభ్యులపై ఐటీ రైడ్స్ జరగబోతున్నాయని కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
మంథని టికెట్ కోసం సింగిల్ విండో చైర్మన్ చల్ల నారాయణ రెడ్డి మూడు పార్టీలు మారారు. కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్కు మారారు. అక్కడ టికెట్ ఇవ్వకపోవడంతో చివరకు బీఎస్పీలో చేరారు.
నల్గొండ నుంచి.. ఏదో ఒకరోజు ముఖ్యమంత్రి పదవీ చేపడుతానని కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ఇప్పుడే ఏం తనకు తొందర లేదని చెప్పారు.
నాగర్ కర్నూల్ జిల్లాలో వింత ఘటన జరిగింది. బీఆర్ఎస్ కార్యకర్తను కాంగ్రెస్ నేతలు కారులో ఎక్కించుకుని వెళ్లారు. బలవంతంగా కాంగ్రెస్ పార్టీలో చేర్పించారు.
టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి ఇంటి దగ్గర తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి చోటుచేసుకుంది.కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడ్డ నేతల అసంతృప్త సెగలు పెరిగాయి.
బండి సంజయ్ సీఎం రేసులో ఉన్నారని.. అందుకే ఆయనను అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించామని బీజేపీ సీనియర్ నేత మురళీధర రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.
సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో పలు రైళ్లు (Trains) ఆలస్యంగా నడుస్తున్నాయి. దీనిపై రైల్ నిలయం సికింద్రాబాద్లోజీఎం అరుణ్కుమార్జైన్ డీఆర్ఎంలతో సమీక్ష నిర్వహించారు.
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరో వివాదంలో చిక్కుకున్నారు. మరోసారి మంగళ్ హాట్ పోలీసులు ఆయనకు నోటీసులు జారీ చేశారు.
శాసనసభ ఎన్నికలకు కాంగ్రెస్ 16 మందితో మూడో జాబితా విడుదల చేసింది.కామారెడ్డి నియోజకవర్గంలో సీఎం కేసీఆర్పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పోటీ అధికారికంగా ఖరారైంది.
కాంగ్రెస్ పార్టీ వల్ల తెలంగాణకు అడుగడుగునా అన్యాయమే జరిగిందని సీఎం కేసీఆర్ అన్నారు. పదేళ్ల వరకూ తెలంగాణ ఇవ్వకుండా కాంగ్రెస్ తీవ్ర ఇబ్బందులు పెట్టిందని, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని చీల్చే కుట్ర చేస్తోందని సీఎం కేసీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.