మైనంపల్లి హన్మంతరావు, రేవంత్ రెడ్డిలపై మంత్రి మల్లారెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మైనంపల్లి ఓ రౌడీ అని.. రేవంత్ తన నియోజకవర్గానికి నిధులు ఖర్చు చేయలేదని మండిపడ్డారు.
తెలంగాణలో ఎన్నికలు ఉన్న క్రమంలో అధికార పార్టీ బీఆర్ఎస్ నేతలు ఆంధ్రా అభివృద్ధి గురించి మాట్లాడటం సరికాదని ఏపీ మంత్రి గుడివాడ అమర్ నాథ్(Gudivada Amarnath) స్పష్టం చేశారు. అంతేకాదు మీరు మీ ప్రాంతంలో చేసిన పనులు గురించి చెప్పుకోవాలని హితవు పలికారు.
స్టేషన్ ఘనపురంలో సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్య జోరుగా ప్రచారం చేస్తున్నారు. డప్పు కొడుతూ.. కోలాటం ఆడుతూ తెగ క్యాంపెయిన్ చేస్తున్నారు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేయగా.. తెగ వైరల్ అవుతున్నాయి.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చేయాలని బీజేపీ, జనసేన పార్టీలు నిర్ణయించాయి. కొన్నిరోజులుగా జరుగుతున్న చర్చలు కొలిక్కి వచ్చాయి. తాజాగా రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరింది.
కామారెడ్డిలో అధికార పార్టీ నేతల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. తనకు కేటాయించిన గ్రామంలో ఎందుకు ప్రచారం చేస్తున్నావని అడిగితే.. జెడ్పీటీసీపై ఎంపీపీ పిడి గుద్దులు గుప్పించాడు.
తెలంగాణలోని మద్యం ప్రియులకు బ్యాడ్ న్యూస్.. రాష్ట్రవ్యాప్తంగా మూడు రోజుల పాటు వైన్ షాపులు మూతపడనున్నాయి. వీటితోపాటు బార్లు కూడా తెరుచుకోవు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వరుసగా మూడు రోజులు మద్యం అమ్మకాలు బంద్ పెట్టనున్నారు.
సెంటిమెంట్ దేవుడు కోనాయిపల్లిలో గల వెంకటేశ్వర స్వామి ఆలయానికి సీఎం కేసీఆర్ వస్తున్నారు. అక్కడ స్వామి వారి పాదాల వద్ద నామినేషన్ పత్రాలు ఉంచి ప్రత్యేక పూజలు చేయిస్తారు.
తన భద్రత విషయంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్కు లేఖ రాశారు. ఎన్నికలు ముగిసే వరకు తనకు భద్రత కల్పిస్తామని హైకోర్టుకు చెప్పినా.. సెక్యూరిటీ కల్పించడం లేదని లేఖలో పేర్కొన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో బిఆర్ఎస్ ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ ప్రాజెక్ట్ తెలంగాణ రాష్ట్ర అవినీతి, విఫలమైన ప్రాజెక్టుల లీకేజీలకు" "లక్షణ చిహ్నం"గా మారిందని ఆరోపించారు. అంతేకాదు ఇటివల మేడిగడ్డ బ్యారేజీపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన నివేదికను ప్రస్తావించారు.
గత పదేళ్లలో ఏ అభివృద్ధి పనులు జరిగాయో చూడాలని ప్రజలను సీఎం కేసీఆర్ కోరారు. నిర్మల్, ఆర్మూర్, కోరుట్ల ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.
మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, తెలంగాణ, మిజోరం.. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి రాజకీయ కార్యకలాపాలు ఊపందుకున్నాయి.
తెలంగాణ ద్రోహులు అందరూ ఏకం అవుతున్నారని మంత్రి హరీశ్ రావు హాట్ కామెంట్స్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తామని షర్మిల ప్రకటన చేయడంతో మంత్రి హరీశ్ రావు విరుచుకుపడ్డారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్ 9 చోట్ల పోటీ చేస్తుందని ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించారు. మూడు స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లును రెండు, మూడు రోజుల్లో ప్రకటిస్తామని తెలిపారు.
తెలంగాణ ప్రాంత ప్రజల పోరాటంలో న్యాయం ఉందని నమ్మి, విశ్వసించి.. ప్రత్యేక రాష్ట్రాన్ని సోనియా గాంధీ ఇచ్చారని టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. కానీ ఇచ్చిన హామీలను సీఎం కేసీఆర్ విస్మరించారని విమర్శించారు.
అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని వైఎస్ఆర్ టీపీ చీఫ్ షర్మిల ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తామని స్పష్టంచేశారు.