నేడు ప్రగతి భవన్లో మంత్రి కేటీఆర్, బిత్తిరి సత్తి భేటీ తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ముదిరాజ్ ఓటర్లను ఆకర్షించేందుకే బిత్తిరి సత్తిని కేటీఆర్ తమ వైపు తిప్పుకుంటున్నారే ప్రచారం జోరుగా సాగుతోంది.
బీఆర్ఎస్ నేత పొన్నాల లక్ష్మయ్యకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆఫీసు నుంచి ఫోన్ కాల్ వచ్చింది. తిరిగి పార్టీలో చేరాలని.. ఢిల్లీ వచ్చి రాహుల్ గాంధీని కలువాలని కోరారని విశ్వసనీయంగా తెలిసింది.
పది సంవత్సరాల అవినీతి పాలనకు చరమగీతం పాడాల్సిన సమయం వచ్చిందని ఎమ్మెల్యే రఘునందనరావు అన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి పదవిపై కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ మాట తప్పని పార్టీ అని, పేదల బతుకులు మారాలంటే బీజేపీకి అవకాశం ఇవ్వాలని కోరారు.
భైంసా పరిస్థితి చూస్తే.. అసలు మనం ఇండియాలో ఉన్నామా అనే సందేహాం కలుగుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు.
దసరా పండగ సందర్భంగా టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ బస్సుల ద్వారా టీఎస్ఆర్టీసీకి కేవలం 10 రోజుల్లోనే రూ.25 కోట్ల వరకూ ఆదాయం లభించింది.
విపక్ష నేతలు చేస్తోన్న సవాళ్లపై తెలంగాణ సీఎం కేసీఆర్ స్పందించారు. కేసీఆర్ దమ్మెంటో ఇండియా మొత్తం చూసిందని.. ఇప్పుడు చూడాల్సిది ఏమీ లేదన్నారు.
కుందన్బాగ్ ప్రాంతంలో యువకుల గోల ఎక్కువైంది. ఓ భూత్బంగ్లాలో దెయ్యాలు ఉన్నాయంటూ వారు చేస్తున్న వీడియోలు, రీల్స్ వల్ల స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో వారంతా పోలీసులను ఆశ్రయించడంతో 35 మంది యువకులను అరెస్ట్ చేశారు.
కాంగ్రెస్ పార్టీలో చేరే ప్రసక్తే లేదని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ స్పష్టంచేశారు. కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని విరుచుకుపడ్డారు.
సీఎం కేసీఆర్ ను కొడంగల్ నుంచి పోటీ చేయాలని ఇప్పటికే ఆహ్వానించినట్లు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(revanth reddy) తెలిపారు. ఒక వేళ కేసీఆర్ కొడంగల్లో పోటీకి రాకపోతే తానే కామారెడ్డి నుంచి పోటీ చేసి చిత్తుగా ఓడిస్తామని రేవంత్ అన్నారు.
భాగ్యనగరంలో దుర్గామాత విగ్రహాల నిమజ్జనోత్సవం కొనసాగుతోంది.
రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న తప్పుడు ప్రచారం గురించి ఈసీకి ఫిర్యాదు చేశామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy) అన్నారు. దీంతోపాటు అధికార పార్టీ నిబంధనలకు విరుద్ధంగా నియమించిన రిటైర్డ్ అధికారులను కూడా తొలగించాలని కోరినట్లు చెప్పారు.
మహబూబ్నగర్ జిల్లా కొల్లాపూర్లో 'పాలమూరు ప్రజాభేరి' పేరుతో అక్టోబర్ 31న నిర్వహించనున్న బహిరంగ సభకు కాంగ్రెస్ అధినేత్రి ప్రియాంక గాంధీ రానున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని కీలక నేతలు అందుకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు.
ఇక శంషాబాద్ ఎయిర్పోర్టులో ప్రయాణికులకు రోబోల సేవలు అందుబాటులోకి రానున్నాయి.
యాంకర్ సుమ మీడియాకు క్షమాపణలు చెప్పారు. ‘ఆదికేశవ’ ఈవెంట్ లో తన మాటలు బాధిస్తే మన్నించాలని కోరారు.
తనతోపాటు యోగి ఆదిత్యనాథ్కు ప్రాణహానీ ఉందని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.