తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఉధృతంగా కొనసాగుతున్న వేళ చార్మినార్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్పై కేసు నమోదయ్యింది.
తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలో మెట్రోలో ప్రయాణించే ప్రయాణికుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఒకే రోజులో ప్రయాణించే మెట్రో ప్రయాణికుల సంఖ్య గరిష్ట స్థాయికి చేరుకుంది.
తెలంగాణలో రాగల మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడిందని తెలిపింది.
రేపు తెలంగాణ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ పాల్గొననున్నారు. రేపు భారీ సభ నిర్వహించేందుకు బీజేపీ అధిష్టానం సమాయత్తమవుతోంది. రేపు సాయంత్రం హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో బీజేపీ బీసీ గర్జన సభ నిర్వహించనుంది.
కాంగ్రెస్ పార్టీ తమ పార్టీలోని 60 మంది అభ్యర్థులకు బీ-ఫాంలను అందించింది. నవంబర్ 10వ తేది వరకూ నామినేషన్లకు గడువు ఉండటంతో కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకూ 100 మంది అభ్యర్థులను ప్రకటించగా మరో 19 స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేసి త్వరలో ప్రకటించనుంది.
టీపీసీసీ అధ్యక్షడు రేవంత్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో బకరా కాబోతున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ వ్యాఖ్యానించారు. అంతేకాదు కాంగ్రెస్ పార్టీలో ఉన్న 50 మంది ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్ నిధులు ఇస్తున్నారని ఆరోపించారు. ఆయా నేతలు మళ్లీ బీఆర్ఎస్ పార్టీలోకి మారతారని అన్నారు. ఇలాంటి వ్యాఖ్యల నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి మరి.
ఎన్నికల సమయంలో ప్రజలు మోసపోవద్దని, అభ్యర్థిని చూసి కాకుండా ఆ పార్టీ చరిత్రలను చూసి ఓటేయాలని సీఎం కేసీఆర్ సూచించారు. కొత్తగూడ బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్లొని ప్రసంగించారు. తెలంగాణ ఏర్పాటైన 10 ఏళ్లలో బీఆర్ఎస్ అన్ని రంగాలను ముందుకు తీసుకొచ్చిందన్నారు. ఆగమాగం కాకుండా ఆలోచించి ఓట్లేసి మళ్లీ బీఆర్ఎస్నే అధికారంలోకి తీసుకురావాలన్నారు.
తెలంగాణలో సీఎం కేసీఆర్ మాటలను ఇకపై ప్రజలు నమ్మే పరిస్థితి లేదని కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇప్పటికే కేసీఆర్ అనేక హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశారని గుర్తు చేశారు. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ పోటీ చేసే రెండు స్థానాల్లో చిత్తుగా ఓడిపోతాడని కిషన్ రెడ్డి అన్నారు.
గచ్చిబౌలి స్టేడియంలో ఈ ఉదయం నిర్వహించిన ‘హైదరాబాద్ ఆఫ్ మారథాన్’కు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 20కె, 10కె, 5కె విభాగాల్లో మారథాన్ నిర్వహించారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ రాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్తో పొత్తు లేకుండా 14 మంది అభ్యర్థులతో సీపీఎం తొలి జాబితా విడుదల చేసింది
రాజకీయ వ్యవహారాలు, ప్రభుత్వ కార్యకలాపాలతో ఎల్లప్పుడూ బిజీబిజీగా గడిపే మంత్రి కేటీఆర్ నాటుకోడి కూర వండారు. తెలంగాణలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో మై విలేజ్ షో యూట్యూబ్ ఛానెల్ టీంతో కేటీఆర్ సందడి చేశారు.
తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గన్మెన్ ఫాజిల్ బలవన్మరణానికి పాల్పడ్డారు. తుపాకీతో కాల్చుకుని ఆయన ఆత్మహత్య చేసుకున్నారు.
రాష్ట్రంలో కాళేశ్వరంలో ప్రాజెక్టు(kaleshwaram project)లో భాగంగా మేడిగడ్డ బ్యారేజీ పగుళ్ల అంశంపై దీనిని నిర్మించిన L&T సంస్థ స్పందించింది. రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన డిజైన, నాణ్యత మేరకు నిర్మించామని..అవసరమైతే దెబ్బతిన్న భాగాన్ని పునరుద్ధరించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది.
గోషామహల్ బీజేపీ అభ్యర్థి రాజాసింగ్ నామినేషన్ ర్యాలీలో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికార పార్టీ బీఆర్ఎస్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తప్పు చేసిన వారు తప్పకుండా జైలుకు వెళ్తారని, వారి నంబర్ తప్పకుండా వస్తుందని పేర్కొన్నారు. అయితే కవిత, కేసీఆర్ పేర్లను ప్రస్తావిస్తు చెప్పడం చర్చనీయాంశంగా మారింది.
మేడిగడ్డ బ్యారేజిలో జరిగిన అన్యాయం కేంద్రానికి ఎందుకు కనిపించడం లేదు, సీబీఐ విచారణ ఎందుకు అదేశించడం లేదని టీపీసీసీ చీఫ్ రెవంత్ రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ చేపట్టిన ప్రాజెక్టులను రీడిజైనింగ్ పేరుతో కేసీఆర్ వందలకోట్ల అవినితీ చేశాడని ఆరోపించారు. కేసీఆర్, ఆయన కుటుంబం ఆర్థిక ఉగ్రవాదులని తీవ్రంగా వ్యాఖ్యానించారు.