తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీకి మరో షాక్ తగిలింది. బీజేపీ అధికార ప్రతినిధి ఏనుగుల రాకేశ్ రెడ్డి తన పదవికి, పార్టీకి రాజీనామా చేశారు. వరంగల్ పశ్చిమ నియోజవర్గ టికెట్ దక్కకపోవడం వల్లనే నిరాశ చెంది పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు.
ఆరోపణలు- ప్రత్యారోపణలతో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం హీటెక్కింది. సీఎం కేసీఆర్ అవినీతికి పాల్పడ్డారని కల్వకుర్తి విజయభేరి సభలో రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
కాళేశ్వరం(kaleshwaram) లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో మరో లీకేజీ వెలుగులోకి వచ్చింది. మొన్న మేడిగడ్డ బ్యారేజీ సంఘటన మరువక ముందే తాజాగా అన్నారం సరస్వతి బ్యారేజీలో నీటి లీకేజీ కలకలం రేపుతోంది. అందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ముచ్చటగా మూడోసారి బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో అధికారం చేపడుతోందని జనతా కా మూడ్ సర్వే చెప్పింది. ఆ పార్టీ 75 సీట్ల వరకు గెలుచుకునే అవకాశం ఉందని అంచనా వేసింది.
తెలంగాణలో నిరుద్యోగం రోజురోజుకి ఎంత పెరిగిపోతుందో అనడానికి ఈ వీడియో నిదర్శనమని చెప్పవచ్చు. ఒకే ఒక్క పోస్ట్కు ఓ కంపెనీ వాక్ ఇన్ ఇంటర్వూ నిర్వహించగా వందలాది మంది నిరుద్యోగులు వచ్చారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ప్రగతి భవన్ వేదికగా ఎన్నికల ప్రచారం జరిగిందని, మంత్రి కేటీఆర్పై ఫిర్యాదులు అందినట్లుగా కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఈ తరుణంలో మంత్రి కేటీఆర్కు నోటీసులు జారీ చేసింది. దీనిపై వివరణ ఇవ్వాలని ఎలక్షన్ కమిషన్ కోరింది.
ముచ్చటగా మూడోసారి అధికారం చేపట్టాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అనుకుంటున్నారు. తన సెంటిమెంట్ ప్రకారం మూడో సారి రాజశ్యామల యాగం చేస్తున్నారు. యాగ ఫలంతో అధికారం చేపడుతానని భావిస్తున్నారు.
తెలంగాణ బీజేపీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ వివేక్ వెంకటస్వామి ఆ పార్టీకి రాజీనామా చేశారు. రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరతారు.
నేడు తెలంగాణలోని మూడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పాల్గొననున్నారు. ప్రియాంక గాంధీ ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందే. అయితే ఆమెకు అనారోగ్యం వల్ల తానే పర్యటిస్తున్నట్లు రాహుల్ తెలిపారు.
మెదక్ ఎంపీపై కత్తి దాడి జరగడంతో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్యేలు, ఎంపీలకు 4+4 భద్రతను కల్పిస్తున్నట్లు ప్రకటించింది.
తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం BRS, BJP, AIMIM కలిసి పనిచేస్తున్నాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. కొల్లపూర్లో నిర్వహించిన పాలమూరు ప్రజా భేరీ కాంగ్రెస్ సభలో భాగంగా పేర్కొన్నారు. అంతేకాదు అధికార కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
తన కలను నెరవేర్చినవాళ్లు రైతులేనని సీఎం కేసీఆర్ అన్నారు. నేడు హుజుర్నగర్లో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ సీఎం కేసీఆర్ ప్రసంగంతో దద్దరిల్లింది. సభలో సైదిరెడ్డిని బంపర్ మెజార్టీతో గెలిపించి బీఆర్ఎస్ను అధికారంలోకి తీసుకురావాలని కేసీఆర్ ప్రజలను కోరారు.
సీఎం కేసీఆర్ సమక్షంలో మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డి, జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డిలు భారత రాష్ట్ర సమితి పార్టీ (BRS)లో చేరారు. మరోవైపు కామారెడ్డి కార్యకర్తల సమావేశంలో మంత్రి కేటీఆర్.. తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు.
మాజీ సీఎం జలగం వెంగళరావు కుమారుడు, కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఈ రోజు ఢిల్లీలో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు.
దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై జరిగిన కత్తి దాడి ఘటనపై అధికార అధికార పార్టీ వర్సెస్ ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ క్రమంలో దీనిపై మరోసారి మంత్రి కేటీఆర్ స్పందించారు.