BHNG: చౌటుప్పల్ మున్సిపల్ ప్రజలకు ఛైర్పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ హోలీ శుభాకాంక్షలు తెలిపారు. పండుగను ప్రశాంతంగా, సంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని కోరారు. రసాయన రంగులకు దూరంగా ఉండి, ప్రకృతి సిద్ధమైన రంగులనే వాడాలని సూచించారు. యువత చెరువుల వద్దకు వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని, తెలియని వారిపై రంగులు చల్లరాదని పేర్కొన్నారు.
SDPT: దుబ్బాక మున్సిపాలిటీ ధర్మాజీపేట 9వ వార్డు ఎస్సీ కాలనీలో విద్యుత్ వైర్లు ప్రమాదకరంగా మారాయి. కొత్తగా నిర్మిస్తున్న ఇళ్ల పైకప్పుల మీదుగా ఈ తీగలు వెళ్తుండటంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని కాలనీవాసులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం వారు కౌన్సిలర్ వనం రమేశ్ను కలిసి వినతిపత్రం అందజేశారు.
జనగామ మున్సిపల్ కార్యాలయంలో సోమవారం దుద్దిల్ల శ్రీపాదరావు జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఛైర్పర్సన్ కడకంచి బాలమణి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. శ్రీపాదరావు సేవలను స్మరించుకుంటూ ఆయన ప్రజాసేవా దృక్పథం యువతకు ఆదర్శమని పేర్కొన్నారు.
సూర్యాపేట జిల్లా కేంద్రంలో రోడ్లను ఆక్రమించి వాహనదారులకు, పాదాచారులకు నరకం చూపిస్తున్న అక్రమార్కులపై మున్సిపల్ అధికారులు విరుచుకుపడ్డారు. HIT TV Newsలో ప్రచురితమైన కథనంతో స్పందించిన అధికారులు, ట్రాఫిక్ ఎస్సై సాయిరాం పర్యవేక్షణలో స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. రోడ్లపైకి వచ్చిన షాపు యజమాన్యానికి హెచ్చరికలు జారీ చేశారు. రోడ్లపైకి వస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
MLG: ఏటూరునాగారం మండలం కోయగూడ గ్రామ పంచాయతీ పరిధిలోని లంబాడితండా అంగన్వాడీ కేంద్రాన్ని సోమవారం సర్పంచ్ సరిత తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. పిల్లలకు బాలామృతం, పౌష్టిక ఆహారం క్రమం తప్పకుండా అందించాలని అంగన్వాడి టీచర్ రాజ్యలక్ష్మికి సూచించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, అంగన్వాడి సిబ్బంది తదితరులు ఉన్నారు.
JGL: కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానం కార్యనిర్వహణ అధికారిగా వేములవాడ రాజన్న ఆలయ ఈవో ఎల్ రమాదేవికి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇక్కడ ఈవోగా పనిచేసిన శ్రీకాంత్ రావుకు మన్యంకొండకు బదిలీ కావడం.. ఆ వెంటనే ఆయన సెలవుపై వెళ్లడంతో వేములవాడ ఈవో రమాదేవికి కొండగట్టు ఈవోగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
KMR: విద్యార్థులు కంటి సమస్యలు రాకుండా పౌష్టికాహారమైన చేపలు గుడ్డు తినాలని ఆప్తాల్మిక్ ఆఫీసర్ హరికిషన్ తెలిపారు. రాజంపేటలోని ZPHS గుండారం పాఠశాలలో నేడు విద్యార్థులకు ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ.. విద్యార్థులు మొబైల్ స్క్రీన్ ప్రభావం వల్ల చూపు మందగించడం జరుగుతుంది. తల్లిదండ్రులు ఈ విషయంలో జాగ్రత్త తీసుకోవాలని సూచించారు.
RR: చేవెళ్ల మండల పరిధి గొల్లగూడ గ్రామంలోని 2వ వార్డులో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. HMDA నిధులు రూ.10 లక్షలతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను సర్పంచ్ నిర్మల నర్సింహులు ప్రారంభించారు. దశలవారీగా వార్డులో అభివృద్ధి పనులు చేపడతామని సర్పంచ్ తెలపడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్, నేతలు, గ్రామస్థులు పాల్గొన్నారు.
MHBD: తొర్రూరు మున్సిపాలిటీలోని 2వ వార్డులో ఇవాళ ఉదయం ఓ విద్యుత్ స్తంభంపై వానరం కరెంట్ షాక్తో అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో కాసేపు విద్యుత్తుకు అంతరాయం ఏర్పడింది. స్తంభంపై విగతజీవిగా పడి ఉన్న వానరాన్ని చూసి కాలనీ వాసులు, బాటసారులు కన్నీటి పర్యంతమయ్యారు. అధికారులు తక్షణమే స్తంభంపై ఉన్న వానరాన్ని తొలగించాలని కాలనీవాసులు కోరుతున్నారు.
WGL: హోళీ పండుగ సందర్భంగా సహజసిద్ధ రంగులను మాత్రమే వినియోగించాలని, రసాయనిక రంగులు వాడకూడదని వరంగల్ CP సన్ ప్రీత్ సింగ్ సూచించారు. ఇతరులకు ఇబ్బంది కలిగించేలా బలవంతంగా రంగులు చల్లడం, నీటి బెలూన్లు విసరడం వంటి చర్యలకు పాల్పడవద్దని హెచ్చరించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు విస్తృతంగా నిర్వహిస్తామని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
NZB: బోధన్ రూరల్ మండలం అమ్దాపూర్లో సోమవారం హోలీ వేడుకలు అంబరాన్నంటాయి. గ్రామస్థులంతా ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ఆనందంగా గడిపారు. అంతకుముందు ఆదివారం రాత్రి శాస్త్రోక్తంగా కామదహనం నిర్వహించారు. సర్పంచ్ గంగాధర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉట్టి వేడుకలో చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు
నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి ఎమ్మార్వో కార్యాలయంలో విషాదం చోటుచేసుకుంది. కొత్తబావి గ్రామానికి చెందిన పిల్లి లింగయ్య అనే రైతు కార్యాలయం ఆవరణలోనే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం పాల్పడ్డారు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
KMR: శాసనసభ సభాపతి పదవికి దుద్దిళ్ల శ్రీపాదరావు వన్నె తెచ్చారని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ కొనియాడారు. సోమవారం కలెక్టరేట్లో యువజన, క్రీడా శాఖ ఆధ్వర్యంలో ఆయన జయంతి వేడుకలు నిర్వహించారు. శ్రీపాదరావు చిత్రపటానికి కలెక్టర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు విక్టర్, మధుమోహన్, ఆర్డీవో వీణ, డీవైఎస్వో వెంకటేశ్వర్లు ఉన్నారు
MDK: తూప్రాన్ పశు వైద్యశాలలో చికిత్స పొందుతూ జింక మృతి చెందినట్లు అటవీ శాఖ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. మనోహరాబాద్ మండలం జీడిపల్లి వద్ద అటవీ నుంచి బయటకు వచ్చిన జింకపై ఊర కుక్కలు దాడి చేసి గాయపరిచాయి. గ్రామస్తులు రక్షించి అటవీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో, తూప్రాన్ ప్రభుత్వ పశువైద్యశాలకు తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందింది.
PDPL: మహనీయుల జీవితాల నుంచి మనం అనేక వ్యక్తిత్వ వికాస పాఠాలను నేర్చుకోవచ్చని కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. సోమవారం దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతి సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. మారుమూల ప్రాంతమైన ధన్వాడలో పుట్టి శాసనసభ స్పీకర్ స్థాయికి ఎదిగడన్నారు