• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

బాధ్యతలు స్వీకరించిన నూనత కలెక్టర్

VKB: జిల్లా కలెక్టర్‌గా దీపక్ తివారి బాధ్యతలు స్వీకరించారు. శనివారం జిల్లా అధికారులు నూతన కలెక్టర్‌కు స్వాగతం పలికారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను సమర్థంగా అమలు చేస్తూ పరిపాలన యంత్రాంగాన్ని సరైన విధంగా నడిపిస్తామని తెలిపారు. జిల్లా అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతామంటూ, అధికారులంతా కలిసికట్టుగా పని చేయాలని కలెక్టర్ దీపక్ తివారి అన్నారు.

February 28, 2026 / 08:51 PM IST

‘పథకాలను సమర్ధవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి’

ADB: గత దిశ సమావేశంలో చర్చించిన వాటిలో కొన్ని పనులు పూర్తి చేసినట్లు కలెక్టర్ రాజర్షిషా అన్నారు. ఆదిలాబాద్ కలెక్టరేట్‌లో దిశా కమిటీ సమావేశంలో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను సమర్ధవంతంగా ప్రజల్లో తీసుకెళ్లాలని సూచించారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ పథకాలతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఆయా గ్రామాల్లో ముమ్మరంగా చేపట్టామని తెలిపారు.

February 28, 2026 / 08:50 PM IST

శాతవాహన అసిస్టెంట్ రిజిస్ట్రార్ ప్రసాద్ ఉద్యోగ విరమణ

KNR: శాతవాహన విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ రిజిస్ట్రార్ పులిజాల ప్రసాద్ ఉద్యోగ విరమణ కార్యక్రమం జరిగింది. వీసీ ఉమేష్ కుమార్ మాట్లాడుతూ.. ఆయన అంకితభావం, నిబద్ధతతో పనిచేసి మంచి గుర్తింపు పొందారని ప్రశంసించారు. బాధ్యత గల అధికారిగా విశ్వవిద్యాలయ అభివృద్ధికి నిరంతరం సేవలందించారని తెలిపారు.

February 28, 2026 / 08:46 PM IST

పసిప్రాణాల ఇంజక్షన్ విలువ రూ.32 కోట్లు

SRCL: టీం ఫంకీ జోన్ అనే పేరుతో కరీంనగర్‌కు చెందిన యువకులు పసిపిల్లల ప్రాణాలు కాపాడడానికి ఈరోజు వేములవాడలో ఫండ్స్ కలెక్ట్ చేశారు. బెల్లంపల్లికి చెందిన శివ, సహస్ర పిల్లలకు (SMA) వ్యాధి వచ్చింది. వీరి ప్రాణాలు కాపాడాలంటే రెండు ఇంజక్షన్లకు రూ.32 కోట్లు ఖర్చు అవుతుందని అన్నారు. వీరి ప్రాణాలను నిలబెట్టడానికి ఫండ్స్ కలెక్ట్ చేస్తున్నామని, ఇప్పటికీ రూ.30 లక్షలు జమ చేశామన్నారు.

February 28, 2026 / 08:46 PM IST

సమస్యలను పరిష్కరించాలని వినతి పత్రం అందజేత

KMR: మేరు కులస్తుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ జిల్లా బాన్సువాడ మేరు సంఘం సభ్యులు శనివారం రోజున డీఏవోకు పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. మేరు సంఘం అధ్యక్షులు విటూరి హనుమాన్లు కులవృత్తి మీద ఆధారపడి జీవిస్తూన్న తమ కులస్తులు ఆర్థికంగా వెనుకబడి ఉన్నారని ప్రభుత్వ పరంగా వర్తించే ఫలాలను అందించాలని కోరారు.

February 28, 2026 / 08:45 PM IST

ప్రమాదాలకు నిలయంగా మత్కేపల్లి బస్ స్టాప్

KMM: చింతకాని (M) ఖమ్మం- బోనకల్ ప్రధాన రహదారి అయిన మత్కేపల్లి బస్ స్టాప్ వద్ద ఉన్న రింగ్ రోడ్డు ప్రమాదాలకు నిలయంగా మారిందని స్థానికులు తెలిపారు. రింగ్ రోడ్డు వద్ద స్పీడ్ బ్రేకర్లు, హెచ్చరిక బోర్డు లేకపోవడంతో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మత్కేపల్లి రింగ్ రోడ్డు వద్ద తగు చర్యలు తీసుకోవాలని కోరారు.

February 28, 2026 / 08:39 PM IST

‘ఏటీడీవో కార్యాలయాన్ని ఖమ్మం కలెక్టరేట్ కు మార్చాలి’

KMM: గిరిజన అభివృద్ధి శాఖ ఏటీడీవో కార్యాలయాన్ని ఖమ్మం కలెక్టరేట్ కు మార్చాలని PDSU ఖమ్మం జిల్లా అధ్యక్షులు గోకినపల్లి మస్తాన్ అన్నారు. శనివారం PDSU ఆధ్వర్యంలో గిరిజన అభివృద్ధి శాఖ జిల్లా అధికారి డి.డి. విజయలక్ష్మికి వినతి పత్రం అందజేశారు. ఎస్టీ బాలుర వసతి గృహంలోనే ఏటీడీవో కార్యాలయం కొనసాగుతుండటంతో వసతి గృహ నిర్వహణకు ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు.

February 28, 2026 / 08:38 PM IST

NPDCL చరిత్రలో అత్యధిక గరిష్ఠ విద్యుత్ డిమాండ్

WGL: NPDCL చరిత్రలోనే అత్యధిక గరిష్ఠ విద్యుత్ డిమాండ్ శనివారం నమోదైందని NPDCL CMD కర్నాటి వరుణ్ రెడ్డి వెల్లడించారు. ఇవాళ WGLలో ఆయన మాట్లాడుతూ.. గత ఏడాది మార్చి 11న 5816 మెగావాట్లు గరిష్ఠ డిమాండ్ నమోదు కాగా, ఈ ఏడాది ఫిబ్రవరి లోనే 6057 మెగావాట్లు గరిష్ఠ డిమాండ్ నమోదు అయినట్లు తెలిపారు. వేసవి కాలంలో డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉందన్నారు.

February 28, 2026 / 08:36 PM IST

అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్

MNCL: లక్షెట్టిపేట పట్టణంలో నకిలీ నోట్లు చలామణి చేసిన అంతరాష్ట్ర ముఠాను అరెస్టు చేశామని ఏసీపీ ప్రకాష్ తెలిపారు. శనివారం లక్షెట్టిపేటలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నకిలీ నోట్లు చలామణి చేసిన 14 మందిని గుర్తించామని, అందులో 12 మందిని అరెస్టు చేయగా, మరో ఇద్దరు పరారీలో ఉన్నారన్నారు. వారి నుండి రూ.5,98,500 ఫేక్ కరెన్సీ, మూడు కార్లను స్వాధీనం చేసుకున్నామన్నారు.

February 28, 2026 / 08:35 PM IST

జిల్లాకు బెస్ట్ ప్రాక్టీసింగ్ అవార్డు

NRPT: రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో జిల్లాకు బెస్ట్ ప్రాక్టీసింగ్ అవార్డు లభించిందని జిల్లా విద్యాశాఖ అధికారి గోవిందరాజు తెలిపారు. FLN AI AXL కార్యక్రమాన్ని జిల్లాలోని పాఠశాలలో సమర్థవంతంగా నిర్వహించడం ద్వారా అవార్డు లభించిందన్నారు. గణన సామర్థ్యాల బలోపేతం దిశగా జిల్లాలో ప్రణాళికాబద్ధమైన చర్యలు చేపట్టడంతో అవార్డు సాధ్యమైందని అన్నారు.

February 28, 2026 / 08:34 PM IST

బుసిరెడ్డిపల్లిలో సైన్స్ దినోత్సవం

WNP: సీవీ రామన్ జయంతి సందర్భంగా జాతీయ సైన్స్ దినోత్సవాన్ని బుసిరెడ్డిపల్లి ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు శ్రీ విద్య ఆధ్వర్యంలో నిర్వహించారు. విద్యార్థులు రూపొందించిన సైన్స్ నమూనాలను సర్పంచ్ తలకంటి ప్రభాకర్ రెడ్డి పరిశీలించారు. సైన్స్ అభివృద్ధికి సహకరిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

February 28, 2026 / 08:32 PM IST

‘అటవీ అగ్ని ప్రమాదాలపై అవగాహన కార్యక్రమం’

MLG: వాజేడు మండలం పెనుగోలు కాలనీ పుసురు బీట్ పరిధిలో శనివారం అటవీశాఖ ఆధ్వర్యంలో వేసవి కాలంలో అటవీ అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అటవీశాఖ అధికారులు గ్రామస్థులకు అగ్ని ప్రమాదాలు సంభవించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. అనుమానాస్పద ఘటనలు గమనిస్తే వెంటనే అటవీశాఖకు సమాచారం అందించాలని సూచించారు.

February 28, 2026 / 08:31 PM IST

‘వైద్యులపై దాడులు ఆపాలి’

KNR: HYDలోని రెండు ఆసుపత్రుల్లో రోగి మృతికి వైద్యులే కారణమంటూ బంధువులు ఆసుపత్రి సిబ్బంది, సామగ్రిపై దాడి చేసిన ఘటనను ఖండిస్తూ జమ్మికుంట, హుజురాబాద్ ఐఎంఏ ఆధ్వర్యంలో జమ్మికుంటలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ తిరుపతి మాట్లాడుతూ.. ప్రాణాలను కాపాడేందుకు వైద్యులు అహర్నిశలు కృషి చేస్తారని, అనూహ్య మరణాలపై దాడులు చేయడం సరైంది కాదన్నారు.

February 28, 2026 / 08:31 PM IST

సబ్‌ కలెక్టరేట్‌కు వినతి పత్రం అందజేత

NZB: ఒకవైపు ప్రకృతి కన్నెర్ర.. మరోవైపు ప్రభుత్వ ఉదాసీనతతో రైతాంగం అల్లాడిపోతోందని అఖిలభారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు గుమ్ముల గంగాధర్, నడిపి నాగన్న ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం బోధన్ సబ్ కలెక్టరేట్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. డివిజన్ వ్యాప్తంగా నెలకొన్న సాగు సమస్యలను వివరించారు.

February 28, 2026 / 08:30 PM IST

పాప మృతికి కొవ్వొత్తులతో నివాళి

NLG: కుమ్మెరలో అగ్రకుల అహంకారానికి బలైన పసిపాప మృతికి DYFI ఆధ్వర్యంలో నల్గొండ, క్లాక్ టవర్ వద్ద ఇవాళ కొవ్వొత్తులతో నివాళి అర్పించారు. నిమ్న కులస్తులనే నెపంతో దర్శనానికి అడ్డుపడి, బాధితులపై దాడి చేసి రెండు నెలల పాప మృతికి కారణమైన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లం మహేష్ డిమాండ్ చేశారు.

February 28, 2026 / 08:29 PM IST