MNCL: పంటలు పండిస్తున్న రైతుల కోసం నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నామని TGNPDCL మంచిర్యాల SE రాజన్న వెల్లడించారు. రైతులకు నాణ్యమైన, అంతరాయం లేని విద్యుత్ సరఫరా అందించడమే లక్ష్యంగా TGNPDCL పని చేస్తుందన్నారు. మంచిర్యాల పరిధిలో డిసెంబర్ నెల నుంచి ఇప్పటి వరకు 429 వ్యవసాయ విద్యుత్ సర్వీసులు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు.
SRD: జిల్లాలో ఇంటర్ పరీక్షల సందర్భంగా కేంద్రాల వద్ద 163 BNSS సెక్షన్ అమలులో ఉంటుందని ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. పరీక్షా కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలోని జిరాక్స్ సెంటర్లు మూసి ఉంచాలని ఆదేశించారు. చీఫ్ సూపరింటెండెంట్ మినహా ఎవరూ సెల్ఫోన్లను అనుమతించవద్దని సూచించారు. ప్రతి కేంద్రం వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు.
WGL: వర్ధన్నపేట పట్టణంలోని అల్ఫోర్స్ పాఠశాల వార్షికోత్సవం కార్యక్రమం మంగళవారం సాయంత్రం పాఠశాల యాజమాన్యం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా MLA KR నాగరాజు హాజరై, మాట్లాడారు. “మత్తు వదలండి – మైదానానికి రండి.. మత్తు వదలండి – చదువుతో సత్తా చాటండి” అనే నినాదం రేపటి తరానికి ప్రాణవాయువు కావాలని ఆకాంక్షించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నారు.
NZB: తెలంగాణ రాష్ట్ర సైక్లింగ్ సంఘం ఆదేశాల మేరకు జిల్లా సైక్లింగ్ సంఘం ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికల అధికారిగా అడ్వకేట్ శరత్ చంద్ర బాధ్యతలు నిర్వర్తించారు. ఈ ఎన్నికల్లో కృపాకర్ రెడ్డి జిల్లా సైక్లింగ్ సంఘం అధ్యక్షుడిగా, భూలోక విజయకాంత్ రావు ప్రధాన కార్యదర్శిగా, సురేందర్ కోశాధికారిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
MLG: దేవాదుల ఎత్తిపోతల పథకంకు సంబంధించిన విద్యుత్ బిల్లుల బకాయిలు రూ.1,332 కోట్లకు చేరాయి. వేసవి ప్రారంభంతో గోదావరి నుంచి నీటిని ఎత్తిపోసేందుకు మోటార్లు నిరంతరం నడవాల్సి ఉండటంతో విద్యుత్ వినియోగం భారీగా పెరుగుతోంది. రోజుకు 20మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరుగుతుండగా, రోజుకు దాదాపు రూ.1కోటి, నెలకు రూ.30 కోట్ల వరకు ఖర్చవుతున్నట్లు అంచనా.
KMR: కామారెడ్డి జిల్లాలో అనుమతి లేకుండా ఎటువంటి ప్రైవేట్ ఆసుపత్రులు, ల్యాబ్లు నిర్వహించకూడదని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ స్పష్టం చేశారు. మంగళవారం కలెక్టరేట్లో ఆయన అధ్యక్షతన DRA కమిటీ సమావేశం జరిగింది. DM&HO రవీందర్ గౌడ్ సమావేశంలో నివేదిక సమర్పించారు. సరైన పత్రాలు సమర్పించని 11 ఆసుపత్రులకు నోటీసులు జారీ చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు.
HYD: పంజాగుట్టలోని నిమ్స్ ఆసుపత్రిలో సీఎంఆర్ ఫండ్ ద్వారా అనేక మందికి నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నామని డైరెక్టర్ బీరప్ప తెలిపారు. గత రెండు సంవత్సరాల్లో ఎల్ఓసీల ద్వారా రూ. 521 కోట్లకు పైగా విలువైన చికిత్సలు అందించినట్లు వెల్లడించారు. వెన్నెముక శస్త్రచికిత్సలు సైతం నిర్వహించామని, ముఖ్యంగా న్యూరో సర్జరీ కేసులు 2,221 నమోదైనట్లు పేర్కొన్నారు.
NGKL: కుమ్మెర కులోన్మాద ఘటనలో 8 మంది నిందితుల్లో ముగ్గురినే అరెస్ట్ చేశారని, మిగతా వారిని కూడా అరెస్ట్ చేయాలని BRS నేతలు డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు ఈరోజు మ.12 గంటలకు BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR నాగర్ కర్నూల్కు రానున్నారు. భారీగా పార్టీ శ్రేణులు, ప్రజాసంఘాల నేతలు తరలిరావాలని పిలుపునివ్వడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు.
NRPT: జిల్లా వ్యాప్తంగా ఇవాళ్టి నుంచి ప్రారంభమయ్యే ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాల వద్ద వంద మీటర్ల వరకు 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు నారాయణపేట ఎస్పీ డాక్టర్ వినీత్ మంగళవారం ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 15 పరీక్ష కేంద్రాలు ఉన్నాయని, పరీక్షలు జరిగే ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు జిరాక్స్ సెంటర్లు ముసి ఉంచాలని చెప్పారు.
MDCL: మేడ్చల్- మల్కాజ్గిరి జిల్లా వ్యాప్తంగా 108 ప్రభుత్వ పాఠశాలల్లో మార్చి 10వ తేదీ వరకు అల్పాహార కార్యక్రమం కొనసాగుతుందని జిల్లా DEO విజయకుమారీ తెలిపారు. ప్రతి విద్యార్థిపై రోజుకు రూ.15 చొప్పున వెచ్చించి పోషకాహారం అందిస్తున్నారు. 10వ తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు ఇది శక్తినిస్తూ, ఆరోగ్యాన్ని కాపాడుతుందన్నారు.
MBNR: జమిస్తాపూర్ ప్రాథమిక పాఠశాల భద్రత కోసం 4వ వార్డు మెంబర్ శ్రీనివాసులు సొంత ఖర్చుతో సీసీ కెమెరాలను మంగళవారం ఏర్పాటు చేశారు. తాను చదువుకున్న బడి పై కృతజ్ఞతతో, గతంలో జరిగిన కొన్ని అవాంఛనీయ సంఘటనలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. పాఠశాల భద్రత కొరకు తీసుకున్న చర్యలను ఉపాధ్యాయులు విద్యార్థులు అభినందించారు.
WGL: గీసుకొండ(M) కేంద్రంలోని కొమ్మల గ్రామంలో నిర్వహించనున్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై మంగళవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మెరుగైన వసతులు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశించారు.
NLG: అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యంను మిర్యాలగూడ వన్ టౌన్ పోలీసులు మంగళవారం పట్టుకున్నారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ పట్టణంలోని గుర్తు తెలియని వ్యక్తి సుమారు 8 క్వింటాల రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తుండగా.. పట్టణంలోని కబరాస్తాన వద్ద పట్టుకుని పోలీస్ స్టేషన్కు తరలించినట్లు స్థానికులు పేర్కొంటున్నారు.
MBNR: భారత ప్రభుత్వం యువజన సర్వీసులు క్రీడల మంత్రిత్వ శాఖ (మై భారత్), పీయూ సంయుక్తంగా “విక్షిత్ భారత్ యూత్ పార్లమెంట్” పోటీలు బుధవారం పీయూలోని లైబ్రరీ ఆడిటోరియంలో నిర్వహిస్తున్నట్లు యువజన అధికారి కోట నాయక్ ఓ ప్రకటనలో తెలిపారు. ముఖ్య అతిథిగా వీసీ జీఎన్.శ్రీనివాస్ హాజరవుతున్నారని, అన్ని కళాశాలల విద్యార్థులు పాల్గొనాలని తెలిపారు.
MNCL: సింగరేణిలో పనిచేస్తున్న అధికారులతో పాటు ప్రతి ఉద్యోగికి బొగ్గు నాణ్యతపై అవగాహన కలిగి ఉండాలని డైరెక్టర్(ప్రాజెక్ట్ ప్లానింగ్) వెంకటేశ్వరరావు సూచించారు. మందమర్రి ఏరియా ఇల్లందు క్లబ్లో బొగ్గు నాణ్యత వినియోగదారుల అవసరాల దృష్ట్యా సింగరేణి ఎదుర్కొంటున్న సమస్యల అంశంపై డైరెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.