BHPL: రేగొండ మండలంలోని ప్రసిద్ధ కోటంచ శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయాన్ని ఆదివారం BJP జిల్లా అధ్యక్షుడు నిషిధర్ రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం నూతనంగా ఆలయ ఛైర్మన్గా బాధ్యతలు చేపట్టిన సంపత్ రావును శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో BJP నేతలు తదితరులు ఉన్నారు.
VKB: దుద్యాల మండల కేంద్రం నుంచి సాగారంతండా వరకు రోడ్డు విస్తరణ పనులు చేపట్టిన అధికారులు అసంపూర్తిగా పనులు వదిలివేయడంతో ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు. కంకర పరిచి వదిలివేయడంతో దుమ్మూధూళి కళ్లల్లో పడి ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. దీంతో అసంపూర్తిగా ఉన్న రోడ్డు పనులను వెంటనే పూర్తి చేయాలని కోరుతున్నారు.
NRML: కడెం మండలం ఉడుంపూర్ గ్రామాన్ని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు హుస్సేన్ నాయక్ సందర్శించారు. వారికి కడం మండల బీజేపీ అధ్యక్షుడు కాశవేణి శ్రీనివాస్ యాదవ్, గ్రామ పెద్దలు సంప్రదాయ బద్ధంగా గొంగడి వేసి, గొర్రె పిల్లను అందించి ఘన స్వాగతం పలికారు. కడం నుంచి కల్లెడ గ్రామం వరకు ప్రతిపాదిత ఎత్తిపోతల పథకాన్ని ఉడుంపూర్ వరకు విస్తరించి నీటి సరఫరా కల్పించాలన్నారు.
MDK: తూప్రాన్ పట్టణ మున్సిపల్ పరిధి పడాలపల్లి (11వ వార్డు) యాదవ సంఘం అధ్యక్షుడిగా పెద్దగొల్ల లంబ మల్లేష్ యాదవ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. పడాలపల్లి యాదవ సంఘం ఆధ్వర్యంలో ఎన్నిక కార్యక్రమం చేపట్టారు. యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడు గండి చిలుక మల్లేష్ యాదవ్ ముఖ్య అతిథిగా విచ్చేయగా ఎన్నిక కార్యక్రమం చేపట్టారు.
ASF: కాగజ్ నగర్ పట్టణంలోని గాయత్రి మందిరంలో గత 2 రోజులుగా జరుగుతున్న 24 కుండముల గాయత్రి మహా యజ్ఞ పూర్ణాహుతి కార్యక్రమంలో MLA హరీష్ బాబు ఆదివారం పాల్గొన్నారు. MLA మాట్లాడుతూ.. గాయత్రి పరివారం గొప్ప ఆధ్యాత్మిక సమూహంగాఎదిగి ప్రజల్లో వైదిక, ఆధ్యాత్మిక సౌరభాలను పెంపొందిస్తుందని తెలియజేశారు. అనంతరం అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
NLG: ప్రజల హక్కుల కోసం నిరంతర పోరాటమే మార్గమని ఆదర్శంగా నిలిచిన వ్యక్తి శ్రీనివాస్ రెడ్డి అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి సభ్యులు జూలకంటి రంగారెడ్డి తెలిపారు. ఆదివారం నాడు శ్రీనివాస్ రెడ్డి 44వ వర్ధంతి సందర్భంగా ఆయన స్థూపం వద్ద జరిగిన సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలో ఎర్రజెండాలతో ర్యాలీని శ్రీనివాస్ రెడ్డి స్తూపం వరకు నిర్వహించారు.
ADB: ఇంద్రవెల్లి మండలంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికుల వివరాల ప్రకారం.. దనోరా గ్రామ సమీపంలో బైక్పై అతివేగంగా ప్రయాణిస్తున్న బైక్ ఒక్కసారిగా అదుపుతప్పడంతో రహదారి పక్కనే ఉన్న చెట్టును బలంగా ఢీకొంది. ఈ ప్రమాద తీవ్రతకు బైక్ నడుపుతున్న వ్యక్తితో పాటు వెనుక ఉన్న మరో మహిళకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందారు.
ఖమ్మం నగర శివారు వెలుగుమట్లలోని భూదాన్ భూమిలో ఇల్లు కోల్పోయిన బాధితులకు బీఆర్ఎస్ పార్టీ బాసటగా నిలుస్తోంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచన మేరకు వరసగా 4వ రోజు కూడా బీఆర్ఎస్ పార్టీ భోజనాలను సమకూర్చింది. ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో ఆదివారం వెలుగుమట్ల బాధితులకు అన్నదానం చేశారు.
NGKL: జిల్లాలో ఓ ప్రైవేట్ గార్డెన్స్లో సనాతన ధర్మ పరిరక్షణ రౌండ్ టేబుల్ సమావేశం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని సనాతన ధర్మ పరిరక్షణ ప్రతి భారతీయుడి కర్తవ్యమని పేర్కొన్నారు. యువత ధార్మిక చైతన్యంతో ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. సమావేశంలో స్థానిక నాయకులు, ఆధ్యాత్మిక నేతలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
BDK: చర్ల మండల కేంద్రంలో నేడు రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదివారం నూతన 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రి భవన నిర్మాణానికి ఘనంగా శంకుస్థాపన చేశారు. ప్రజలకు వైద్య సేవలు నిరంతరం అందుబాటులో ఉండాలని మంత్రి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ పోరిక బలరాం నాయక్, ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు కలెక్టర్ అంకిత్ పిఓ రాహుల్ తదితరులు పాల్గొన్నారు.
WGL: ఉమ్మడి జిల్లాల గ్రామాల్లో పారిశుద్ధ్యం, తాగునీటి పనుల బిల్లుల చెల్లింపుకు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. జిల్లాల వారీగా దశలవారీగా మంజూరైన నిధుల వివరాలు ఇలా ఉన్నాయి: WGL జిల్లాకు రూ.14.94 కోట్లు, BHPLకి రూ.11.75 కోట్లు, JNకు రూ.15.23 కోట్లు, MHBDకు రూ.37.97 కోట్లు, MLGకు రూ.14.36 కోట్లు HNK జిల్లాకు రూ.13.78 కోట్లు దశలవారీగా మంజూరయ్యాయి.
MHBD: సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయ సాధనకు గౌడ కులస్తుల కృషి చేయాలని సర్దార్ సర్వాయి పాపన్న మోకు దెబ్బ గౌడ సంఘం తొర్రూరు మండల అధ్యక్షుడు బోలగాని మహేష్ గౌడ్ అన్నారు. మండలంలోని పత్తేపురం గ్రామంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు గౌడ కులస్తులకు అందే విధంగా కృషి చేయాలని అన్నారు.
GDWL: ఎర్రవల్లి మండలం యాక్తాపురం గ్రామంలో ఆదివారం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ పచ్చర్ల కుమార్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. లబ్ధిదారుడు ప్రత్యేకంగా ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు వెంకటేష్, పాల్గొన్నారు.
MBNR: హన్వాడ మండలం దొర్రితండా పాఠశాల 5వ తరగతి విద్యార్థి నిదీష్, ఏపీలోని ప్రతిష్ఠాత్మక కొరుకొండ సైనిక్ పాఠశాలకు ఎంపికయ్యాడు. ప్రవేశ పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనబరిచి సీటు సాధించిన నిదీష్ విజయాన్ని గ్రామస్థులు, ఉపాధ్యాయులు హర్షంతో స్వాగతించారు. ఆయన విజయం తండాలోని ఇతర విద్యార్థులకు స్ఫూర్తిదాయకమని పలువురు కొనియాడారు.
HNK: పట్టణ కేంద్రంలోని కుమార్ పల్లి మార్కెట్లో ఆదివారం సంచార ఆహార కల్తీ ప్రయోగశాల ఆధ్వర్యంలో పాలలో కల్తీ పై ‘టేస్ట్ చెక్’ నిర్వహించారు. పాల ప్యాకెట్ల పై వెన్న శాతం 6.0గా చూపిస్తున్నప్పటికీ వాస్తవంలో 5.5 శాతమే ఉండటం గమనించారు. నిల్వ కోసం హైడ్రోజన్ పెరాక్సైడ్ వంటి ప్రమాదకర రసాయనాలు కలుపుతున్నారని ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ బ్రహ్మాజీ ప్రజలకు వివరించారు.