• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

విరోష్ వివాహ రిసెప్షన్ వేడుకలో ఎమ్మెల్యే

ASF: హైదరాబాద్ నగరంలోని తాజ్ కృష్ణ హోటల్లో ప్రముఖ సినీ నటులు విజయ్ దేవరకొండ – రష్మిక మందన వివాహ రిసెప్షన్ వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సిర్పూర్ ఎమ్మెల్యే డా. పాల్వాయి హరీష్ బాబు హాజరై నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేతో పాటు మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ కూడా రిసెప్షన్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

March 5, 2026 / 06:52 AM IST

సెంట్రల్ ఫోర్సులో అక్కాచెల్లళ్లకు ఉద్యోగాలు..సన్మానం

MNCL: సెంట్రల్ ఫోర్సులో ఉద్యోగాలు సాధించిన జన్నారం మండలంలోని పొనకల్ గాంధీనగర్‌కు చెందిన అక్క, చెల్లెళ్లను పలువురు శాలువాలు కప్పి సన్మానించారు. బొమ్మిడి రాజేందర్-సుజాత దంపతుల ఇద్దరు కుమార్తెలు శ్రావ్యరాణి, ప్రవళికలు CISF, IBCF సెంట్రల్ ఫోర్సులో ఉద్యోగాలలో చేరారు. ఇంటికి వచ్చిన ఆ ఇరువురిని హరిత రిసార్ట్ ఆవరణలో శాలువాలు కప్పి సన్మానించారు.

March 5, 2026 / 06:51 AM IST

అధికారులతో సమీక్ష నిర్వహించిన కలెక్టర్

WGL: కలెక్టర్ డా. సత్య శారద బుధవారం సాయంత్రం కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికను గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు సమర్థవంతంగా అమలు చేయాల్సిందిగా అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ సంధ్యారాణి పాల్గొన్నారు.

March 5, 2026 / 06:49 AM IST

రైలు పట్టాలపై గుర్తు తెలియని వ్యక్తి మృతి

ASF: రెబ్బెన మండలం ఇంద్రానగర్ సమీపంలో రైలు పట్టాలపై బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. దానాపూర్ ఎక్స్‌ప్రెస్ రైలు కింద పడి మృతి చెంది ఉంటాడని పోలీసులు తెలిపారు. మృతుడి వయసు సుమారు 50 ఏళ్ళు ఉంటుందని, తెల్లని షర్ట్, నీలి జీన్స్ ధరించి, మెడలో తాయత్తు ఉన్నట్లు గుర్తించారు. సమాచారం తెలిస్తే తమను సంప్రదించాలన్నారు.

March 5, 2026 / 06:49 AM IST

కూసుమంచిలో ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు

KMM: కూసుమంచి మండలం నాయకన్జూడెం గ్రామంలో బుధవారం గ్రామపంచాయతీ సిబ్బంది పారిశుద్ధ్య పనులు చేపట్టారు. ముఖ్యంగా బొడ్రాయి బజార్లోని డ్రైనేజీల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించి, మురుగునీరు సాఫీగా వెళ్లేలా చర్యలు తీసుకున్నారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం అందరి బాధ్యతని, దీనివల్ల వ్యాధులు దరిచేరవని గ్రామస్తులు ఈ సందర్భంగా పేర్కొన్నారు.

March 5, 2026 / 06:45 AM IST

మదనాపురంలో భారీగా ఇసుక డంపుల సీజ్!

WNP: మదనాపురం మండలం కరివేన గ్రామ శివారులో అక్రమంగా నిల్వ ఉంచిన 30 ట్రాక్టర్ల ఇసుకను రెవెన్యూ అధికారులు బుధవారం సీజ్ చేశారు. ఊకచెట్టు వాగు నుంచి ఇసుకను తరలించి డంపు చేస్తున్నారన్న సమాచారంతో తహశీల్దార్ జె.కె. మోహన్ దాడులు నిర్వహించారు. సీజ్ చేసిన ఇసుకను తదుపరి చర్యల కోసం పోలీసులకు అప్పగించారు.

March 5, 2026 / 06:45 AM IST

అర్ధరాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్.. సీఐ హెచ్చరిక

మహబూబాబాద్ పట్టణంలోని ముత్యాలమ్మ సెంటర్లో బుధవారం అర్ధరాత్రి పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. సీఐ మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో వాహనదారులకు బ్రీత్ అనలైజర్ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మద్యం మత్తులో వాహనాలు నడపడం వల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు.

March 5, 2026 / 06:44 AM IST

సుగంధ ద్రవ్యాలతో అభిషేకం.. మహా మంగళ నీరాజనం

HNK: హనుమకొండ చారిత్రక శ్రీ హనుమద్గిరి పద్మాక్షి దేవాలయంలో శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఫాల్గుణ మాసం శుక్లపక్షం సందర్భంగా విశేష పూజలు చేశారు. తెల్లవారుజాము నుంచి అమ్మవారికి సుగంధ ద్రవ్యాలతో అభిషేక పూజలు చేశారు. అలంకరణ అనంతరం మహా మంగళ నిరాజనం, భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.

March 5, 2026 / 06:44 AM IST

‘పిల్లల నడవడికపై తల్లిదండ్రులు దృషి సారించాలి’

PDPL: మంథని పట్టణ కేంద్రంలోని ఆర్టీసీబస్ స్టేషన్‌లో బుధవారం పోలీసులు సైబర్ నేరాలు, అలాగే గంజాయి మత్తుపదార్థాల వినియోగంపై వ్యతిరేకంగా అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మంథని ఏఎస్సై శ్రీనివాస్ మాట్లాడుతూ.. పిల్లల నడవడికపై తల్లిదండ్రులు దృషి సారించాలని, పిల్లలు చేసే ప్రతి చర్యను గమనించాలని సూచించారు. అదే విధంగా సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు.

March 5, 2026 / 06:43 AM IST

వంద శాతం ఫలితాలే లక్ష్యం: కలెక్టర్

GDWL: ​పదో తరగతి మీ జీవిత గమ్యాన్ని మార్చే కీలక మలుపు అని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా పేర్కొన్నారు. బుధవారం గద్వాల ప్రభుత్వ బాలుల ఉన్నత పాఠశాలలో కలెక్టర్ పదవ తరగతి పరీక్షలు అధిగమించే మెలకువలను మోటివేషన్ క్లాస్ ద్వారా వివరించారు. కలెక్టర్ మాట్లాడుతూ గత ఐదేళ్ల ప్రశ్నాపత్రాలను సాధన చేయాలని, స్పష్టమైన చేతివ్రాతతో సమాధానాలు రాయాలని సూచించారు.

March 5, 2026 / 06:43 AM IST

ఉపాధి హామీ పనులపై ‘ప్రజావేదిక’

NLG: చిట్యాల మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం ఉపాధి హామీ పథకం 16వ సామాజిక తనిఖీ, ‘ప్రజావేదిక’ నిర్వహించారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.2.37 కోట్ల వ్యయంతో జరిగిన పనులపై ఈ ఓపెన్ ఫోరంలో సమీక్షించారు. పనుల పారదర్శకత, అమలు తీరును అధికారులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శేఖర్ రెడ్డి ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

March 5, 2026 / 06:43 AM IST

రూ.4 వేల అప్పు కోసం కత్తితో దాడి

KMM: జిల్లాలో రూ. 4 వేల అప్పు వివాదం ఒక యువకుడి ప్రాణాల మీదకు తెచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీరోలు గ్రామానికి చెందిన ఉదయ్, విక్రమ్‌కి కొంత నగదు బాకీ ఉన్నాడు. ఈ విషయమై మంగళవారం రాత్రి గొడవ జరగగా.. విక్రమ్ తన స్నేహితులు మహేష్, లింగరాజుతో కలిసి ఉదయ్‌పై కత్తితో దాడి చేశాడు. నిందితులు ముగ్గురిని ఎస్సై జగదీష్ అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

March 5, 2026 / 06:41 AM IST

రాష్ట్రస్థాయికి ఎంపికైన కొరపల్లి విద్యార్థి ప్రాజెక్టు

KNR: జమ్మికుంట మండలం కోరపల్లికి చెందిన రొంటాల సాయి రిత్విక్ రూపొందించిన ప్రాజెక్టు రాష్ట్రస్థాయికి ఎంపికయింది. సాయి రిత్విక్ రూపొందించిన “స్మార్ట్ క్రాప్ ప్రొటెక్షన్ ఫ్రమ్ అనిమల్స్” ప్రాజెక్ట్ రాష్ట్రస్థాయికి ఎంపికైంది. జంతువుల బారి నుంచి పంటలను రక్షించే ఈ ప్రాజెక్ట్ ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయులు కేతిరి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

March 5, 2026 / 06:40 AM IST

ప్రభుత్వ విద్యుత్ ఇప్పించాలని ఎమ్మెల్యేకు వినతి

MNCL: బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 22వ వార్డు, బూడిద బస్తీలో ప్రభుత్వ విద్యుత్ ఇప్పించాలని స్థానిక కాంగ్రెస్ నాయకులు కోరారు. ఈ మేరకు బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్‌కు వినతిపత్రం సమర్పించారు. సింగరేణి సంస్థ విద్యుత్ కనెక్షన్లు తొలగించినందున వెంటనే ప్రభుత్వ విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసి విద్యుత్ సౌకర్యం కల్పించాలని కోరారు.

March 5, 2026 / 06:38 AM IST

నవీపేట్లో సైబర్ క్రైమ్ కేసు నమోదు

NZB: నవీపేట్లో సైబర్ మోసం ఘటన చోటు చేసుకుంది. ఎస్సై శ్రీకాంత్ తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన గంగాధర్‌కు ఫిబ్రవరి 22న ట్రాఫిక్ ఈ-చలాన్ పేరుతో ఓ APK ఫైల్ వాట్సాప్ ద్వారా వచ్చింది. వాహనంపై చలానా పడుతుందేమో భావించి ఫైల్ డౌన్లోడ్ చేయగా అతని ఖాతా నుంచి రెండు దఫాల్లో రూ.50 వేల చొప్పున మొత్తం రూ.1 లక్ష కట్ అయ్యాయి. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.

March 5, 2026 / 06:35 AM IST