JN: రఘునాథపల్లి గ్రామంలో VOA భవన నిర్మాణానికి స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు భూమి పూజ చేశారు. సర్పంచ్ వెంకటయ్య మాట్లాడుతూ.. గ్రామంలో మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తామని, మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా రాణిస్తూ సమాజాభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలని అన్నారు. ఉప సర్పంచ్ సుధీర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
RR: మహేశ్వరం నియోజకవర్గం, జీహెచ్ఎంసీ పరిధిలోని బడంగ్ పేట్ డివిజన్ శ్రీ సరస్వతి శిశు మందిర్ హై స్కూల్లో నూతనంగా నిర్మించిన తరగతి గదుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, మాజీ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి పాల్గొన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ కార్పొరేటర్ పెద్దబావి సుదర్శన్ రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.
WNP: క్రీడాకారులు క్రమశిక్షణ, పట్టుదలతో సాధన చేస్తే మరింత ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన ‘సీఎం-కప్’ 2వ ఎడిషన్ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలలో జిల్లా జట్టు విజేతగా నిలిచింది. రాష్ట్రస్థాయిలో విజయం సాధించడం జిల్లాకు గర్వకారణమని కలెక్టర్ పేర్కొన్నారు.
NLG: శ్రీ శ్రీ శ్రీ భూసమేత తిరుమలనాధస్వామి కళ్యాణ మహోత్సవానికి హాజరైన భక్తులకు గురువారం పున్న రాములు భారతమ్మ దంపతులు అన్న ప్రసాద వితరణ జరిపారు. ఈ కార్యక్రమానికి ముందు స్వామివారికి ‘నైవేద్యం’ సమర్పించారు. కళ్యాణానికి విచ్చేసిన దాదాపు 6,000 మంది భక్తులకు ఎలాంటి లోటు లేకుండా అన్న ప్రసాద వితరణకు ఏర్పాట్లు చేశారు. నిర్వహకులు దాతకు కృతజ్ఞతలు తెలిపారు.
RR: వివేకానంద నగర్ డివిజన్ AS రాజు నగర్ కాలనీలో రూ.19 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్, చిన్నారుల ఆట స్థలాన్ని ఎమ్మెల్యే, పీఏసీ ఛైర్మన్ గాంధీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భావితరాలకు ఆస్తుల కంటే మంచి ఆరోగ్యాన్ని, ప్రశాంతమైన జీవనాన్ని అందించడమే మన అందరి బాధ్యత అని పేర్కొన్నారు. ప్రస్తుత జీవనశైలిలో వ్యాయామం అనివార్యమని గాంధీ తెలిపారు.
HNK: పరకాల వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ సమావేశాన్ని నేడు నిర్వహించారు. మార్కెట్ కమిటీ ఛైర్మన్ రాజిరెడ్డి మాట్లాడుతూ.. వ్యవసాయ మార్కెట్ బలోపేతమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తూ మార్కెట్కు విచ్చేసే రైతులకు ఇబ్బందులు లేకుండా సమన్వయంతో పనిచేద్దామని అన్నారు. అనంతరం నూతన పరకాల మున్సిపల్ ఛైర్మన్ సునీల్ కుమార్ ను మార్కెట్ పాలకవర్గ సభ్యులు సన్మానించారు.
NRML: మహిళల భద్రత ప్రజల రక్షణే నారిశక్తి ప్రధాన లక్ష్యమని జిల్లా ఎస్పీ జానకి షర్మిల అన్నారు. జిల్లాలో ప్రతి గురువారం నిర్వహిస్తున్న నారీ శక్తి కార్యక్రమం సత్ఫలితాలను ఇస్తుందని వెల్లడించారు. మహిళా పోలీస్ సిబ్బంది తమ పోలీస్ స్టేషన్ పరిధిలో పెట్రోలింగ్ నిర్వహిస్తూ వచ్చిన డయల్ 100 కాల్ను తక్షణమే స్పందించి బాధితుల సమస్యలను పరిష్కరిస్తున్నారని తెలిపారు.
WNP: మెడికల్ కళాశాల ఆవరణలో ఇతర నిర్మాణాలు చేపట్టడం ద్వారా కళాశాల ప్రమాణాలు పెంచడానికి అడ్డంకి అవుతుందని వెంటనే యంగ్ ఇండియా స్కూల్ నిర్మాణానికి వేరే స్థలంలో కేటాయించి విద్యార్థులకు న్యాయం చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. గురువారం మాజీమంత్రి నిరంజన్ రెడ్డి నివాసంలో కలిసి విజ్ఞప్తి చేయగా.. ఆయన కలెక్టర్తో ఫోన్ ద్వారా మాట్లాడి పరిష్కరిస్తామన్నారు.
PDPL: పిల్లల సమగ్ర అభివృద్ధికి ఉపాధ్యాయులు కృషి చేయాలని కలెక్టర్ శ్రీహర్ష సూచించారు. ఇవాళ ఆయన ఉపాధ్యాయులు, విద్యార్థుల మధ్య మంచి సంబంధాలు ఏర్పడడానికి ఏర్పాటుచేసిన ‘శక్తి’ కార్యక్రమం పై సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ కార్యక్రమం అమలు వల్ల విద్యార్థుల హాజరు శాతం. విద్యా ప్రమాణాలు మెరుగయ్యాయని తెలిపారు. DEO శారద, అధికారులు పాల్గొన్నారు.
నల్గొండ జిల్లాలో ప్రప్రథమంగా అంధ విద్యార్థులకు ప్రత్యేక డిజిటల్ లైబ్రరీ కార్నర్ సదుపాయాలను జిల్లా గ్రంథాలయంలో ప్రారంభించడం గర్వకారణమని జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ ఆఫీజ్ ఖాన్ అన్నారు. గురువారం జిల్లా కేంద్ర గ్రంథాలయంలో బ్లైండ్ (దృష్టి లోపం) పాఠకులు, విద్యార్థులకై ప్రత్యేక డిజిటల్ లైబ్రరీ కార్నర్ను ఆయన ప్రారంభించారు.
PDPL: పెద్దపల్లి జిల్లాలో బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఎంపికకు రెసిడెన్షియల్, నాన్ రెసిడెన్షియల్ పథకంలో ఉత్తమ పాఠశాలలను ఎంపిక చేయడానికి జిల్లాలోని ప్రైవేటు పాఠశాలల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి రవీందర్ తెలిపారు. మార్చి 25 లోగా ఎస్సీ అభివృద్ధి అధికారి కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని ఆయన సూచించారు.
MNCL: బెల్లంపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను ఇంజనీరింగ్ కళాశాలగా అప్గ్రేడ్ చేయాలని AIFDS రాష్ట్ర సహాయ కార్యదర్శి రాజేంద్రప్రసాద్ డిమాండ్ చేశారు. గురువారం బెల్లంపల్లిలో ఆయన మాట్లాడుతూ 2026-27 విద్యా సంవత్సరానికి రూ.6 కోట్లతో ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్ కోర్సు ప్రారంభించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. అప్గ్రేడ్ కు ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోవాలన్నారు.
KNR: గంగాధర మండలం ఒద్యారం గ్రామ పంచాయతీలో గురువారం రైతులకు ఫార్మర్ రిజిస్ట్రీ రైతు గుర్తింపు కార్డు గురించి వ్యవసాయ అధికారులు రైతులకు అవగాహన కల్పించారు. వ్యవసాయ భూమి కలిగి ఉన్న ప్రతీ రైతు ఫార్మర్ రిజస్ట్రీని ఫిబ్రవరి 28లోగా నమోదు చేసుకోవాలని రైతులకు వ్యవసాయ అధికారులు సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఈవో గోపి చంద్, సర్పంచ్ ఉమ పాల్గొన్నారు.
SRPT: పోలీసు సిబ్బంది సంక్షేమం కోసం ఎల్లప్పుడూ కృషి చేస్తామని ఎస్పీ నరసింహ అన్నారు. గురువారం సూర్యాపేటలోని ఎస్పీ కార్యాలయంలో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తూ అనారోగ్యంతో మరణించిన కృష్ణయ్య కుటుంబానికి ఇన్సూరెన్స్ నగదు చెక్కును అందజేసి మాట్లాడారు. సిబ్బంది ఆరోగ్యంపై దృష్టి సారించాలని, సిబ్బంది కుటుంబాలకు ఆరోగ్య భద్రత పథకం బాసటగా నిలుస్తుందన్నారు.
ADB: శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలం వెళ్లలేని భక్తుల కోసం ఆర్టీసీ ప్రత్యేక సదుపాయం కల్పించింది. ఆర్టీసీ లాజిస్టిక్స్, దేవాదాయ శాఖ సహకారంతో సీతారాముల కళ్యాణ తలంబ్రాలను భక్తుల ఇంటి వద్దకే చేరవేసే కార్యక్రమాన్ని చేపట్టారు. ఆదిలాబాద్ జిల్లాలోని భక్తులు రూ. 151 చెల్లించి ఆర్టీసీ లాజిస్టిక్స్ కౌంటర్లలో లేదా ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చన్నారు.