జగిత్యాల జిల్లా రాయికల్ మండలం శివాజీ నగర్ కు చెందిన చొప్పదండి నరసయ్య (67) ఈనెల 23న మార్నింగ్ వాక్ చేస్తుండగా వెనుక నుంచి బైక్ ఢీకొనడంతో తీవ్ర గాయాల పాలయ్యాడు. వెంటనే హైదరాబాద్ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా నిన్న బ్రెయిన్ డెడ్ అయినట్లు డాక్టర్లు ధృవీకరించారు. దీంతో నరసయ్య కుటుంబ సభ్యులు ఇవాళ అతని లివర్, లంగ్స్ దానం చేశారు.
NRML: గ్రామాల్లో శాంతి భద్రతలను అందించేందుకే ఎస్పీ జానకి షర్మిల ఆదేశాల మేరకు కార్డెన్ సెర్చ్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని ఏఎస్పి సాయికిరణ్ తెలిపారు. మంజులాపూర్ కాలనీలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం ద్వారా 56 బైకులను సీజ్ చేసినట్లు తెలిపారు. అనంతరం ప్రజలకు సైబర్ నేరాలు, రోడ్డు భద్రత, దొంగతనాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలను వారికి వివరించారు.
BDK: గత ఐదు దశాబ్దాలుగా పీడిత ప్రజల పక్షాన నిలబడుతూ ఎన్నో పోరాటాలు చేసి నేడు జనజీవన స్రవంతిలో కలవడం సరైన నిర్ణయమని యువతరం పార్టీ నాయకులు కొనియాడారు. లొంగిపోయిన మావోయిస్టులకు యువతరం పార్టీ ఆహ్వానం పలుకుతుందని రాష్ట్ర అధ్యక్షుడు గుజ్జుల వేణుగోపాల్ రెడ్డి అన్నారు. భద్రాచలంలో గురువారం జరిగిన సమావేశంలో మాట్లాడారు.
JGL: జగిత్యాల జిల్లాలో రైతులకు నాణ్యమైన, అంతరాయం లేని విద్యుత్ సరఫరా అందించడమే లక్ష్యంగా వ్యవసాయ విద్యుత్ సర్వీసులను గరిష్ఠ స్థాయిలో మంజూరు చేసినట్లు SE బి. సుదర్శనం తెలిపారు. వ్యవసాయ రంగానికి విద్యుత్ శాఖ అత్యంత ప్రాధాన్యం ఇస్తుందన్నారు. డిసెంబర్ నుంచి ఇప్పటివరకు మొత్తం 656 వ్యవసాయ సర్వీసులు మంజూరు చేశామన్నారు.
MDK: మాసాయిపేట మండలం బొమ్మారంకు చెందిన మెట్టెల నాగరాజు (25) ట్రాక్టర్ ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. నిన్న రైల్వే ట్రాక్ పనులకు వాటర్ సప్లయ్ చేస్తుండగా ప్రమాదం జరిగి ట్రాక్టర్ ట్యాంకరు బోల్తాపడగా నాగరాజు తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స పొందుతూ గురువారం మృతి చెందినట్లు పోలీసులు వివరించారు.
MDCL: మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మల్కాజిగిరి, ఉప్పల్, ఎల్బీనగర్ జోన్ ప్రాంతాలు వస్తాయి. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం తార్నాకలోని HMDA భవనంలో అందుబాటులో ఉంది. కమిషనర్ అధికారి, ఇతర అధికారులు ఇక్కడ అందుబాటులో ఉంటారు. కిందిస్థాయిలో సమస్యలు పరిష్కారం కాకపోతే డైరెక్ట్ కమిషనర్ కార్యాలయానికి రావాలన్నారు.
SRCL: చందుర్తి మండలం లింగంపేట గ్రామంలో గురువారం నిర్వహించిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపి నూతన వస్త్రాలు అందజేశారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
MNCL: గోదావరి పుష్కరాల నిర్వహణకు పూర్తి కార్యచరణ సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం నస్పూర్లోని కలెక్టరేట్లో సీపీ అంబర్ కిషోర్ ఝా, డీసీపీ భాస్కర్, అదనపు కలెక్టర్ చంద్రయ్య, ఇతర అధికారులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలోని గోదావరి నది తీర ప్రాంతాలలో పుష్కర ఘాట్ల ఏర్పాట్లకు కార్యచరణ సిద్ధం చేయాలన్నారు.
MDK: రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీపై అందజేస్తున్న వ్యవసాయ పరికరాలను సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయ శాఖ ఏడీ పుణ్యవతి పేర్కొన్నారు. మాసాయిపేట మండలానికి మంజూరైన మూడు స్పేయర్లు, మూడు రోటవేటర్లను మండల వ్యవసాయధికారి కవితతో కలిసి లబ్ధిదారులకు అందజేశారు. ప్రభుత్వం వ్యవసాయం ప్రోత్సహించడానికి సబ్సిడీ పరికరాలను అందజేస్తున్నట్లు తెలిపారు.
BHNG: పాఠశాల అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తానని జూకంటి బాబు ఫౌండేషన్ అధ్యక్షులు జూకంటి బాబు తెలిపారు. గురువారం ఆలేరు మండలం టంగుటూరు గ్రామం ఎలగందుల రాజ్యలక్ష్మి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు నాలుగు ఆకర్షణీయమైన రంగులతో కూడిన యూనిఫామ్లను ఆయన అందజేశారు. విద్యార్థుల భవిష్యత్తు బలోపేతానికి తమ ఫౌండేషన్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని అన్నారు.
ADB: శాంతి భద్రతల పరిరక్షణలో రూరల్ SI విష్ణువర్ధన్ పాత్ర కీలకం అని SP అఖిల్ మహాజన్ తెలిపారు. ఆదివాసీల అభివృద్ధి, విద్యార్థులకు పరీక్ష సామాగ్రి, క్రీడారంగంలో అభివృద్ధి చెందడానికి విష్ణువర్ధన్ సేవలు మరువలేనివని అన్నారు. ఈ మేరకు మహిళా క్రీడాకారులకు ఆర్చరీ కిట్లు, ఎనిమిది మంది క్రీడాకారులకు ట్రాక్ సూట్స్ SP అఖిల్ మహాజన్ చేతుల మీదుగా గురువారం అందజేశారు.
PDPL: పెద్దపల్లి జిల్లా మంథనిలో శకుంతలోపాఖ్యానం ప్రవచనాలకు విశేష స్పందన లభిస్తోంది. వివిధ మండలాలు, ఇతర ప్రాంతాల నుంచి భక్తులు పెద్దఎత్తున హాజరవుతున్నారు. గరికిపాటి ప్రవచనాలు వినేందుకు తొలిరోజు వేసిన 2500 కుర్చీలు సరిపోలక, రెండో రోజు 600 అదనంగా ఏర్పాటు చేశారు. గురువారం చివరి రోజు కావడంతో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశముంది.
MDK: ప్రతి విద్యార్థి రోడ్డు భద్రతపై అవగాహన కల్పించే బ్రాండ్ అంబాసిడర్గా మారాలని జిల్లా ఎస్పీ డివి.శ్రీనివాసరావు పేర్కొన్నారు. నర్సాపూర్ బీవీఆర్ఐటీ కళాశాలలో విద్యార్థులకు రోడ్డు భద్రతపై ‘Arrive-Alive’ కార్యక్రమంపై అవగాహన కల్పించారు. రోడ్డు ప్రమాదాలను నియంత్రించడం లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రెండో విడత చేపట్టినట్టు వివరించారు.
SRPT: రెండు కేసుల్లో కోర్టు వాయిదాలకు హాజరుకాకుండా తప్పించుకు తిరుగుతున్న చివ్వెంల మండలం ఆయిలపురం గ్రామ నివాసి చేర్కుపల్లి సైదులును పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. సూర్యాపేట కోర్టు ఇతనిపై NBW జారీ చేయడంతో నిందితుడిని పట్టుకుని న్యాయస్థానంలో హాజరుపరిచారు. కోర్టు ఆదేశాల మేరకు అతడిని సూర్యాపేట సబ్ జైలుకు తరలించినట్లు ఎస్సై మహేష్ తెలిపారు.
RR: బాటసింగారం మార్కెట్లో తోతాపురి రకానికి చెందిన మామిడికాయలు పెద్ద ఎత్తున దర్శనమిస్తున్నాయి. రుచితో పాటు, ఎగుమతులకు అనుకూలంగా ఉండటం వల్ల ఈ రకానికి భారీ డిమాండ్ ఏర్పడింది. అయితే, 2025 సంవత్సరంలో మామిడి విక్రయాల ద్వారా మూడు కోట్ల రూపాయలకు పైగా ఆదాయం సమకూరింది. దీంతో రైతులు, వ్యాపారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.