• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

ఇలాంటి ముఖ్యమంత్రిని చూడలేదు: పెద్దిరెడ్డి

ఇలాంటి ముఖ్యమంత్రిని తన రాజకీయ జీవితంలో చూడలేదన్నారు మంత్రి పెద్దిరెడ్డి. మంగళగిరిలో రాష్ట్ర అటవీ శాఖ కార్యాలయాన్ని ప్రారంభించారు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి. ఈ సందర్భంగా మాట్లాడారు. యాభై ఏళ్ల నుండి తాను రాజకీయాల్లో ఉంటున్నట్లు చెప్పారు. జగన్ వంటి ముఖ్యమంత్రిని మాత్రం చూడలేదన్నారు. 2024లోను మళ్లీ వైసీపీనే గెలుస్తుందని చెప్పారు. జగన్ మరోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. ప్రజాస్వామ్యంలో ఇంత గొ...

January 19, 2023 / 01:34 PM IST

పిల్లలకు పాఠాలు చెప్పిన నిత్యామీనన్

నటి నిత్యామీనన్ విద్యార్థులకు తెలుగు పాఠాలు చెప్పింది. ఇందుకు సంబంధించిన వీడియో తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఈ మలయాళీ భామ తెలుగు చక్కగా మాట్లాడుతోందని నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఓ మలయాళీ సినిమాలో నటిస్తోంది. సినిమా షూటింగ్‌లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణాపూరంలో సందడి చేశారు. షూటింగ్ తర్వాత స్థానిక గవర్నమెంట్ స్కూల్‌కు వెళ్లారు. కాసేపు చిన్నారులతో సరదాగా గడిపారు. ఇంగ్ల...

January 19, 2023 / 01:10 PM IST

ఖమ్మం బీఆర్ఎస్ సభకు మంత్రి కేటీఆర్ దూరం

ఖమ్మంలో బీఆర్ఎస్ తొలి బహిరంగ సభ విజయవంతంగా జరిగింది. మంత్రి కేటీఆర్ మాత్రం కనిపించలేదు. జాతీయ పార్టీగా అవతరించిన తర్వాత జరిగిన తొలి బహిరంగ సభకు దూరంగా ఉన్నారు. ఇందుకు పలు కారణాలు ఉన్నాయి. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళతారు. ఆయనతోపాటు అల్లుడు, మంత్రి హరీశ్ రావు కూడా వెళ్లక తప్పేట్టు లేదని ప్రచారం జరుగుతుంది. ఇటీవల ఇదే విషయాన్ని ప్రతిపక్ష నేత ఒకరు పేర్కొన్నారు. రాష్ట్రంలో సీఎం పదవీని కేటీఆర...

January 19, 2023 / 01:04 PM IST

మోడీ, కేసీఆర్ ప్లాన్.. మళ్లీ జగన్ గెలుపు కోసమేనా?

తెలంగాణలో సై అంటే సై అంటున్న బీజేపీ, బీఆర్ఎస్ ఓ విషయంలో మాత్రం ఒకే ఆలోచనతో ఉన్నాయట. కలిసి పని చేయనప్పటికీ… అమిత్ షా, కేసీఆర్‌ల ఆరాటం జగన్ గెలుపు, చంద్రబాబు ఓటమి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. 2015లో ఓటుకు నోటు కేసు నుండి చంద్రబాబును టార్గెట్ చేస్తూ వస్తున్నారు కేసీఆర్. అలాగే, 2019 ఎన్నికలకు ఆరు నెలల ముందు తన రాజకీయ మనుగడ కోసం ఏపీలో తమను బద్నాం చేసేందుకు అస్త్రశస్త్రాలు ఉపయోగించిన టీడీపీ అ...

January 19, 2023 / 12:27 PM IST

కేరళ సీఎం అలా చేశాడేంటి, కమ్యూనిస్ట్‌ల టార్గెట్ అదొక్కటే?

కమ్యూనిస్ట్‌లు చారిత్రక తప్పిదాలు చేస్తుంటారు.. అలా ఎందుకంటారో మరోసారి నిరూపితమైందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఖమ్మం బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో కేసీఆర్‌తో పాటు కేజ్రీవాల్, భగవంత్ మాన్, పినరాయి విజయన్, అఖిలేష్ యాదవ్, డీ రాజా, తమ్మినేని వీరభద్రం తదితరులు పాల్గొన్నారు. సాధారణంగా ఆవిర్భావ సభలో ఎవరైనా తాము ఏం చేయదల్చుకున్నామో చెబుతారు.. కానీ ఈ సభలోని ప్రముఖులంతా కేవలం మోడీని, బీజేపీని మాత్రమే టార్గ...

January 19, 2023 / 10:28 AM IST

గ్రూప్-4కు 5 లక్షల అప్లికేషన్లు, మరో 3 లక్షలు వచ్చే ఛాన్స్

ప్రభుత్వ కొలువు అంటే హాట్ కేకు. చిన్న జాబ్ అయినా ఫర్లేదు ఇంట్రెస్ట్ చూపించేవారు చాలామంది ఉన్నారు. జూనియర్ అసిస్టెంట్, క్లర్క్ పోస్టులకు కూడా డిమాండ్ ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వం వివిధ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేపడుతోంది. గ్రూప్-4 పోస్టులకు చాలా మంది నిరుద్యోగులు ఆప్లై చేస్తున్నారు. ఇప్పటికే 5 లక్షల మంది దరఖాస్తు చేశారంటే.. జాబ్ కోసం ఏ స్థాయిలో పోటీ పడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. దరఖాస్తు చేసేందుక...

January 19, 2023 / 11:59 AM IST

వార్ రూమ్‌తో సునీల్ కనుగోలుకు సంబంధం లేదు: మల్లు రవి

కాంగ్రెస్ వార్ రూమ్ కేసులో కాంగ్రెస్ నేత, వార్ రూమ్ ఇంచార్జీ మల్లు రవి సీసీఎస్ విచారణకు హాజరయ్యారు. సైబర్ క్రైమ్ పోలీసులు బుధవారం ఆయనను మూడు గంటలపాటు ప్రశ్నించారు. ఆ తర్వాత మీడియాతో మల్లు రవి మాట్లాడారు. వార్ రూమ్‌కు తనే ఇంచార్జీని అని తెలిపారు. దీనికి సంబంధించి అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చానని వివరించారు. ఉద్యోగుల వివరాలను కూడా పోలీసులకు తెలిపానన్నారు. కేసుకు సంబంధించి అవసరమైతే మళ్లీ పిలుస్తా...

January 18, 2023 / 07:10 PM IST

బీఆర్ఎస్ వస్తే.. అగ్నిపథ్ ఉండదు : సీఎం కేసీఆర్

కేంద్రంలో తాము అధికారంలోకి రాగానే సైన్యానికి సంబంధించి అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేస్తామని భారత రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు బుధవారం స్పష్టం చేశారు. తాము పాత పద్ధతిలోనే దానిని కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. సైన్యానికి ఒక పద్ధతి అంటూ ఉండాలన్నారు. ఖమ్మం బీఆర్ఎస్ ఆవిర్భావ బహిరంగ సభలో మాట్లాడారు. బీజేపీ మతవిద్వేషాలు రెచ్చగొడుతూ పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తోందని, వాటిని ...

January 18, 2023 / 06:46 PM IST

మోడీ గారూ! మీ పాలసీ అదేనా.. నన్ను వేధిస్తోంది: కేసీఆర్ హెచ్చరిక

భారత్ ఎటువైపు వెళ్తుందనే ఆలోచన తనను ఎంతోకాలంగా వేధిస్తోందని, అసలు మనకంటూ ఓ లక్ష్యం ఉందా అని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు బుధవారం అన్నారు. ఖమ్మం బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో ఆయన మాట్లాడారు. ఎవరినీ అడిగే అవసరం లేని, ఏ ప్రపంచ బ్యాంకు వద్ద అప్పు చేయని విధంగా, ఏ విదేశం నుండి అప్పు తీసుకోకుండా మన వద్ద సహజ సంపద వనరులు ఉన్నాయన్నారు. దేశంలోని లక్షల కోట్ల ఆస్తి మన దేశ […]

January 18, 2023 / 06:11 PM IST

బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణ మోడల్ చూపితే రిజైన్: మంత్రి మల్లారెడ్డి సవాల్

ప్రధాని మోడీపై మంత్రి మల్లారెడ్డి విరుచుకుపడ్డారు. బీజేపీ శ్రేణులు కొండలా భావించే ప్రధాని మోడీ, దేశానికి పట్టిన అనకొండ అని విరుచుకుపడ్డారు. ఖమ్మం బీఆర్ఎస్ సభకు జనసందేహాం తరలివచ్చిందని తెలిపారు. సీఎం కేసీఆర్‌కు జనం మద్దతు తెలుపుతున్నారని పేర్కొన్నారు. ఇక బీజేపీ పని అయిపోయిందని వివరించారు. బీజేపీ అట్టర్ ప్లాప్ అని, ఆ పార్టీ విశ్వాసం కోల్పోతుందని చెప్పారు. దేశంలో నిత్యావసర సరుకుల ధరలు పెరిగాయని తె...

January 18, 2023 / 06:16 PM IST

ప్రధాని మోడీకి ప్రజల మీద ధ్యాస లేదు : కేజ్రీవాల్

ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్ సభలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని మోడీ మీద విరుచుకుపడ్డారు. మోడీకి దేశ అభివృద్ధి గురించి ధ్యాస లేదన్నారు. ప్రతిపక్ష పార్టీల ముఖ్యమంత్రులపైకి ఈడీ, సీబీఐ దాడులు చేసేందుకు కుట్రలు చేస్తారు. ఎమ్మెల్యేలను కొనడం, విపక్ష పార్టీల ప్రభుత్వాలను పడగొట్టాలనే ఆలోచిస్తుంటారని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మండిపడ్డారు. బీజేపీ దేశాన్ని భ్రష్టు పట్టించేందుకు వచ్చిందని విమర్శించ...

January 18, 2023 / 05:19 PM IST

ఏపీలో చిచ్చు రేపిన కేటీఆర్ దావోస్ టూర్

తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ దావోస్ పర్యటన ఆంధ్రప్రదేశ్ లో చిచ్చు రేపింది. దావోస్ లో ప్రపంచ ఆర్థిక ఫోరమ్ వార్షిక సదస్సు జనవరి 16 నుంచి 20వ తేదీ వరకు జరుగుతుంది. దీనికి మంత్రి కేటీఆర్ తన టీమ్ తో హాజరయ్యాడు. అక్కడ తెలంగాణ పెవిలియన్ ఏర్పాటుచేశారు. ప్రభుత్వ విధానాలు వివరిస్తూ తమ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని వివిధ కంపెనీలు, పారిశ్రామికవేత్తలను కోరుతున్నారు. ఈ కేటీఆర్ పర్యటనకు అనూహ్య స్పందన వస్...

January 18, 2023 / 06:15 PM IST

బీజేపీకి కంటిరోగం వచ్చింది.. ఒకటే రంగు కనిపిస్తోంది

పుష్పగుచ్ఛంలో అన్నిరకాల పూలు ఉంటేనే బాగుంటుందని, కానీ బీజేపీకి ఒకే రంగు పూవు ఉండాలని ఇది సరికాదని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఎద్దేవా చేశారు. ఖమ్మం బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో ఆయన మాట్లాడారు. ఖమ్మం సభ దేశ రాజకీయాల్లో తొలి మార్పుకు సంకేతమన్నారు. మనం దేశం అందమైన పూలమాల వంటిదని, అందులో అన్ని రకాల పూవులు ఉంటాయని, కానీ బీజేపీకి ఒకే రంగు పూలు కనిపిస్తాయని ఎద్దేవా చేశారు. బీజేపీ కొన్నిచోట్ల దొడ్డిదారిన ...

January 18, 2023 / 05:20 PM IST

కాలేజ్ నుంచి బండి సంజయ్ కుమారుడు సస్పెండ్

తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం బీజేపీ నేత బండి సంజయ్ కుమారుడు భగీరథ్ హాట్ టాపిక్ గా మారారు. భగీరథ్ కాలేజీలో తోటి విద్యార్థిని కొడుతూ.. బెదిరిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అది కాస్తా పోలీసులకు చేరింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు భగీరథ్ ని అదుపులోకి తీసుకున్నారు. విషయం తెలిసిన పలు రాజకీయ పార్టీల నేతలు బండి సంజయ్ ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు. ఆర్జీవీ సైతం భగీరథ్ ని నియం...

January 18, 2023 / 04:54 PM IST

మన టాస్క్ అదొక్కటే.. బీజేపీపై ఊగిపోయిన డీ రాజా

గణతంత్ర భారతం ఇప్పుడు ప్రమాదంలో ఉందని, అందుకే బీజేపీని ఓడించడమే మన ముందున్న టాస్క్ అని కమ్యూనిస్ట్ నేత డీ రాజా పిలుపునిచ్చారు. ఖమ్మం బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో ఆయన మాట్లాడారు. బీజేపీ, ఆరెస్సెస్ ప్రజాస్వామ్యానికి ప్రమాదకరన్నారు. భారత్ లౌకికవాద దేశమని కానీ బీజేపీ హిందూ దేశంగా మార్చే ప్రయత్నం చేస్తోందన్నారు. ప్రజలకు విద్య, ఉద్యోగం కనీస అవసరాలు అన్నారు. కానీ బీజేపీ వీటిని పక్కన పెట్టి మతాన్ని బీజేపీ ఉప...

January 18, 2023 / 06:13 PM IST