• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

గంగమ్మవాగు బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాలని వినతి

కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల శివారులో గల గంగమ్మవాగు బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాలని కోరుతూ బీఆర్ఎస్ నాయకులు ఆర్అండ్‌బీ టీ కార్యాలయంలో డిఎఓ సంతోషికి వినతి పత్రం అందజేశారు గత కొన్ని నెలలుగా నిర్మాణ పనులు జాప్యం కారణంగా ప్రయాణికులకు వాహనాల దారులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు పేర్కొన్నారు.మాజీ జెడ్పీటిసి రాజేశ్వరరావు, శ్రీనివాస్, సతీష్ఉన్నారు

March 4, 2025 / 10:54 AM IST

మిర్చిబోర్డు ఏర్పాటు చేయాల్సిందే

KMM: రాష్ట్రంలోనే అత్యధికంగా మిర్చి క్రయవిక్రయాలు జరిగే ఖమ్మంలో మిర్చిబోర్డు ఏర్పాటు చేసి క్వింటాకు రూ. 25 వేల చొప్పున ధర చెల్లించాలని ఎమ్మెల్సీ తాతా మధు, రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బాగం హేమంతరావు డిమాండ్ చేశారు. ఖమ్మం కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించి మాట్లాడారు. వ్యాపారులు ధరలు తగ్గిస్తుండడంతో మరింత నష్టం ఎదురవుతోందని చెప్పారు.

March 4, 2025 / 10:49 AM IST

అంగన్వాడీ టీచర్ల అరెస్ట్

HYD: మేడిపల్లిలో అంగన్వాడీ టీచర్లను అక్రమంగా అరెస్ట్ చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. తెల్లవారుజామున 4 గంటలకు ఇళ్ల వద్దకు చేరుకున్న పోలీసులు ఎటువంటి నోటీసు లేకుండానే పారిజాన్, సులోచన, ఉమ, సుశీలను PSకు తరలించారు. ధర్నా ఉంటుందని ముందస్తు అరెస్టులు చేయడాన్ని అంగన్వాడీలు తీవ్రంగా ఖండిస్తున్నారు.

March 4, 2025 / 10:14 AM IST

మార్చి 5 నుంచి ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు

SRPT: జిల్లా వ్యాప్తంగా ఈ నెల 5 నుంచి ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ తేజస్ తెలిపారు. జిల్లాలో మొత్తం 32 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రతి రోజు ఉదయం 9.00 గంటల నుండి మధ్యాహ్నం 12.00 గంటల వరకు జరుగుతాయని తెలిపారు. పరీక్షా కేంద్రాలకు సెల్ ఫోన్‌లు అనుమతిలేదన్నారు.

March 3, 2025 / 08:01 PM IST

లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు

SRPT: లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే చర్యలు తప్పవని డీఎంహెచ్‌వో కోటాచలం అన్నారు. PCNDT స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కోటాచలం ఆధ్వర్యంలో జిల్లాలో 46 స్కానింగ్ సెంటర్లలో తనిఖీలు నిర్వహించనట్లు తెలిపారు. ఎవరైనా చట్ట విరుద్ధంగా లింగ నిర్ధారణ పరీక్షలు, అబార్షన్‌‌లు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

March 3, 2025 / 07:54 PM IST

వారం రోజుల్లో పెళ్లి.. అంతలోనే మృతి

SRD: వారం రోజుల్లో పెళ్లి చేసుకోవాల్సిన యువకుడు మంజీరా నదిలో దూకి సోమవారం ఆత్మహత్య చేసుకున్నాడు. నాగల్‌గిద్ద మండలం కరస్ గుత్తి గ్రామానికి చెందిన సునీల్ చౌహన్(22) గత నెల 28న హైదరాబాద్ నుంచి పల్సర్ బండిపై ఇంటికి బయలుదేరాడు. ఎంతకూ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఫోన్‌లో సంప్రదిస్తే అందుబాటులోకి రాలేదు. యువకుడు మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

March 3, 2025 / 07:49 PM IST

ఎమ్మెల్సీ టీచర్ అభ్యర్థిలో మల్కా కొమురయ్య ముందంజలో ఉన్నారు

KNR: టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీ ఆదిక్యంతో గెలుపు దిశగా మల్క కొమరయ్య ముందజలో ఉన్నారు. మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే గెలిచే అవకాశం ఉంది. బీజేపీ, తపస్ బలపరిచిన అభ్యర్థి శ్రీ మల్కా కొమురయ్య మొదటి 14 టేబుల్‌లో 14,000 ఓట్లు కౌంటింగ్ జరిగితే దాదాపు 7600 ఓట్లు మల్క కొమరయ్య మొదటి ప్రాధాన్యత ఓట్లు పోల్ కావడం జరిగిందన్నారు.

March 3, 2025 / 07:27 PM IST

జెన్కోలో 800 MW కొత్త విద్యుత్ ప్రాజెక్టు

KNR: జెన్కో ఆధ్వర్యంలో 800 మెగావాట్ల సామర్థ్యంతో కొత్త విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటు దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోందని తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ (1104) రాష్ట్ర అధ్యక్షుడు వేమునూరి వెంకటేశ్వర్లు తెలిపారు. కార్మిక సంఘాల జేఏసీ పోరాట ఫలితంగా ఈ ప్రాజెక్టు దక్కిందన్నారు. రామగుండం థర్మల్ స్టేషన్ నూతన కార్యవర్గాన్ని సోమవారం ప్రకటించారు.

March 3, 2025 / 07:07 PM IST

‘రీ- ఎలక్షన్ జరపాలి’

KNR: కరీంనగర్ అంబేడ్కర్ ఇండోర్ స్టేడియంలో MLC ఎన్నికల కౌంటింగ్ కేంద్రం వద్ద ఇండిపెండెంట్ MLC అభ్యర్థులు నిరసన తెలిపారు. చెల్లని ఓట్లు ఎక్కువగా ఉన్నాయని, మళ్లీ రీ-ఎలక్షన్ జరపాలని నినాదాలు చేశారు. ఎన్నికల కమిషన్ అవగాహన కల్పించకపోవడంతో ఈ తప్పిదం జరిగిందని ఆరోపిస్తూ నిరసన తెలిపారు. ఎన్నికల సంఘం స్పందించి రీ- ఎలక్షన్ నిర్వహించాలని డిమాండ్ చేశారు.

March 3, 2025 / 06:15 PM IST

కేంద్ర మంత్రిని కలిసిన BJP నాయకులు

JGL : మల్యాల్ మండల బీజేపీ నాయకులు ఈ రోజూ బండి సంజయ్‌ని కలుసుకొని మండలంలో జరుగుతున్నకేంద్ర నిధులతో అభివృద్ధి పనుల ప్రారంభవోత్సవానికి ఆహ్వానించారు. మండలంలో కొత్తగా  సీసీ రోడ్స్, డ్రైనేజీ, హైమాస్ లైట్స్ కావాల్సిందిగా కోరారు. మంత్రి సానుకూలంగా స్పందించారని అధ్యక్షులు గాజులమల్లేశం తెలిపారు. బొబిల్లి వెంకటస్వామి, రవి, సాయి, సురేష్, నక్క ఆనందం ఉన్నారు.

March 3, 2025 / 06:00 PM IST

ఇంటర్ వార్షిక పరీక్షలకు సర్వం సిద్ధం

NZB: ఈనెల 5 నుండి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఇంటర్ వార్షిక పరీక్షలకు 36,222 మంది విద్యార్థులు హాజరు కానున్నారని, వీరి కోసం మొత్తం 57 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని జిల్లా ఇంటర్ విద్య అధికారి తిరుమల పూడి రవికుమార్ మీడియాకు తెలిపారు. 3 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు, 8 మంది సిట్టింగ్ స్క్వాడ్‌లు, 1 హైపవర్ కమిటీ ఉన్నారు.

March 3, 2025 / 04:53 PM IST

మరిపెడ ప్రెస్ క్లబ్ కమిటీ ఎన్నిక

MHBD: మరిపెడ ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఎన్నిక ఈరోజు ఏకగ్రీవంగా జరిగింది. సోమవారం ప్రెస్ క్లబ్ సభ్యులు సమావేశమై కమిటీని ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులుగా నాగేందర్, అధ్యక్షులుగా శ్రీకుమార్, ప్రధాన కార్యదర్శి మహేందర్ ఎన్నికయ్యారు. అలాగే కోశాధికారి శ్రీనివాస్ రాజు, ఉపాధ్యక్షులుగా తప్పెట్ల సురేష్, బానోత్ ప్రవీణ్, నాగరాజు, మరికొంతమంది సభ్యులుగా ఎన్నికయ్యారు.

March 3, 2025 / 04:38 PM IST

విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించాలి: డీఈవో

NRML: జిల్లాలోని అన్ని ప్రభుత్వ సంక్షేమ పాఠశాలలో 8 ,9 తరగతుల బాలికలకు బేటి బచావో బేటి పడావో కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖన పోటీలను నిర్వహించాలని డీఈవో రామారావు తెలిపారు. ఈ నెల 4న పాఠశాల స్థాయిలో, 5న మండల స్థాయిలో, 6న జిల్లా స్థాయిలో పోటీలు నిర్వహించాలని సూచించారు. గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందించడం జరుగుతుందన్నారు.

March 3, 2025 / 04:31 PM IST

పెంచికల్పేట్‌లో మహిళ హత్య

ASF: మహిళ దారుణ హత్యకు గురైన ఘటన పెంచికల్పేట్ మండలంలోని లోడ్పల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గుర్ల లలితను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారని ఆమె భర్త గణేశ్ తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

March 3, 2025 / 04:21 PM IST

డీజేలు పెట్టెవారికి ఏసీపీ హెచ్చరిక

WGL: వరంగల్ ACP నందిరం నాయక్ కీలక సూచనలు చేశారు. వివాహ, ఇతర వేడుకల్లో డీజే సౌండ్స్ పెట్టే వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. DJలు సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఇంటర్మీడియట్, SSC, ఇతర పోటి పరీక్షలు ఉన్నందున వివాహ ఊరేగింపు, ఇతర వేడుకల్లో DJ సౌండ్స్ పెట్టి విద్యార్థులు, వృద్ధులు, చిన్నపిల్లలు, ప్రజలకి ఇబ్బంది కలిగించవద్దని తమకు సహకరించాలన్నారు.

March 3, 2025 / 04:17 PM IST