• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

గవర్నర్ కు సీఎం కేసీఆర్ క్షమాపణ చెప్పాలి: రేవంత్

గణతంత్ర వేడుకల వేదికను రాజకీయం చేయవద్దని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అన్నారు. ఆయన గాంధీ భవన్ లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడారు. గవర్నర్ తమిలసాయి, ముఖ్యమంత్రి కేసిఆర్ మధ్య విభేదాలు ఉంటే మరో వేదిక చూసుకోవాలని సూచించారు. గణతంత్ర దినోత్సవం రాద్ధాంతం సరికాదని, ప్రభుత్వం వెంటనే గవర్నర్ కు క్షమాపణ చెప్పాలని డిమాండ్...

January 26, 2023 / 02:11 PM IST

‘పద్మశ్రీ’పై కీరవాణి ట్వీట్

ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి వరుసగా అవార్డులు అందుకుంటూ చరిత్రను తిరగరాస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డును అందుకుని తెలుగు పాట ఖ్యాతిని పెంచారు. ఇప్పుడు ఆస్కార్ నామినేషన్ల లిస్టులో నాటు నాటు పాట చేరడంతో మరో ఘనత సాధించారు. తాజాగా నేడు ఆయన పద్మశ్రీ  పురస్కారాన్ని అందుకున్నారు. Much honoured by the civilian award from the Govt of India 🙏 Respect for my...

January 26, 2023 / 01:33 PM IST

తెలుగు వారికి పద్మ అవార్డులు, కేంద్రంపై బాబు ప్రశంస

తెలుగువారికి పద్మ అవార్డుల పైన టిడిపి జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. పద్మ అవార్డులు సాధించిన వారికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తెలుగువారి కృషిని కేంద్ర ప్రభుత్వం గుర్తించడం ఆనందంగా ఉందని వ్యాఖ్యానించారు. పద్మ అవార్డులు సాధించిన తెలుగు వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని, ఎందరో తెలుగువారి అద్భుతమైన కృషిని గుర్తించడం తనకు చాలా సంతోషాన్ని కల...

January 26, 2023 / 11:14 AM IST

రాజ్‌భవన్‌లో ఘనంగా గణతంత్ర వేడుకలు

హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎస్ శాంతి కుమారి హాజరయ్యారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ప్రజలకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యాంగ రచనలో అంబేద్కర్ ఎంతో అంకితభావం కనబరిచారని అన్నారు. ఆ రాజ్యాంగం ప్రకారంగానే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిందని తెలిపారు. శతాబ్దాల చరిత్ర ఉన్న హైద...

January 26, 2023 / 02:05 PM IST

బాలకృష్ణ వ్యాఖ్యలపై ఎస్వీఅర్ మనవళ్ళు ఏమన్నారంటే

సినీ నటుడు నందమూరి బాలకృష్ణ తన వీరసింహారెడ్డి సక్సెస్ మీట్ సందర్భంగా మాట్లాడిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. ఎస్వీఆర్, ఏఎన్ఆర్ లపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. బాలయ్య వ్యాఖ్యలపై అక్కినేని మనవాళ్ళు తీవ్రంగా స్పందించారు. తాజాగా, ఎస్వీఆర్ మనవాళ్ళు కూడా స్పందించారు. అయితే వీరు బాలకృష్ణ యథాలాపంగా చేసిన వ్యాఖ్యలు, రాద్ధాంతం అవసరం లేదు అన్నారు. బాలకృష్ణ చేసిన వి...

January 26, 2023 / 08:15 AM IST

బాసరలో వసంత పంచమి వేడుకలు.. పోటెత్తిన భక్తులు

నేడు వసంత పంచమి సందర్భంగా బాసర సరస్వతీ అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. చదువుల తల్లి సరస్వతి దేవిని స్తుతించే పవిత్రదినం కావడంతో బాసరలో ఘనంగా వేడుకలు నిర్వహిస్తున్నారు. ఆలయ అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. వసంత పంచమి కావడంతో భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్దసంఖ్యలో వచ్చారు. తెల్లవారుజాము నుంచే పిల్లలకు అక్షరాభ్యాస కార్యక్రమాలను ప్రారంభించారు. భక్తులు అమ్మవారిక...

January 26, 2023 / 01:40 PM IST

పోలవరం ప్రాజెక్టుపై కీలక ప్రకటన

పోలవరం ప్రాజెక్టు వల్ల ఎలాంటి ముప్పు కనిపించడం లేదని కేంద్ర జలవనరుల సంఘం స్పష్టం చేసింది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన అధ్యయనం పూర్తి అయినట్లు వెల్లడించింది. మరోసారి అధ్యయనం అవసరం లేదని తెలిపింది. పోలవరం ప్రాజెక్టుతో తమ రాష్ట్రాలకు ముప్పు పొంచివుందని కొన్ని రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. అంతేకాదు సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. దీంతో ఆయా రాష్ట్రాలతో మాట్లాడి అభ్యంతరాలు తెలుసుకొని, అనుమానాలు ని...

January 26, 2023 / 07:24 AM IST

ఆ రోజే మనకు నిజమైన పండుగ: సీఎం కేసీఆర్

ప్రజలకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ 74వ గణతంత్ర దినోత్సవ (Republic Day) శుభాకాంక్షలు తెలిపారు. సమానత్వంతో కూడిన సమర్ధవంతమైన ప్రజాస్వామిక పాలన ద్వారానే దేశ రాజ్యాంగం ఆశించిన లక్ష్యం పరిపూర్ణంగా సిద్ధిస్తుందని పేర్కొన్నారు. ప్రతి పౌరుడు రాజ్యాంగాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలని సూచించారు. రాజ్యాంగం గొప్పదనం, ప్రాధాన్యం వివరిస్తూనే ప్రజలు ఎలా అర్థం చేసుకోవాలో తెలిపారు. సమాఖ్య స్ఫూర్తి పరిఢవిల్లితేన...

January 25, 2023 / 09:14 PM IST

రాజ్ భవన్‌లోనే రిపబ్లిక్ డే పరేడ్.. ఉ.6.50 గంటలకు ప్రారంభం

రిపబ్లిక్ డే వేడుకలు, పరేడ్‌పై తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు మొట్టికాయలు వేసింది. దీంతో ప్రభుత్వం పరేడ్‌కు సంబంధించి నిర్ణయం తీసుకుంది. గురువారం రాజ్ భవన్‌లోనే పరేడ్ నిర్వహిస్తామని తెలియజేసింది. ఉదయం 6.50 గంటలకు రాజ్ భవన్‌లో పరేడ్ జరుగుతుంది. ఆ తర్వాత ఏడు గంటలకు గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. వేడుకకు అధికారులు, ప్రజా ప్రతినిధులు హాజరవుతారు. తెలంగాణ రాష్ట్రంలో రిపబ్ల...

January 26, 2023 / 05:35 PM IST

భారీ ఎత్తున తెలంగాణలో ఐపీఎస్ ల బదిలీలు

తెలంగాణలో భారీ ఎత్తున ఐపీఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. ఏకంగా 60 మంది ఐపీఎస్ లను బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. పోలీస్ శాఖను ప్రక్షాళన చేసినట్టు బదిలీలు ఉన్నాయి. ఒకే చోట అత్యధిక కాలం ఉన్న అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. పలు జిల్లాల ఎస్పీలు, కమిషనర్లు బదిలీ అయిన జాబితాలో ఉన్నారు. ఈ బదిలీల విషయమై రెండు రోజులుగా సీఎం కేసీఆర్ డీజీపీ, ఇతర ఉన్...

January 25, 2023 / 08:52 PM IST

అజ్మీర్ దర్గాకు చాదర్ పంపిన సీఎం కేసీఆర్

అజ్మీర్ దర్గా ఉర్సు సందర్భంగా సీఎం కేసీఆర్ చాదర్ సమర్పించారు. ప్రతీ ఏటా రాష్ట్ర ప్రభుత్వం తరఫున చాదర్ పంపిస్తుంటారు. ప్రగతి భవన్‌లో బుధవారం మత పెద్దల ఆధ్వర్యంలో ప్రార్థనలు చేశారు. ప్రజలు, ప్రభుత్వం బాగుండాలని, సీఎం కేసీఆర్‌ను చల్లగా చూడాలని మత పెద్దలు ప్రార్థించారు. రాష్ట్రం ప్రగతి పథంలో సాగాలని, దేశ ప్రజలంతా కలిసి మెలసి జీవించేలా దీవించాలని అల్లాను కోరారు. ఆ తర్వాత చాదర్‌ను వక్ఫ్ బోర్డు అధికార...

January 25, 2023 / 06:35 PM IST

రిపబ్లిక్ డే జరపాల్సిందే.. పరేడ్ కంపల్సరీ: తెలంగాణ హైకోర్టు

రాష్ట్రంలో గణతంత్ర దినోత్సవ వేడుకలకు నిర్వహించాల్సిందేనని హైకోర్టు స్పష్టంచేసింది. యావత్ దేశం రిపబ్లిక్ డే సెలబ్రేట్ చేసుకుంటుందని గుర్తుచేసింది. పరేడ్ తప్పనిసరిగా నిర్వహించాలని కోరింది. ఈ వేడుకకు ప్రజలను అనుమతించాలని తెలిపింది. రాష్ట్రంలో కరోనా ప్రభావం ఉన్నందున రాజ్ భవన్‌లోనే వేడుకలు నిర్వహించాలని లేఖ రాశామని అడ్వకేట్ జనరల్ హైకోర్టు ఎదుట వాదనలు వినిపించారు. అక్కడ జరిగే వేడుకలకు ప్రభుత్వ ప్రతిన...

January 25, 2023 / 05:38 PM IST

సెలవు దొర: జగిత్యాల మున్సిపల్ చైర్మన్ శ్రావణి రాజీనామా

జగిత్యాల మున్సిపల్ చైర్మన్ పదవీకి బోగ శ్రావణి రాజీనామా చేశారు. స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఇబ్బందికి గురిచేస్తున్నారని తెలిపారు. మీడియా సమావేశంలోనే ఆమె కన్నీరు పెట్టుకున్నారు. బలహీన వర్గానికి చెందిన మహిళను రాజకీయంగా అణచివేయాలని చూస్తున్నారని ఆరోపించారు. ‘సంజయ్ దొర.. మీకు దండాలు దొర, మీ గడీల సంకెళ్లు తొలగించుకోవడం కోసమే రాజీనామా చేస్తున్నాను. మీ గడీల నుంచి బయటకు వస్తున్నా, ఇదిగో నా రాజీనామా ప...

January 25, 2023 / 05:13 PM IST

జెండా పండుగకు కరోనా అడ్డంకినా? కేసీఆర్ పై గవర్నర్ ఆగ్రహం

గణతంత్ర వేడుకలను రాజ్ భవన్ లోనే నిర్వహించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయడంపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో కాకుండా వేడుకలను రాజ్ భవన్ కే పరిమితం చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంపై మండిపడ్డారు. ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయనున్నట్లు రాజ్ భవన్ వర్గాలు వెల్లడించాయి. గవర్నర్ స్థానానికి రాష్ట్ర ప్రభుత్వం గౌరవించడం లేదని...

January 25, 2023 / 03:16 PM IST

ఆస్కార్‌కు నాటు నాటు సాంగ్‌.. రాహుల్‌ సిప్లిగంజ్‌ని సన్మానించిన బండి సంజయ్‌

నాటు నాటు సాంగ్‌ ఆస్కార్ నామినేషన్ నిలవడంతో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ సింగర్‌ రాహుల్‌ ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రాహుల్‌ సిప్లిగంజ్‌కు స్వీట్స్‌ తినిపించి పుష్పగుచ్ఛం అందజేశి శాలువాతో సత్కరించారు. దర్శక ధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి తెరకెక్కించిన ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం అవార్డులు కొల్లగొడుతోంది. తాజాగా ఆ సినిమాలోని నాటు నాటు సాంగ్‌ ఆస్కార్‌ ఫైనల్స్‌కు నామినేట్‌ అయ్యింది. ఈక్రమంలో ప్రత...

January 25, 2023 / 02:25 PM IST