VKB: పరిగి మండలంలోని బాలాజీ మెడికల్లో సిబ్బంది అత్యుత్సాహం ప్రదర్శించారు. సయ్యద్పల్లికి చెందిన నవీన్ తన ఏడేళ్ల కుమారుడు నియాన్కు వాంతులు అవుతుండటంతో చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్లారు. అత్యవసరంగా వైద్యుడిని కలవాలని కోరగా, సిబ్బంది దురుసుగా ప్రవర్తించి బయటకు నెట్టారు. అంతటితో ఆగక, తమ స్నేహితులను పిలిచి బాధితుడిపై భౌతిక దాడికి పాల్పడ్డారు.
KMM: నేలకొండపల్లి మండలం చెరువు మాదారం గ్రామంలో చోటుచేసుకుంది. వరి కోత మిషన్తో పనుల కోసం వచ్చిన ఓ డ్రైవర్, స్థానిక పెట్రోల్ బంక్ వద్ద ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. గమనించిన స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
WNP: అక్షర పాఠశాలలో విద్యార్థినిపై జరిగిన లైంగిక దాడి ఘటనపై శుక్రవారం మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత సమాజంలో నేరప్రవృత్తి పశువుల కంటే హీనంగా పెచ్చరిల్లుతోందని, ఈ ఘటన మొత్తం సమాజానికే తలవంపు తెచ్చే చర్య అని ఆయన పేర్కొన్నారు. BRS నాయకులపై అక్రమ కేసులను భేషరతుగా ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ADB: నార్నూర్ మండలంలోని కొత్తపల్లి హెచ్ గ్రామ పంచాయతీ పరిధి దమ్మగూడలో శుక్రవారం ఐకేపీ ఆధ్వర్యంలో (SHG) సంఘాలపై సోషల్ ఆడిట్ నిర్వహించారు. మహిళా సంఘాల పనితీరు, పేదలకు అందుతున్న సేవలపై గ్రామసభలో చర్చించారు. నిరుపేద కుటుంబాలకు తక్షణమే రుణ సౌకర్యం కల్పించాలని సర్పంచ్ చౌహాన్ డిగాంబర్ ఐకేపీ ఏపీఓను కోరారు.
NLG: చింతపల్లి మండలం మోద్గుల మల్లేపల్లిలో శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని క్రికెట్ టోర్నమెంట్ పోటీలను నిర్వహించారు. ఈ పోటీలను ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ బ్యాట్ పట్టి శుక్రవారం ప్రారంభించారు. గ్రామీణ స్థాయిలో క్రీడలను ప్రోత్సహించడం ఎంతో అవసరమని, క్రీడలు యువతలో క్రమశిక్షణ, ఐక్యత, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ మల్లేష్ ఉన్నారు.
BHPL: రేగొండ(M)రూపిరెడ్డిపల్లి గ్రామంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ముఖ్యఅతిథిగా BJP నియోజకవర్గ ఇన్ఛార్జ్ చందుపట్ల కీర్తి రెడ్డి, జిల్లా అధ్యక్షులు ఏడునూతుల నిషిధర్ రెడ్డి హాజరై, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కీర్తి రెడ్డి మాట్లాడుతూ.. శ్రీరాముడు సత్యం, ధర్మం, న్యాయం వంటి విలువలకు నిదర్శనమని అన్నారు. BJP నేతలు ఉన్నారు.
KMR: బిక్కనూరు మండలం గురుజకుంటలో రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఇంద్రకరణ్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించారు. పేద కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఆయన అన్నారు. అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందని గుర్తు చేశారు. ప్రజలు వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
MLG: మంగపేట మండలం రమణక్కపేట నూతన పంచాయతీ కార్యదర్శిగా జి.రంజిత్ కుమార్ నియామకం అయ్యారు. ప్రస్తుతం ఉన్న కార్యదర్శి కోరం రాజు తాడ్వాయి మండలం బంధాల పంచాయతీకి బదిలీ అయ్యారు. ప్రస్తుతం రంజిత్ కుమార్ కన్నాయిగూడెం మండలం గుర్రేవుల పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు. ఈయన రేపు బాధ్యతలు తీసుకోనున్నట్లు సమాచారం.
WGL: లోక్సభలో జన్ విశ్వాస్ (సవరణ) బిల్లును వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య వ్యతిరేకించారు. ఈ బిల్లులో కీలక నిబంధనలను డీక్రిమినలైజ్ చేయడం వల్ల నియంత్రణ వ్యవస్థ బలహీనపడే ప్రమాదం ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజా ఆరోగ్యం, పర్యావరణం, కార్మిక హక్కులపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని హెచ్చరిస్తూ, బిల్లుపై విస్తృత చర్చ జరిపించాలన్నారు.
MBNR: శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా ఇవాళ జడ్చర్ల పట్టణంలో వివిధ ఆలయాల్లో నిర్వహించిన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాల్లో మాజీ మంత్రి డా.సి.లక్ష్మారెడ్డి గారు పాల్గొన్నారు. శ్రీ సీతారాముల వారిని దర్శించుకొని అందరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీరాముడి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో అష్ట ఐశ్వర్యాలతో వెలుగొందాలని ఆకాంక్షించారు.
SRD: జిన్నారం మున్సిపాలిటీ జంగంపేట గ్రామంలో శ్రీరామ నవమి సందర్భంగా ఇవాళ తొలిసారి సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహించారు. వేదమంత్రాల మధ్య అర్చకులు కళ్యాణ క్రతువు జరిపారు. అనంతరం అన్నప్రసాదం పంపిణీ చేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్ ఆశాదేవి, స్థానిక నాయకులు, గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు.
NGKL: జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నాగర్కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి రైతులకు సాగు పరికరాలను పంపిణీ చేశారు. మండలంలోని పలువురు రైతులకు సబ్సిడీపై స్ప్రింక్లర్లు, పైపులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన రైతులతో ముచ్చటిస్తూ, తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి సాధించేందుకు ఆధునిక సాగు పద్ధతులు పాటించాలని సూచించారు.
SRD: కంగ్టి మండల ప్రజలు మార్చి 28న నిర్వహించే లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని SI దుర్గారెడ్డి సూచించారు. ఖేడ్ కోర్టులో లోక్ అదాలత్ నిర్వహిస్తున్నారని తెలిపారు. యాక్సిడెంట్, గొడవలు, చీటింగ్, భూతగాదాలు, చిన్న చిన్న దొంగతనాలు, అక్రమ రవాణా కేసుల్లో కక్షిదారులు రాజీ చేసుకునేందుకు మంచి అవకాశం ఉందన్నారు.
SRD: పటాన్చెరు మండలం చిట్కుల్ జీటీఎన్ కాలనీలో శ్రీరామనవమి వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. స్థానిక కాంగ్రెస్ నేత నీలం మధు ముదిరాజ్ ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల కళ్యాణం, ఆలయ ప్రతిష్ట, మహా కుంభాభిషేకం అత్యంత వైభవంగా నిర్వహించారు. స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలతో కళ్యాణాన్ని ఘనంగా జరిపారు. భక్తుల కోలాటాలు, సంగీత విభావరి కార్యక్రమాలతో సందడి నెలకొంది.
ASF: కాగజ్ నగర్ మండలంలోని కొత్తపేట ప్రాథమిక వ్యవసాయ సంఘం ఆధ్వర్యంలో SMAM పథకం కింద 40% సబ్సిడీపై డ్రోన్ స్ప్రే యంత్రాలను శుక్రవారం రైతులకు పంపిణీ చేశారు. MLC దండే విఠల్ ఈ కార్యక్రమంలో పాల్గొని యంత్రాలను అందజేశారు. నియోజకవర్గ పరిధిలోని అన్ని PACS లకు ఈ యంత్రాలు లభించాయి. ఆధునిక వ్యవసాయ పరికరాల ద్వారా దిగుబడులు పెంచుకోవాలని MLC రైతులను కోరారు.