KMR: బీర్కూర్ మండలం తిమ్మాపూర్ తెలంగాణ తిరుమల దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలను మార్చి 4 నుంచి 9 వరకు నిర్వహించనున్నారు. చిన్న జీయర్ స్వామి, దేవనాథ జీయర్ స్వామి ప్రత్యేక పర్యవేక్షణలో ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు సోమవారం తెలిపారు. 4న అంకురార్పన, 5న ధ్వజారోహణం, శేషవాహన సేవ ఉంటుంది.
WGL: వరంగల్ కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ సత్య శారద ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ప్రజలు ఇచ్చిన వినతులు పరిశీలించి అధికారులు వారి సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్డీ విజయలక్ష్మి, డీఆర్డీవో కౌసల్య దేవి, జడ్పీ సీఈవో రామ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
KMM: పాలేరు నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడమే మంత్రి పొంగులేటి జిల్లా కాంగ్రెస్ నాయకులు తుంబూరు దయాకర్ రెడ్డి అన్నారు. సోమవారం తిరుమలయపాలెం మండల కేంద్రంలో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన స్థానిక ప్రజల యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తదనంతరం స్థానిక నేతలతో కలిసి పలు ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
KMM: ప్రజావాణిలో వచ్చిన అర్జీలను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఆయా శాఖలకు వచ్చిన అర్జీలను మరొకమారు పరిశీలన చేసి, పెండింగ్లో లేకుండా పరిష్కరించాలన్నారు.
SRD: జిన్నారం మండలంలో దేవాలయాల అభివృద్ధికి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, సీజీఆర్ ట్రస్ట్ ఛైర్మన్ చిమ్ముల గోవర్ధన్ రెడ్డి విరాళం అందజేశారు. కాజిపల్లి గ్రామంలోని శ్రీశ్రీశ్రీ కాశీ విశాలాక్షి విశ్వనాథ గణపతి నూతన దేవాలయానికి ₹1,01,116, అలాగే సోలక్పల్లి గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి ₹40,000 విరాళంగా అందించారు.
SRD: విద్యార్థులకు ఉపాధ్యాయులు ప్రయోగాత్మకంగా బోధించాలని సమగ్ర శిక్ష AMO అనురాధ అన్నారు. సంగారెడ్డి లోని బీసీ స్టడీ సర్కిల్లో ఎస్జీటీ నూతన ఉపాధ్యాయులకు సోమవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. మూడు రోజులపాటు ఇచ్చిన శిక్షణను సద్వినిగం చేసుకోవాలని చెప్పారు. సమావేశంలో జిల్లా సైన్స్, అధికారి సిద్ధారెడ్డి పాల్గొన్నారు.
ASF: సిర్పూర్ టీ మండల కేంద్రంలో సోమవారం ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం సందర్భంగా అట్టహాసంగా కార్యక్రమాలు నిర్వహించారు. సిర్పూర్ రేంజ్ అధికారి(FRO) ఇక్బాల్ హుస్సేన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు, అటవీశాఖ అధికారులు భాగస్వామ్యంతో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ సందర్భంగా వన్యప్రాణుల సంరక్షణ, పర్యావరణ రక్షణపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.
ADB: ఖానాపూర్ పట్టణంలోని రాజీవ్ నగర్ కాలానికి చెందిన గంధం సుమన్ గారి భార్య రజిత వైద్య ఖర్చుల నిమిత్తం టెన్త్ క్లాసు మిత్రులు రూ.25 వేల ఆర్థిక సహాయం అందించారు. రజిత అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో అరుణోదయ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ ఆర్థిక సాయం అందించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు నాయిని సంతోష్, టెన్త్ స్నేహితులు పాల్గొన్నారు.
SDPT: రాష్ట్రంలో నూనెగింజల ఉత్పత్తిని పెంచడానికి తమ ప్రభుత్వ హయాంలో రైతులను చైతన్యవంతులుగా తీర్చిదిద్దామని, రాష్ట్రంలో పొద్దు తిరుగుడు పంట కోతకు వచ్చినా ఇప్పటివరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవటం విడ్డూరంగా ఉందని మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు.
NLG: జిల్లాలో సాగునీటి వనరుల నీటిమట్టం వేగంగా అడుగంటుతోంది. దీంతో వేసవిలో తాగు, సాగు నీటి కష్టాలు తప్పవా అంటూ అటు రైతులు ఇటు ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కనీస నీటిమట్టం వరకు తోడుకోవాల్సి ఉండగా.. కుడి ఎడమ కాలువలకు ఎడా పెడా తోడేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.
RR: ఫరూఖ్ నగర్ మండలంలోని లింగారెడ్డి గూడా గ్రామంలో సీ.ఆర్.ఆర్ ఎస్సీ సబ్ ప్లాన్ ద్వారా మంజూరైన 10 లక్షలు, డీఎంఎఫ్టీ నిధులు ద్వారా మంజూరైన 8 లక్షల రూపాయలతో నిర్మిస్తున్న సీసీ రోడ్లకు పనులకు ఈరోజు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ఫరూఖ్ నగర్ మండల పార్టీ అధ్యక్షుడు చల్లా శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు.
JGL: నేటి నుంచి మెట్పల్లి వ్యవసాయ మార్కెట్లో కొనుగోళ్లు తిరిగి ప్రారంభం కానున్నాయి. శివరాత్రి పర్వదినం నేపథ్యంలో వ్యాపారుల విజ్ఞప్తి మేరకు మార్కెట్కు సెలవు ప్రకటించారు. వరుసగా శని, ఆదివారాలు రావడంతో నేటి నుంచి తిరిగి కొనుగోళ్లు ప్రారంభించనున్నట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి. మార్కెట్కు వచ్చేవారు గమనించాలని మార్కెట్ కార్యదర్శి సూచించారు.
KMR: పవిత్రమైన రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని నేడు కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని షాబ్దిపూర్ తాండలోనీ మహమ్మదీయ మజీద్లో ఘనంగా ఇఫ్తార్ విందు పార్టీ ఇవ్వడం జరిగింది. పట్టణానికి చెందిన షేక్ మహిముద్ వారి తల్లిదండ్రులు అయినటువంటి కీర్తి శేషులు షేక్ మహబూబ్ అక్తరిబేగం జ్ఞాపకార్థం ఇచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో మోహిద్, వహీద్, అలిమ్, అశ్వక్ ఉన్నారు.
జనగామ: బచ్చన్నపేట మండలం తమ్మడపల్లి గ్రామంలో జరగబోయే శ్రీ బీరప్ప, కామరాతి కళ్యాణ మహోత్సవానికి కాంగ్రెస్ సీనియర్ నాయకులు జంగిటి విద్యానాథ్ తన వంతు సహాయంగా రూ. 30,000ను విరాళంగా తమ్మడపల్లి గొల్ల, కురుమ సంఘానికి అందజేశారు. మాజీ సర్పంచ్ మేకల కవిత రాజు, కోడవటూర్ మాజీ డైరెక్టర్ రాజు,పెద్ద కురుమ మేకల మల్లేశం, గొరిగే బాలరాజు, మేకల మహేష్ పాల్గొన్నారు.
KMR: ఎల్లారెడ్డి పట్టణ కేంద్రానికి చెందిన విద్యా రవి ఎల్లారెడ్డి పట్టణ పద్మశాలి సంఘానికి నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన శుభ సందర్భంగా మార్కెట్ కమిటీ ఛైర్మన్ రజిత వెంకట్రాం రెడ్డి, మాజీ మున్సిపల్ ఛైర్మన్ కుడుముల సత్యనారాయణ ఆదివారం అభినందించి సన్మానించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.