MHBD: తొర్రూరు మండలం జీకే తండాకు చెందిన గుగులోతు కోట అనే రైతు ఇవాళ తన వ్యవసాయ పొలం వద్ద స్టాటర్ లో ఫీజ్ లు సరి చేస్తుండగా, విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. గమనించిన చుట్టుపక్కల రైతులు, ప్రజలు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటన స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించారు. మృతుడికి భార్య కాంతి, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆయన మృతితో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.