KMM: కల్లూరు మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో ఆర్థికంగా వెనుకబడిన కిష్టయ్య బంజర్, పుల్లయ్య బంజర్ గ్రామాలను మున్సిపాలిటీ కాబోతున్న కల్లూరు పరిధిలో ఉంచాలని శుక్రవారం ఎమ్మెల్యే రాగమయికి ఆ గ్రామస్థులు వినతి పత్రం ఇచ్చారు. పసుపులేటి శ్రీనివాసరావు, తండు రాములు, జంగం నరసింహారావు, కిట్టం శెట్టి కొండలరావు, వీరయ్య తదితరులున్నారు.
KMR: బిచ్కుంద మండలం శాంతాపూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ చందర్ సెట్ తండ్రి ఇటీవల మృతి చెందాడు. విషయం తెలుసుకున్న జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే శుక్రవారం కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ బాధిత కుటుంబ సభ్యులకు అండగా ఉంటుందని అన్నారు. ఆయన వెంట మండల బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.
NZB: గాంధారి మండలంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం కాంగ్రెస్ నాయకులతో కలసి ఎమ్మెల్యే మదన్మోహన్రావు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి సంతాపం తెలిపారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆయన దేశానికి ప్రధానిగా, ఆర్బీఐ గవర్నర్గా, ఆర్థికమంత్రిగా దేశానికి సేవలు అందించారన్నారు.
NZB: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు నందిపేట్ మండల కాంగ్రెస్ నాయకులు నివాళులర్పించారు. ఈరోజు దేశం ఒక మహనీయుని కోల్పోయిందంటూ పార్టీ శ్రేణులు చెప్పుకొచ్చాయి. మన్మోహన్ సింగ్ ఆర్థికవేత్తగా, ఆర్థికమంత్రిగా, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా, దేశప్రధానిగా, ఎన్నో సేవలు చేశారంటూ ఈ సందర్భంగా కొనియాడారు.
NZB: దేశ ఆర్థిక సంస్కర్త మాజీ ప్రధాని కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి బాధాకరమని డీసీసీ అధ్యక్షుడు, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ ఛైర్మన్ మానాల మోహన్ రెడ్డి అన్నారు. బాల్కొండ మండలం మానాలలో మన్మోహన్ సింగ్ మృతి పట్ల ఆయన చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించారు.
NLG: మిర్యాలగూడ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం పట్ల ఆయన చిత్రపటానికి MLA బత్తుల లక్ష్మారెడ్డి, DCC అధ్యక్షులు శంకర్ నాయక్ శుక్రవారం నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. భారతదేశం గొప్ప మేధావిని కోల్పోవడం ప్రజలకు, సమాజానికి ఎంతో నష్టమని, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని అన్నారు.
MHBD: కురవి మండల కేంద్రంలోని వీరభద్రస్వామి ఆలయ హుండీల లెక్కింపు కార్యక్రమం జరిగింది. 06/08/2024-25/12/2024 వరకు వచ్చిన హుండీ ఆదాయాన్ని లెక్కించినట్లు అధికారులు తెలిపారు. వీరభద్ర స్వామి ఆదాయం రూ. 28,32577 కాగా, భద్రకాళి అమ్మవారి ఆదాయం రూ. 10,71452 మొత్తం రూ. 39 లక్షల పైగా ఆదాయం వచ్చిందని చెప్పారు. అలాగే బంగారు, వెండిని హుండీలో భద్రపరిచామన్నారు.
NZB: రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నిజామాబాద్ జిల్లా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన పోల విట్టల్ రావుని, నూతన ప్రధాన కార్యదర్శి చిదుర ప్రదీప్, నూతన కోశాధికారి నీల భాస్కర్ని, గౌరవ అధ్యక్షుడు బచ్చు అంజయ్యను రాష్ట్ర అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ గుప్తా అభినందించి సన్మానించి నియామకా పత్రాలు అందజేశారు. మహాసభ ఉపాధ్యక్షుడు ఆగిరి వెంకటేష్, కార్యవర్గ సభ్యులు ఉన్నారు.