SRCL: అమృత్ 2.0 కింద చేపట్టిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ & అర్బన్ డెవలప్మెంట్ సెక్రటరీ శ్రీదేవి ఆదేశించారు. సోమవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సమీక్షలో, రాష్ట్రంలోని అర్బన్ లోకల్ బాడీల్లో అమృత్ 2.0 పనుల పురోగతిపై చర్చించారు. జిల్లాలో రూ.100 కోట్లతో నీటి ట్యాంకులు, పైప్ లైన్ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు.
BDK: భద్రాచలం ఐటీడీఏ రోడ్లో రాత్రి 12 గంటల సమయంలో టైర్ల దుకాణం ముందు మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు ఫైర్ స్టేషన్కు సమాచారం ఇవ్వగా ఫైర్ స్టేషన్ సిబ్బందితోపాటు పెట్రోలింగ్ నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేశారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్సుకున్నారు.
మంచిర్యాల జిల్లాలో 3వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. చెన్నూర్ నియోజకవర్గంలో రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ప్రాతినిధ్యం వహిస్తుండడంతో తుది దశ ఎన్నికలు, ఫలితాలపై అంచనాలు పెరిగాయి. ఈనెల 17న భీమారం, చెన్నూరు, జైపూర్, కోటపల్లి, మందమర్రి మండలంలో ఎన్నికలు జరగనున్నాయి. 102 సర్పంచ్, 868 వార్డ్ స్థానాలకు ఎన్నికలు ఉంటాయి.
MHBD: రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తొర్రూరు మండలం అమ్మాపురం గ్రామంలో సీపీఐ పార్టీ బలపరిచిన 1వ వార్డు సభ్యులు డోనుక యాకయ్య, 3వ వార్డు సభ్యులు కోటగిరి చైతన్య, 12వ వార్డు సభ్యులు గణపురం సునీత ఘన విజయం సాధించారు. వార్డు సభ్యులు ఘన విజయం సాధించడంతో సీపీఐ పార్టీ శ్రేణులు గ్రామంలో సంబరాలు జరుపుకున్నారు.
MBNR: మహబూబ్నగర్ నియోజకవర్గం కంకర గ్రామానికి చెందిన కళాకారుడు శంకర శ్రీనివాస్ను ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస రెడ్డి సోమవారం పరామర్శించారు. ఇటీవల శంకర శ్రీనివాస్ ప్రమాదానికి గురయ్యారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఇంటిపట్టునే ఉంటూ మెరుగైన చికిత్స తీసుకోవాలని డాక్టర్ల సూచనలు పాటించాలని ఎమ్మెల్యే, శ్రీనివాస్కు సూచించారు.
MBNR: సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు స్టార్ క్యాంపెనర్ మధు యాష్కి గౌడ్ను మహబూబ్నగర్ జిల్లా కేంద్రానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు సోమవారం కలిశారు. ఈ సందర్భంగా ఆయన జన్మదిన పురస్కరించుకొని శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. మధు యాష్కిని కలిసిన వారిలో సీనియర్ నేతలు ఆంజనేయులు గౌడ్, మురళి గౌడ్, శ్రీనివాస్, రమేష్ బాబు పాల్గొన్నారు.
హైదరాబాద్లో ‘హుష్-డేటింగ్’ అనే కొత్త సీక్రెట్ ట్రెండ్ జోరుగా ఉంది. తల్లిదండ్రుల నిఘా, ఒత్తిడి ఎక్కువగా ఉండటంతో యువతీయువకులు గోప్యంగా ఆన్లైన్ డేటింగ్ ప్రొఫైల్స్ నిర్వహిస్తున్నారు. ఇంట్లో తెలియకుండా వీరు కేవలం గ్రూప్ చాట్స్లో మాత్రమే గుసగుసలాడుకుంటున్నారు. వీరు కలుసుకునేందుకు గచ్చిబౌలి, మాదాపూర్ వంటి దూర ప్రాంతాల్లోని పబ్లిక్ కాఫీ షాప్లను ఎంచుకుంటున్నారు.
MBNR: 69వ ఎస్.జి.ఎఫ్ హ్యాండ్ బాల్ పోటీల్లో ప్రతిభ కనబరిచి విజేతగా నిలిచిన జిల్లా జట్టులోని వాగ్దేవి జూనియర్ కళాశాల క్రీడాకారులను కళాశాల కరస్పాండెంట్ వెంకటరెడ్డి అభినందించారు. సోమవారం విద్యార్థులను శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. చదువుతోపాటు యువతకు క్రీడలు కూడా ఎంతో ముఖ్యమన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ గీత దేవి పాల్గొన్నారు.
NGKL: ఊర్కొండ మండలంలోని సూర్యలత స్పిన్నింగ్ మిల్ సమీపంలో రాత్రి గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో సాకలి అంజయ్య (45) అనే రైతుకు తీవ్ర గాయాలయ్యాయి. ద్విచక్ర వాహనంపై కల్వకుర్తి నుంచి తన స్వగ్రామం రామిరెడ్డిపల్లికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అంజయ్య కాలు విరగడంతో స్థానికులు 108 అంబులెన్స్లో అతన్ని కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ములుగు: మేడారం మహాజాతర దగ్గర పడుతోంది. జాతరకు ఇంకా 43 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇప్పటికే భక్తులు ముందస్తు మొక్కులకు తరలివస్తున్నారు. అయితే, ఆలయ అభివృద్ధి పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. జాతరలోపు పనులు పూర్తవుతాయా?అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల మంత్రి పొంగులేటి పనుల ఆలస్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. భక్తుల రాకతో అంతరాయం ఏర్పడుతుంది.
WGL: రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా వరంగల్ ట్రై సిటి పరిధిలో గత వారం డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో నమోదైన మొత్తం 437 కేసుల్లో రూ. 1,58,200ను కోర్టు జరిమానా, 24 మందికి జైలు శిక్ష విధించింది. మద్యం తాగి వాహనం నడపటం నేరమని సీపీ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు.
ADB: ఆదిలాబాద్ డిపోలోని కార్గోలో వినియోగదారులు తీసుకువెళ్లని వస్తువులకు ఈనెల 18న వేలం నిర్వహిస్తున్నట్లు ఆదిలాబాద్ RTC డిపో మేనేజర్ ప్రతిమారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 18న ఉదయం 11 గంటలకు డిపో ఆవరణలో వేలం ప్రారంభమవుతుందన్నారు. ఆసక్తి ఉన్నవారు వేలంలో పాల్గొని వస్తువులను కొనుగోలు చేయవచ్చని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
NRML: జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తున్న అధికారులకు తగిన వసతులు కల్పించాలని జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్కు జిల్లాలోని వివిధ ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో కోరారు. పంచాయతీ కార్యాలయంలో డీపీఓను పలువురు కలిశారు. ఎన్నికల్లో పాల్గొనే అధికారులకు రవాణా, భోజనం, రెమ్యూనరేషన్ తదితర సౌకర్యాలు పకడ్బందీగా ఏర్పాటు చేయాలన్నారు.
జనగాం: జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మూడు మండలాలకు చెందిన 91 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు రేపు జరగనున్నాయి. దేవరుప్పల మండలంలో 32, పాలకుర్తి మండలంలో 38, కొడకండ్ల మండలంలో 21 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. మొత్తం 800 పోలింగ్ స్టేషన్ల పరిధిలో ఎన్నికలు జరగనున్నాయి. 597 మంది ఓపీవోలు కలిపి మొత్తం 1,194 మంది సిబ్బంది విధులు నిర్వర్తించనున్నారు.
GDWL: జిల్లా కోర్టు జడ్జి ఎన్. ప్రేమలత మహబూబ్ నగర్కు బదిలీపై వెళుతున్న సందర్భంగా సోమవారం కోర్టు ఆవరణలో సత్యాస్లా ప్రతినిధులు, న్యాయవాదులు ఆమెను ఘనంగా సన్మానించారు. గద్వాలలో ఆమె 8 నెలల కాలంలో న్యాయ వ్యవస్థకు కొత్త ఊపిరినిచ్చారని, ఆమె అందించిన సేవలను న్యాయవాదులు కొనియాడారు. ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు.