• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

రజక రిజర్వేషన్ సమితి మండల అధ్యక్షుడిగా భాస్కర్

JNG: తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి బచ్చన్నపేట మండలం అధ్యక్షునిగా ఆరేళ్ల భాస్కర్ ఎన్నికయ్యారు. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షులు గోపి రజక ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకొని, నియామక పత్రం అందజేశారు. తన నియామకానికి సేకరించినందుకు రాష్ట్ర అధ్యక్షునికి, జిల్లా నాయకులకు భాస్కర్ ధన్యవాదాలు తెలిపారు. రజక కులస్థులు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.

December 27, 2024 / 02:24 PM IST

‘అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలి’

WNP: ప్రజా పాలన దరఖాస్తులతో సంబంధం లేకుండా ప్రతి ఇంటిని సర్వేచేసి అర్హులకు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధి చేకూర్చాలని సీపీఎం జిల్లా కార్యదర్శి పుట్టాంజనేయులు డిమాండ్ చేశారు. పట్టణ సమస్యలు పరిష్కరించాలని సీపీఎం చేపట్టిన రిలే నిరాహారదీక్షల శిబిరాన్ని ఆయన సందర్శించి మాట్లాడారు. ఇళ్ల నిర్మాణాలకు కేంద్ర ప్రభుత్వం రూ.10 లక్షలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

December 27, 2024 / 02:23 PM IST

పిల్లల మర్రి బాలోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

MBNR: చిన్నారులు అన్ని రంగాల్లో ప్రతిభను కనబర్చాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని బృందావన్ గార్డెన్‌లో ‘3వ పిల్లల మర్రి బాలోత్సవ కార్యక్రమం’ ఘనంగా నిర్వహించారు. చిన్నారులు ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్, చిత్ర లేఖనం, ఆటలు, దేశభక్తి గీతాలు తదితర ప్రదర్శనలను సందర్శించారు.

December 27, 2024 / 02:08 PM IST

పిల్లల మర్రి బాలోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

MBNR: చిన్నారులు అన్ని రంగాల్లో ప్రతిభను కనబర్చాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని బృందావన్ గార్డెన్‌లో ‘3వ పిల్లల మర్రి బాలోత్సవ కార్యక్రమం’ ఘనంగా నిర్వహించారు. చిన్నారులు ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్, చిత్ర లేఖనం, ఆటలు, దేశభక్తి గీతాలు తదితర ప్రదర్శనలను సందర్శించారు.

December 27, 2024 / 02:08 PM IST

పిల్లల మర్రి బాలోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

MBNR: చిన్నారులు అన్ని రంగాల్లో ప్రతిభను కనబర్చాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని బృందావన్ గార్డెన్‌లో ‘3వ పిల్లల మర్రి బాలోత్సవ కార్యక్రమం’ ఘనంగా నిర్వహించారు. చిన్నారులు ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్, చిత్ర లేఖనం, ఆటలు, దేశభక్తి గీతాలు తదితర ప్రదర్శనలను సందర్శించారు.

December 27, 2024 / 02:08 PM IST

పెండింగ్‌లో ఉన్న బిల్లులు చెల్లించాలని డిమాండ్

MHBD: మాజీ సర్పంచులకు చెల్లించవలసిన పెండింగ్ బిల్లులు తక్షణమే చెల్లించాలని జిల్లా సర్పంచ్‌లు ఫోరం వర్కింగ్ ప్రెసిడెంట్ బోడ లక్ష్మణ్ నాయక్ అన్నారు. శుక్రవారం మహబూబాద్ జిల్లా కేంద్రంలోని గాంధీ విగ్రహానికి వినతిపత్రం సమర్పించి, మాజీ సర్పంచులపై రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ నినాదాలు చేశారు.

December 27, 2024 / 01:54 PM IST

‘ఆలేరు కాంగ్రెస్‌లో చిచ్చు పెడితే ఊరుకోం’

BHNR: ఆలేరు కాంగ్రెస్‌లో చిచ్చు పెడితే ఊరుకోబోమని ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మంగ కిరణ్ కుమార్ అన్నారు. శుక్రవారం ఆలేరులో ఆయన మాట్లాడుతూ.. ఇటీవల మోటకొండూరులో యూత్ కాంగ్రెస్ నాయకుల సన్మాన సభలో స్థానిక ఎమ్మెల్యే ఫొటో లేకుండా ఫ్లెక్సీ పెట్టారని, కొందరు స్వార్థ రాజకీయాల కోసం పార్టీని బద్నాం చేస్తున్నారని ఆరోపించారు.

December 27, 2024 / 01:52 PM IST

మన్మోహన్ మృతిపట్ల ఎమ్మెల్యే కవ్వంపల్లి నివాళి

KNR: దేశ ఆర్థిక ప్రగతికి పునాదులు వేసిన గొప్ప ఆర్థికవేత్త, సంస్కరణశీలి డాక్టర్ మన్మోహన్ సింగ్ అని మానకొండూర్ శాసనసభ్యుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పేర్కొన్నారు. దేశ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి సంతాప సూచకంగా శుక్రవారం ఎల్ఎండీ కాలనీలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆ మహనీయుని చిత్రపటానికి పార్టీ నాయకులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

December 27, 2024 / 01:38 PM IST

మన్మోహన్ మృతిపట్ల ఎమ్మెల్యే కవ్వంపల్లి నివాళి

KNR: దేశ ఆర్థిక ప్రగతికి పునాదులు వేసిన గొప్ప ఆర్థికవేత్త, సంస్కరణశీలి డాక్టర్ మన్మోహన్ సింగ్ అని మానకొండూర్ శాసనసభ్యుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పేర్కొన్నారు. దేశ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి సంతాప సూచకంగా శుక్రవారం ఎల్ఎండీ కాలనీలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆ మహనీయుని చిత్రపటానికి పార్టీ నాయకులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

December 27, 2024 / 01:38 PM IST

గంజాయిని విక్రయిస్తున్న నలుగురిపై కేసు నమోదు

NZB: సిరికొండ మండలంలో గంజాయి విక్రయిస్తున్న నలుగురు వ్యక్తుల్ని అరెస్టు చేసి కేసు నమోదు చేసి శుక్రవారం రిమాండ్‌కు తరలించినట్టు పోలీసులు తెలిపారు. ఎక్కడైనా గంజాయి విక్రయించినట్లు తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. గంజాయి విక్రయంతో యువత తప్పు దోవకు దారి పడుతున్నారని తెలిపారు.

December 27, 2024 / 01:37 PM IST

స్థానిక ఎన్నికలు అప్పుడే నిర్వహించాలి: కవిత

NZB: కాంగ్రెస్‌ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లపై స్పష్టత ఇచ్చాకే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని ఉమ్మడి నిజామాబాద్ ఎమ్మెల్సీ కవిత డిమాండ్‌ చేశారు. హైదరాబాద్‌లో శుక్రవారం ఆమె బీసీ సంఘాలతో శుక్రవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కామారెడ్డి డిక్లరేషన్ ఏమైంది అని అన్నారు.

December 27, 2024 / 01:36 PM IST

స్థానిక ఎన్నికలు అప్పుడే నిర్వహించాలి: కవిత

NZB: కాంగ్రెస్‌ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లపై స్పష్టత ఇచ్చాకే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని ఉమ్మడి నిజామాబాద్ ఎమ్మెల్సీ కవిత డిమాండ్‌ చేశారు. హైదరాబాద్‌లో శుక్రవారం ఆమె బీసీ సంఘాలతో శుక్రవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కామారెడ్డి డిక్లరేషన్ ఏమైంది అని అన్నారు.

December 27, 2024 / 01:36 PM IST

మాజీ ప్రధాని మృతి దేశానికి తీరని లోటు: ఎమ్మెల్యే

BHNG: భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల ఆయన కుటుంబానికి ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య సంతాపం తెలిపారు. ఆయన మరణం దిగ్భ్రాంతికి గురి చేసిందని అన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రిగా దేశంలో అనేక ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారని పేర్కొన్నారు. ఆయన మృతి దేశానికి తీరని లోటని అన్నారు.

December 27, 2024 / 01:34 PM IST

మాజీ ప్రధాని మృతి దేశానికి తీరని లోటు: ఎమ్మెల్యే

BHNG: భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల ఆయన కుటుంబానికి ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య సంతాపం తెలిపారు. ఆయన మరణం దిగ్భ్రాంతికి గురి చేసిందని అన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రిగా దేశంలో అనేక ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారని పేర్కొన్నారు. ఆయన మృతి దేశానికి తీరని లోటని అన్నారు.

December 27, 2024 / 01:34 PM IST

నేడు మంత్రి తుమ్మల నేటి పర్యటన వాయిదా

KMM: భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి సంతాపంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో శుక్రవారం సాయంత్రం జరగాల్సిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అధికారిక పర్యటన వాయిదా వేయడం జరిగిందిందని జిల్లా కాంగ్రెస్ నాయకులు ఒక ప్రకటనలో తెలిపారు. కావున ప్రతి ఒక్కరూ గమనించి సంతాప కార్యక్రమాల్లో పాల్గొనాలని తెలిపారు.

December 27, 2024 / 01:33 PM IST