• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

వర్షం దెబ్బకు.. కాస్త తగ్గిన దోమలు

MDCL: ఉప్పల్, నాచారం, హబ్సిగూడ, తార్నాక ప్రాంతాల్లో రాత్రి కురిసిన వర్షం ప్రభావంతో దోమల బెడద కొంత తగ్గినట్లు స్థానికులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా తీవ్రంగా వేధిస్తున్న దోమలు వర్షం కారణంగా తాత్కాలికంగా తగ్గడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అయితే నీటి నిల్వలు పెరిగే అవకాశం ఉండటంతో మళ్లీ దోమలు పెరగకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు.

March 28, 2026 / 07:36 AM IST

ఈజ్ గావ్ నూతన SIగా చంద్రశేఖర్ బాధ్యతల స్వీకరణ

ASF: కాగజ్ నగర్ మండలం ఈజ్ గావ్ పోలీస్ స్టేషన్ నూతన SIగా చంద్రశేఖర్ బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ పనిచేసిన SI కళ్యాణ్ బదిలీ కావడంతో ఆయన స్థానంలో చంద్రశేఖర్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా పోలీస్ సిబ్బంది ఆయనకు పుష్పగుచ్చం ఇచ్చి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఎస్సై మాట్లాడుతూ.. మండలంలో నేరాల నియంత్రణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.

March 28, 2026 / 07:35 AM IST

ద్విచక్రవాహనాల ఢీ – ఇద్దరికి తీవ్ర గాయాలు

HNK: ఎల్కతుర్తి మండల కేంద్రంలో క్రాస్ రోడ్డు వద్ద ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్న ఘటనలో మల్లేష్ (56), సారయ్య (35)లకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు 108కు సమాచారం ఇవ్వడంతో అంబులెన్స్ చేరుకుని 108 ఈఎంటీ స్వాతి, పైలెట్ ప్రవీణ్ కుమార్ గాయపడిన వారికి ప్రథమ చికిత్స అందించి మెరుగైన చికిత్స కోసం ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.

March 28, 2026 / 07:32 AM IST

TARGET.. ఐదేళ్లలో 5 లక్షల ఎకరాల్లో కూరగాయల సాగు

RR: జిల్లా కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యానవర్సిటీ కాలేజీలో వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్రమోహన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కూరగాయల డిమాండ్ గణనీయంగా పెరుగుతోందని తెలిపారు. ఈ నేపథ్యంలో TGలో ప్రతి ఏడాది లక్ష ఎకరాల చొప్పున, ఐదేళ్లలో మొత్తం ఐదు లక్షల ఎకరాల్లో కూరగాయల సాగును విస్తరించే లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించినట్లు వెల్లడించారు.

March 28, 2026 / 07:30 AM IST

బిచ్కుందలో వైభవంగా రామయ్య శోభాయాత్ర

KMR: బిచ్కుంద పట్టణ కేంద్రంలో శుక్రవారం శ్రీరామనవమి పురస్కరించుకుని హిందూ సంఘాల ఆధ్వర్యంలో శోభాయాత్ర కనులపండుగుగా జరిగింది. శ్రీరామ ఆలయం నుంచి ప్రధాన వీధుల గుండా సాగిన ఈ ఊరేగింపులో మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే, కౌన్సిలర్లు పాల్గొన్నారు. కాషాయ జెండాలు ధరించి, ‘జై శ్రీరామ్’ నినాదాల మధ్య డీజే పాటలకు యువత నృత్యాలు చేశారు.

March 28, 2026 / 07:30 AM IST

గ్యాస్ కొరత ఎక్కడ లేదు.. కలెక్టర్ల స్పష్టత..!

హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో ఎక్కడ కూడా ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల కొరత లేదని ఆయా జిల్లా కలెక్టర్లు హరిచందన, మనూ చౌదరి, నారాయణ రెడ్డి స్పష్టం చేశారు. సరఫరా వ్యవస్థ సజావుగా కొనసాగుతోందని, వినియోగదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. గ్యాస్ ఏజెన్సీలు తగిన నిల్వలను ఉంచి, సమయానికి సరఫరా చేస్తున్నాయని వెల్లడించారు.

March 28, 2026 / 07:29 AM IST

గ్యాస్ కొరత ఎక్కడ లేదు.. కలెక్టర్ల స్పష్టత..!

హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో ఎక్కడ కూడా ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల కొరత లేదని ఆయా జిల్లా కలెక్టర్లు హరిచందన, మనూ చౌదరి, నారాయణ రెడ్డి స్పష్టం చేశారు. సరఫరా వ్యవస్థ సజావుగా కొనసాగుతోందని, వినియోగదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. గ్యాస్ ఏజెన్సీలు తగిన నిల్వలను ఉంచి, సమయానికి సరఫరా చేస్తున్నాయని వెల్లడించారు.

March 28, 2026 / 07:29 AM IST

‘ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి’

NRPT: నారాయణపేట మండలం కొల్లంపల్లిలో ప్రజా రవాణా అటో డ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనలపై ఎస్సై గాయత్రి అవగాహన కల్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ..ఆటో డ్రైవర్లు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. పరిమితికి మించి ప్రయాణికులను తీసుకెళ్లారాదని అన్నారు.

March 28, 2026 / 07:28 AM IST

అర్ధరాత్రి వరకు రాములోరి శోభాయాత్ర

KNR: సైదాపూర్ మండలం లస్మన్నపల్లి గ్రామంలో అర్థరాత్రి 12 గంటల వరకు రాములోరి శోభాయాత్ర కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు కోలాటం నృత్యాలతో గ్రామస్తులను అలరించారు. అలాగే హనుమాన్ దీక్షాపరులు తమ భక్తజన పాటలతో గ్రామస్థులను ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థుల భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

March 28, 2026 / 07:24 AM IST

శ్రీరామనవమి వేడుకల్లో అలరించిన విద్యార్థుల ప్రదర్శనలు

NGKL: గట్టు మండలం అంతంపల్లిలో శ్రీరామనవమి పండుగ సంబరాలు మిన్నంటాయి. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు గ్రామ ప్రజలను విశేషంగా అలరించాయి. విద్యార్థుల్లోని ప్రతిభను వెలికితీస్తూ, ఇలాంటి అద్భుతమైన ప్రదర్శనలకు ప్రోత్సహిస్తున్న ఉపాధ్యాయ బృందానికి గ్రామ దేవస్థాన కమిటీ, తల్లిదండ్రులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

March 28, 2026 / 07:21 AM IST

పెద్దపల్లిలో ఘనంగా సీతారాముల శోభాయాత్ర

పెద్దపల్లి పట్టణంలో శ్రీరామనవమి సందర్భంగా శుక్రవారం రాత్రి శ్రీ సీతారాముల శోభాయాత్ర ఘనంగా, అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. స్థానిక కంసరి బావి హనుమాన్ ఆలయం నుంచి జండా చౌరస్తా, మెయిన్ రోడ్, అమర్ నగర్ మీదుగా యాత్ర కొనసాగింది. జైశ్రీరామ్ నినాదాలతో, టపాసులు కాల్చుతూ, డీజే పాటలకు స్టెప్పులు వేస్తూ భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

March 28, 2026 / 07:20 AM IST

ఏప్రిల్ నెలలో జాగ్రత్త..!

MBNR: ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా వేసవి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. వాతావరణ శాఖ అంచనా ప్రకారం.. ఏప్రిల్ మొదటి 2 వారాల్లోనే నగరంలో ఉష్ణోగ్రత 38 డిగ్రీలకు చేరే అవకాశం ఉంది. మధ్యాహ్నం బయటకు వెళ్లేటప్పుడు గొడుగు, రుమాలు తీసుకెళ్లాలని, నీరు తాగడం, అవసరం లేకుండా ఎండలో తిరగకూడదని అధికారులు హెచ్చరించారు. వృద్ధులు, చిన్నపిల్లలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

March 28, 2026 / 07:20 AM IST

నేడు దేవాపూర్ సంతలకు వేలం

MNCL: కాసిపేట మండలంలోని దేవాపూర్ గ్రామ పంచాయతీలో గురు, ఆదివారాల్లో నిర్వహించే సంతలకు నేడు (శనివారం)వేలం వేయనున్నట్లు పంచాయతీ కార్యదర్శి కవిత తెలిపారు. ఉదయం 10:30 గంటలకు గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వేలం వేయనున్నట్లు పేర్కొ న్నారు. వేలంలో పాల్గొనేవారు రూ.5 వేలు డిపాజిట్ చేయాలని పేర్కొన్నారు.

March 28, 2026 / 07:18 AM IST

విద్యుత్ సమస్యతో సతమతమవుతున్న రైతులు

BDK: ఆళ్లపల్లి మండలంలోని నడిమిగూడెం రైతులు తీవ్ర విద్యుత్ సమస్యను ఎదుర్కొంటున్నారు. జనవరి, ఫిబ్రవరి నెలల్లో రోజుకు 20 గంటల వరకు ఉన్న త్రీఫేస్ విద్యుత్ సరఫరా, మార్చిలో కేవలం 2 నుంచి  3గంటలకు పడిపోవడంతో సాగు చేసిన మొక్కజొన్న పంటలు ఎండిపోతున్నాయి. కొమరం బుచ్చిబాబు, పాయం సాయన్న సహా పలువురు రైతులు తమ పంటలు కళ్లముందే ఎండుతుండటంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

March 28, 2026 / 07:14 AM IST

మహర్దశ.. రూ.30.5 కోట్లతో చెరువు అభివృద్ధి..!

MDCL: నాచారంలోని పెద్ద చెరువు ఏకంగా రూ. 30.5 కోట్లతో అభివృద్ధి కానుంది. హైడ్రా ఇటీవలే ఈ ప్రాజెక్ట్‌కు నిధులు కేటాయించినట్లు వెల్లడించింది. చెరువును పూర్తిగా కాలుష్య రహితంగా మార్చుతూ, శుద్ధి చర్యలు చేపట్టి పర్యావరణానికి అనుకూలంగా అభివృద్ధి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. రాబోయే రోజుల్లో దీనిపై మరింత ఫోకస్ చేయనున్నారు.

March 28, 2026 / 07:13 AM IST