SRD: సదాశివపేట, ఆందోలు- జోగిపేట, నారాయణఖేడ్ మున్సిపాలిటీల ప్రత్యేక అధికారిగా అదనపు కలెక్టర్ మాధురినే నియమిస్తూ పురపాలక శాఖ శనివారం ఉత్తరం కూడా జారీ చేసింది. ఇప్పటి వరకు ప్రత్యేక అధికారిగా ఉన్న స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ ఉత్తరాఖండ్లో ఐఏఎస్ శిక్షణకు వెళ్లారు. ఆయన స్థానంలో మాధురి అదనపు బాధ్యతలు నిర్వహించనున్నారు.
NZB: కేంద్రంగాఏర్పాటైన జాతీయపసుపుబోర్డు కార్యదర్శిగా నాగాలాండ్ క్యాడర్కు చెందిన 2017 బ్యాచ్ ఐఏఎస్ భవాని నియమితులయ్యారు. ఈ మేరకు వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ డిప్యూటీ డైరెక్టర్ అరుణ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. సుగంధ దవ్యాల బోర్డు డైరెక్టర్ డాక్టర్ రెమాశ్రీ సుగంధద్రవ్యాలబోర్డు, పసుపు బోర్డుమధ్యకార్యకలాపాలనుసమన్వయంచేస్తారని ఉత్తర్వులో పేర్కొన్నారు.
WNP: మార్చి 5 నుంచి ప్రారంభంకానున్న ఇంటర్మీడియట్ పరీక్షలను వనపర్తి జిల్లాలో పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. శుక్రవారం ఐడీఓసీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. పరీక్ష కేంద్రంలో చీఫ్ సూపరింటెండెంట్ సహా ఏ ఒక్కరూ మొబైల్ ఫోన్లు తీసుకువెళ్ళడానికి అనుమతి లేదని చెప్పారు.
HYD: మాదాపూర్లోని తుమ్మిడికుంట, ఉప్పల్ నల్లచెరువు, కాటేదాన్లోని బమ్ రుక్ చెరువులను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పరిశీలించారు. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఆయన పర్యటించారు. ఆక్రమణల్లో కూరుకుపోయిన చెరువులకు జీవం పోస్తామని, చెరువుల వద్ద ఇప్పటికే ఉన్న ఇళ్లను తొలగించబోమన్నారు.
MBNR: జిల్లా కేంద్రంలోని ఇరిగేషన్ కార్యాలయంలో కరివెన ప్రాజెక్టుపై నిర్వహించిన రివ్యూ కార్యక్రమంలో దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూధన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పనులకు సంబంధించి పురోగతిపై అధికారులతో విస్తృతంగా చర్చించారు. గుత్తేదారులు సకాలంలో పనులు చేస్తున్నారా? లేదా? అని అడిగి తెలుసుకున్నారు.
MBNR: ప్రజా సంక్షేమానికి ఏఆర్ పోలీస్ సిబ్బంది కట్టుబడి ఉన్నారని మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ జానకి ధారావత్ అన్నారు. శుక్రవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పోలీస్ మైదానంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఏఆర్ సిబ్బంది తమ తమ కుటుంబాలను వదిలి ప్రజా సంక్షేమానికి పాటు పడతారని వెల్లడించారు.
JN: బస్సులో ప్రయాణికుడు పోగొట్టుకున్న బంగారు బ్రాస్లెట్ను అందించి కండక్టర్ నిజాయితీని చాటుకున్నారు. పోలీస్ కమిషనరేట్ పరిధిలోని కాజీపేట పోలీస్ స్టేషన్లో శుక్రవారం రాత్రి సీఐ సుధాకర్ రెడ్డి చేతుల మీదుగా బ్రాస్లేట్ ను ప్రయాణికుడు ప్రేమ్ కుమార్కు అందజేశారు నిజాయితీగా వ్యవహరించిన కండక్టర్ను పోలీస్ అధికారులు అభినందించారు.
NZB: ఎల్లారెడ్డి ఐకేపీ కార్యాలయంలో శుక్రవారం గ్రామ సంఘాలకు సంబంధించి అంతర్గత ఆడిట్ను అధికారులు నిర్వహించారు. గ్రామ సంఘాల ఆదాయ, వ్యయాల వివరాలున్న రికార్డులను పరిశీలించారు. 2024 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు రికార్డులను పరిశీలించినట్లు ఆడిట్ అధికారులు తెలిపారు. రికార్డులు నిర్వహణ సజావుగా ఉందని తెలిపారు. ఏపీఎం ప్రసన్న రాణి, ప్రతినిధులు పాల్గొన్నారు.
WGL: మామునూరు ఎయిరోపోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జిల్లా వాసులకు దశాబ్ద కాలం కోరిక నెరవేరిందని మంత్రి కొండా సురేఖ అభిప్రాయపడ్డారు. ఇది సీఎం రేవంత్, ఉన్నతాధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, వరంగల్ జిల్లా ప్రజల అదృష్టమని పేర్కొన్నారు. ఓరుగల్లు వాసులు ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న కలను నెరవేర్చే దిశగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వేగంగా అడుగులు వేసిందన్నారు.
మహబూబాబాద్ జిల్లాలోని పలు ప్రభుత్వ వసతిగృహాలను శుక్రవారం రాత్రి జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థులు స్టడీ అవర్ను పరిశీలించి పలు ప్రశ్నలతో పాటు మార్కులు సాధించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తగు సూచనలు చేశారు. వేసవికాలం ప్రారంభమైన నేపథ్యంలో విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని అధికారులకు సూచించారు.
NRML: ఆర్జీయూకేటీ విద్యార్థి కే.వెంకటేష్ హర్యానాలో జరగనున్న జాతీయ స్థాయి నెట్ బాల్ క్రీడాపోటీలకు ఎంపికయ్యాడు. శుక్రవారం ఆర్జీయూకేటీ వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ గోవర్ధన్ జాతీయ స్థాయి పోటీలకు వెంకటేష్ ఎంపిక కావడంపై హర్షం వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రీడాపోటీల్లో విద్యార్థి పాల్గొంటారని పేర్కొన్నారు.
ADB: వాఘాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని కొలం గూడలో ఎంపీడీఓ, ఎంపీవో, హౌసింగ్ డీఈ పంచాయతీ కార్యదర్శిల ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యనిర్వాహక అధ్యక్షుడు భూపెళ్లి శ్రీధర్ అదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం ఇంఛార్జి కంది శ్రీనివాసరెడ్డి, జిల్లా ఇంఛార్జి మంత్రి సీతక్కకు కృతజ్ఞతలు తెలిపారు.
ADB: జిల్లా ఇంఛార్జ్ మంత్రి సీతక్కను ఎమ్మెల్యే వేడ్మ బొజ్జు ఆధ్వర్యంలో తుడుందెబ్బ నాయకులు హైదరాబాదులో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మావల మండలం కొమరం భీం కాలనీలో మార్చి 8న నిర్వహించనున్న అంతర్జాతీయ మహిళా శ్రామిక దినోత్సవానికి హాజరుకావాలని ఆహ్వాన పత్రిక అందజేశారు. కార్యక్రమంలో తుడుందెబ్బ రాష్ట్ర కో-కన్వీనర్ గణేష్, రేణుక, మనోజ్ తదితరులున్నారు.
కామారెడ్డి: ఉపాధి హామీ కూలీల సంఖ్య పెంచాలని, పనులు మంజూరైన వాటిని కన్వర్ట్ చేస్తూ సీసీ రోడ్లు నిర్మించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. శుక్రవారం అధికారులతో కలిసి ఉపాధి హామీ పథకం, సమగ్ర కుటుంబ సర్వే, గ్రామీణ ప్రాంతాల్లో పన్నుల వసూళ్లు, ఎల్ఆర్ఎస్, త్రాగునీటి సౌకర్యాలు, ఇందిరమ్మ ఇళ్లు వాటిపై ఎంపీడీఓలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు .
ASF: జిల్లా పోలీస్ కార్యాలయంలో హెడ్ కానిస్టేబుల్ జగ్గారావు పదవి విరమణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా అదనపు ఎస్పీ ఆర్.ప్రభాకర రావు జగ్గారావును శాలువాతో సన్మానించి, ఆయన సేవలను ప్రశంసించారు. 35 సంవత్సరాల సేవలో నిష్కలంకంగా విధులు నిర్వహించినట్లు తెలిపారు. కాగా, జగ్గారావు 2016లో హెడ్ కానిస్టేబుల్గా పదోన్నతి పొందాడు.