SRD: పటాన్చెరు మండలం చిట్కూల్ గ్రామంలో ఉచిత వైద్య శిబిరాన్ని కాంగ్రెస్ పార్టీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ ఆదివారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. ఉచిత వైద్య శిబిరాన్ని పేదలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 200 మందికి ఉచితంగా వైద్యాన్ని అందించినట్లు డాక్టర్లు తెలిపారు.
BDK: పినపాక మండలం జానంపేట గ్రామంలో ఈనెల 4వ తేదీ నుంచి 8వ తేదీ వరకు జరిగే నాగులమ్మ జాతరకు ముఖ్యఅతిథిగా రావాలని కోరుతూ.. ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లకు ఆదివారం ఆలయ కమిటీ నిర్వహకులు ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. జాతర కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ నిర్వాహకులు గ్రామ పెద్దలు ఉన్నారు.
NZB: భార్యా భర్తల మధ్య ఏర్పడ్డ మనస్పర్ధలు దాడికి దారి చేశాయి. ఈ ఘటన నవీపేటలో చోటుచేసుకుంది. అభంగపట్నంకు చెందిన జ్యోతికి మిథున్తో వివాహం జరిగింది. ఇద్దరి మధ్య మనస్పర్ధలు కారణంగా మూడు నెలల నుంచి తల్లి గారి ఇంట్లో ఉంటుంది. దీంతో తన భర్త కక్ష పెంచుకొని, శనివారం జ్యోతి తండ్రిపై బండరాయితో దాడి చేశాడు. అలాగే జ్యోతి తోపాటు ఆమె తల్లిపై కత్తితో దాడి చేశాడు.
JN: ఏబీవీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈనెల 5న మెగా ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ డా. నర్సయ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో టెక్ మహీంద్రా, జెన్ పాక్ట్, హెచ్ఎఫ్సీ, యాక్సిస్ బ్యాంకు, హెల్త్ కేర్, తదితర కంపెనీలు పాల్గొంటున్నాయన్నారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వివరాలకు 9912437032 సంప్రదించాలని సూచించారు.
WGL: జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. లైవ్ కోడి కిలో రూ.120 పలకగా.. విత్ స్కిన్ KG రూ.130-140 పలకగా, స్కిన్స్ KG రూ.160 పలుకుతోంది. అయితే గత వారంతో పోలిసే ఈరోజు ధరలు స్వల్పంగా పెరిగాయి. బర్డ్స్ ఫూ ప్రభావంతో స్వల్పంగా అమ్మకాలు పడిపోయాయని నిర్వాహకులు తెలుపుతున్నారు. కాగా.. సిటీతో పోలిస్తే పల్లెలలో రూ. 10-20 ధర వ్యత్యాసం ఉంది.
NLG: డిండి మండలం ఎర్రారంలో రంజాన్ నెల ప్రారంభం సందర్భంగా పేద ముస్లిం కుటుంబాలకు ఎమ్మెల్యే బాలునాయక్ ఆదివారం “తోఫా” అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రంజాన్ పండుగ ముస్లిం సోదరులకు అత్యంత పవిత్రమైన పండుగ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిండి మండల బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేంకటేశ్వర రావు, తదితరులు పాల్గొన్నారు.
MDK: రామాయంపేటలో సైకిల్ డ్రైవ్ నిర్వహించారు. ఆరోగ్యంగా ఉండాలంటే గంట పాటు సైక్లింగ్ చేయాలని ప్రజలకు అవగాహన కల్పించడం కోసం ఖేలో ఇండియా సైక్లింగ్ సెంటర్ ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. స్థానిక కోచ్ యాదగిరి గ్రామంలో సైకిల్ ర్యాలీ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రతిరోజు సైకిల్ తొక్కాలన్నారు.
ADB: జిల్లాలో ఇటీవల మైనర్ బాలికపై అత్యాచార జిరిగింది. ఈ ఘటనకు పాల్పడిన నిందితులపై, లైంగిక అఘాతాలకు సంబంధించిన కేసులను త్వరగా.. ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ చేపట్టాలని వివిధ రాజకీయ పార్టీల నాయకులు కలిసి కట్టుగా జిల్లా ఎస్పీ గౌష్ ఆలం ఐపీఎస్ను కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు గ్రామస్థులు, తదితరులున్నారు.
MNCL: జన్నారం మండలంలోని అటవీ రేంజ్ బైసన్ కుంట ప్రాంతంలో పక్షి శాస్త్రవేత్తలు, అటవీశాఖ అధికారులు పక్షుల శబ్దాలను రికార్డింగ్ చేశారు. ఆదివారం ఉదయం వారు బైసన్ కుంట ప్రాంతంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆ ప్రాంతంలో సంచరిస్తున్న వివిధ పక్షుల శబ్దాలను ఆధునిక పరికరాల ద్వారా రికార్డు చేశారు. ఆధునిక పరికరాలు ఉపయోగించి పక్షుల శబ్దాలను రికార్డింగ్ చేయవచ్చన్నారు.
NLG: చిట్యాల మండలం పెద్దకాపర్తి శివారులో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది.బస్సు కంటైనర్ 2 కార్లు ఢీకొనడంతో ఓకారులో ప్రయాణిస్తున్న 2 మృతి చెందగా.. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. విజయవాడ నుంచి HYDవెళ్తున్న బస్సుడ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో వెనుక ఉన్న కారును కంటైనర్ ఢీకొట్టింది. దీంతో కారు బస్సు కిందికి దూసుకుపోయింది. ఈఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
మేడ్చల్: జర్నలిస్టులకోసం త్వరలో మెగాహెల్త్ క్యాంపు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తామని రాచకొండ కమిషనర్ సీపీ సుధీర్ బాబు తెలిపారు. నేరేడ్మేట్ సీపీ కార్యాలయంలో శనివారం జిల్లా టీయూడబ్ల్యూజే (ఐజేయూ) కార్యదర్శి వెంకటరామిరెడ్డి, మాజీస్టేట్ కౌన్సిల్ మెంబర్ భాస్కర్ రెడ్డి అధ్వర్యంలో జర్నలిస్టుల బృందం సీపీ సుధీర్ బాబును కలిసి టీయూడబ్ల్యూజే డైరీ అందజేశారు.
KMR: మహిళల మెడలో నుంచి బంగారు గుండ్లు చోరీ చేస్తున్న మహిళను శనివారం అరెస్ట్ చేసినట్లు బిచ్కుంద సీఐ జగడం నరేశ్ తెలిపారు. సీఐ కథనం ప్రకారం.. కర్నాటకలోని ఔరాద్ తాలూక కమల్నగర్కు చెందిన శాంతాబాయి మధుకర్ కాంబ్లే బిచ్కుంద బస్టాండ్లో చోరీలు చేస్తోంది. రద్దీగా ఉన్న బస్సుల్లో ఎక్కినట్లు నటించి మహిళల మెడలోని గుండ్లు చోరీ చేస్తోందని తెలిపారు.
SRPT: హుజూర్నగర్ మండలం వేపలసింగారంలోని వ్యవసాయ గోడౌన్ను శనివారం జిల్లా వ్యవసాయాధికారి శ్రీధర్ రెడ్డి, మండల వ్యవసాయ అధికారి స్వర్ణతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ.. రైతులకు ఎరువులు, యూరియా అందుబాటులో ఉంచాలని, రైతులకు ఎవరికి కూడా ఇబ్బందులు కలగకుండా అందజేయాలని సూచించారు.
NZB: ప్రస్తుత యాసంగి సీజన్లో ఎరువుల కొరత తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని వ్యవసాయ అధికారులను జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశించారు. గత సీజన్లతో పోలిస్తే ఈసారి ఎరువులకు పెద్ద ఎత్తున డిమాండ్ ఉందన్నారు. గతేడాది రబీలో 63 వేల మెట్రిక్ టన్నుల ఎరువులను వినియోగించగా, ఈ సారి 77 వేల మెట్రిక్ టన్నులకు ఎరువులకు డిమాండ్ పెరిగిందని వివరించారు.
KMR: పవిత్ర రంజాన్ మాసం ఆదివారం నుంచి ప్రారంభం కానుంది. శనివారం నెలవంక దర్శనంతో ముస్లిం సోదరులు నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు చేపట్టనున్నారు. నెల వంక దర్శనంతో శనివారం రాత్రి నుంచి తరావీహ్ నమాజ్ ప్రారంభం కానున్నట్లు పిట్లం జామే మస్జిద్ ముఫ్తీ జంషేద్ తెలిపారు. ఆదివారం తెల్లవారుజామున సహార్ చేపడుతున్నట్టు తెలిపారు.