• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

రేపు జిల్లాలో FLNAT/NIOS పరీక్షలు

నిర్మల్ జిల్లాలో రేపు FLNAT/NIOS పరీక్షలు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి భోజన్న ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు. ఉల్లాస్ కార్యక్రమంలో భాగంగా అభ్యాసకులు అధిక సంఖ్యలో హాజరు కావాలని, SERP సిబ్బంది వద్ద నమోదు చేసుకుని పరీక్ష రాయాలని సూచించారు. పరీక్షకు అన్ని రకాల ఏర్పాటు చేయడం జరిగిందని వారు పేర్కొన్నారు.

March 28, 2026 / 08:48 AM IST

విద్యుత్ కాంతులతో వేంకటేశ్వరుని ఆలయం ముస్తాబు

MBNR: కౌకుంట్ల మండలం వెంకటగిరిలో శనివారం లక్ష్మీ వేంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం వైభవంగా జరగనుంది. ఈ వేడుక కోసం ఆలయాన్ని విద్యుత్ దీపాలు, కాషాయ తోరణాలతో సుందరంగా అలంకరించారు. ఉదయం 11:00 గంటలకు వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య జరిగే ఈ దివ్య ఘట్టాన్ని భక్తులు అధిక సంఖ్యలో హాజరై దర్శించుకోవాలని నిర్వాహకులు కోరారు.

March 28, 2026 / 08:45 AM IST

శోభాయాత్రలో కళాకారుల సందడి

MDK: రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించిన శోభాయాత్రలో కళాకారులు సందడి చేశారు. పాండు చెరువు కట్ట కళ్యాణ రామచంద్రస్వామి దేవాలయం నుంచి శుక్రవారం రాత్రి సీతారాముల శోభాయాత్ర కార్యక్రమం నిర్వహించారు. భక్తి గీతాలు ఆలపిస్తూ ప్రత్యేక కళాకారులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి.

March 28, 2026 / 08:43 AM IST

మంత్రి చొరవతో విద్యుత్ లైన్ సమస్య పరిష్కారం

JGL: ధర్మపురి పట్టణంలో ఇళ్లపై ప్రమాదకరంగా ఉన్న 11 కేవీ విద్యుత్ లైన్ సమస్యకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చొరవతో పరిష్కారం లభించింది. నూతనంగా ఏర్పాటు చేసిన లైన్‌ను ప్రారంభించిన మంత్రి, 2009 నుంచి ప్రజా సమస్యలపై అవగాహనతో ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నానాని అన్నారు. రూ.4.60 కోట్లతో విద్యుత్ లైన్ షిఫ్టింగ్ పనులు కొనసాగుతున్నాయన్నారు.

March 28, 2026 / 08:41 AM IST

మొక్కజొన్న బయోపాలిమర్లతో భూమిలో కరిగే క్యారీ బ్యాగ్..!

HYD: Greeny పేరుతో ఒక స్టార్టప్, IIT HYD సహకారంతో మొక్కజొన్న బయోపాలిమర్లతో నో-ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు తయారు చేసింది. ఈ బ్యాగులు పర్యావరణహితంగా ఉండి అద్భుతంగా పనిచేస్తున్నాయని తెలిపారు. వినియోగం తర్వాత సుమారు 180 రోజుల్లోనే పూర్తిగా మట్టిలో కలిసిపోతాయని వెల్లడించారు. ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా ఇవి మంచి పరిష్కారంగా భావిస్తున్నారు.

March 28, 2026 / 08:39 AM IST

‘చెడు అలవాట్లతో జీవితం నాశనం చేసుకోవద్దు’

MHBD: ఇనుగుర్తి మండలంలోని చిన్ననాగరం గ్రామంలో శుక్రవారం స్థానిక ఎస్సై గంగారపు కరుణాకర్ ఆధ్వర్యంలో గ్రామస్తులకు మత్తు పదార్థాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ… గ్రామంలోని యువకులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, గంజాయి, డ్రగ్స్ బారిన పడి జీవితాలు నాశనం చేసుకోవద్దని పేర్కొన్నారు.

March 28, 2026 / 08:36 AM IST

హబ్సిగూడ సర్కిల్.. కరెంట్ కంట్రోల్ నెంబర్

MDCL: హబ్సిగూడ సర్కిల్ పరిధిలో సమ్మర్ యాక్షన్ ప్లాన్ అమలులో ఉందని డీఈ సుబ్బారావు తెలిపారు. విద్యుత్ సరఫరా అంతరాయాలు లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కొత్త ఫీడర్లు లేదా ఇతర సమస్యలు తలెత్తిన వెంటనే కంట్రోల్ రూమ్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు. సమస్యల పరిష్కారం కోసం 8712471612 నంబర్‌కు కాల్ చేయాలని కోరారు.

March 28, 2026 / 08:35 AM IST

జిల్లాలో ‘కల్తీకి కళ్లెం’ వేస్తున్న అధికారులు

VKB: జిల్లాలో కల్తీ ఆహార పదార్థాలకు, అక్రమ రవాణాకు అధికారులు కళ్లెం వేస్తున్నారు. ఎస్పీ స్నేహ మెహ్రా ఆదేశాల మేరకు కల్తీ ఆహార పదార్థాలతో పాటుగా అక్రమ ఇసుక, కలప, మట్టి దందాలపై టాస్క్ ఫోర్స్ పోలీసులు కొరడా ఝులిపిస్తున్నారు. జనవరి నుంచి ఇప్పటివరకు సుమారు 48 కేసులు నమోదు చేసినట్లు అధికారులు చెప్తున్నారు.

March 28, 2026 / 08:34 AM IST

హాస్టల్ భోజనంలో బల్లి.. విద్యార్థులు ఆందోళన

HNK: భీమారంలోని SVS జూనియర్ కళాశాల సమీపంలో ఉన్న శశాంక బాయ్స్ హాస్టల్‌లో శుక్రవారం సాయంత్రం భోజనంలో బల్లి కనిపించడంతో విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వెంటనే ఈ విషయాన్ని విద్యార్థులు ఫుడ్ అధికారులకు తెలిపారు. స్పందించిన అధికారులు భోజనాన్ని తనిఖీ చేసి..రూ.15,000 జరిమానా విధించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలన్నారు.

March 28, 2026 / 08:34 AM IST

రైలు కింద పడి ఇద్దరు ఆత్మహత్య

WGL: వరంగల్ నగరంలో రెండు వేర్వేరు చోట్ల ఆత్మహత్య ఘటనలు చోటుచేసుకున్నాయి. హంటర్ రోడ్ సంతోష్ మాత దేవాలయం ఎదుట విశాఖ వెళ్తున్న ఏపీ ఏసీ ఎక్స్‌ప్రెస్ కింద పడి రాజస్థానీ యువకుడు జోధారామ్ (30) మృతి చెందాడు. అలాగే ధర్మారం రైల్వే గేట్ సమీపంలో శాతవాహన ఎక్స్‌ప్రెస్ కింద పడి గుర్తుతెలియని యువకుడు (26) ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనలపై రైల్వే పోలీసులు కేసులు నమోదు చేశారు.

March 28, 2026 / 08:33 AM IST

చెరువులోకి దూకి వ్యక్తి ఆత్మహత్య

KMR: మద్యానికి బానిసై వ్యక్తి చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై మహేష్ తెలిపారు. ఎల్లారెడ్డికి చెందిన అన్నారం యాదగిరి(53)అనే వ్యక్తి భార్య కళావతి అనారోగ్యంతో నాలుగేళ్ల క్రితం మృతి చెందింది. అప్పటి నుంచి ఆయన మద్యానికి బానిసై డబ్బుల కోసం కుటుంబ సభ్యులతో గొడవ పడేవాడు. శుక్రవారం సాయంత్రం స్థానిక పెద్ద చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు.

March 28, 2026 / 08:33 AM IST

నేడు ధర్‌పల్లి సహకార సంఘం సర్వసభ్య సమావేశం

NZB: ధర్‌పల్లి PACS కార్యాలయంలో శనివారం ఉదయం 10 గంటలకు రైతులతో సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు సంఘం కార్యదర్శి జీ. సంతోష్ రెడ్డి తెలిపారు. సింగిల్ విండో పరిధిలోని సభ్యత్వం కలిగిన గ్రామాల రైతులందరూ ఈ సమావేశానికి హాజరుకావాలని ఆయన కోరారు. 6 నెలల కాలానికి సంబంధించిన జమ, ఖర్చుల వివరాలను ఈ సందర్భంగా సభ్యులకు వివరించనున్నారు.

March 28, 2026 / 08:33 AM IST

ఇసుక లేక నిలిచిపోతున్న ఇళ్ల నిర్మాణాలు

జన్నారం మండలంలో ఇసుక సరఫరా లేకపోవడంతో ఇళ్ల నిర్మాణాలు నిలిచిపోయాయని ప్రజలు తెలిపారు. ట్రాక్టర్ యజమానులు, మేస్త్రీలు, కూలీలు ఉపాధి కోల్పోయారు. జన్నారం కవ్వాల్ అభయారణ్యంలో ఉండడంతో పది కిలోమీటర్ల వరకు ఇసుక సేకరణను నిలిపివేసినట్లు అటవీ అధికారులు చెప్పారు. గోదావరి తీరంలో కూడా సేకరణను నిలిపివేశారు. మండలంలో దాదాపు ఇసుక సరఫరా నిలిచిపోయింది. దీంతో ఇంటి యజమానులు కూడా ఇబ్బంది పడుతున్నారు.

March 28, 2026 / 08:29 AM IST

నేడు జాతీయ మెగా లోక్ అదాలత్

MDK: నేడు జరిగే జాతీయ మెగా లోక్ అదాలత్ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ శ్రీనివాసరావు సూచించారు. పెండింగ్‌లో ఉన్న క్రిమినల్ కంపౌండబుల్, సివిల్, కుటుంబ, బ్యాంకు, చెక్ బౌన్స్ కేసులను పరస్పర చర్చల ద్వారా వేగంగా పరిష్కరించుకోవచ్చన్నారు. కోర్టుల చుట్టూ తిరగడం కంటే రాజీ మార్గమే ఉత్తమమని “రాజీయే రాజమార్గం” అని పేర్కొన్నారు.

March 28, 2026 / 08:28 AM IST

‘ఎంపీ డీకే అరుణ పర్యటనకు ఏర్పాట్లు పూర్తి’

మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ మరికల్ మండలం వెంకటాపూర్ గ్రామంలో నూతన గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం ధన్వాడ మండల కేంద్రంలో సాయంత్రం 5 గంటలకు ఛత్రపతి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొననున్నారు. కార్యక్రమాలకు కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని బీజేపీ నాయకులు కోరారు.

March 28, 2026 / 08:25 AM IST