NZB: భార్యా భర్తల మధ్య ఏర్పడ్డ మనస్పర్ధలు దాడికి దారి చేశాయి. ఈ ఘటన నవీపేటలో చోటుచేసుకుంది. అభంగపట్నంకు చెందిన జ్యోతికి మిథున్తో వివాహం జరిగింది. ఇద్దరి మధ్య మనస్పర్ధలు కారణంగా మూడు నెలల నుంచి తల్లి గారి ఇంట్లో ఉంటుంది. దీంతో తన భర్త కక్ష పెంచుకొని, శనివారం జ్యోతి తండ్రిపై బండరాయితో దాడి చేశాడు. అలాగే జ్యోతి తోపాటు ఆమె తల్లిపై కత్తితో దాడి చేశాడు.