SRD: వారం రోజుల్లో పెళ్లి చేసుకోవాల్సిన యువకుడు మంజీరా నదిలో దూకి సోమవారం ఆత్మహత్య చేసుకున్నాడు. నాగల్గిద్ద మండలం కరస్ గుత్తి గ్రామానికి చెందిన సునీల్ చౌహన్(22) గత నెల 28న హైదరాబాద్ నుంచి పల్సర్ బండిపై ఇంటికి బయలుదేరాడు. ఎంతకూ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఫోన్లో సంప్రదిస్తే అందుబాటులోకి రాలేదు. యువకుడు మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.