• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత

NGKL: ఊర్కొండ మండలం రాచలపల్లి గ్రామానికి చెందిన జెల్ల జంగమ్మ అనారోగ్యంతో మృతి చెందింది. సోమవారం విషయం తెలుసుకున్న మధారం మాజీ సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ద్యాప నిఖిల్ రెడ్డి మృతుని కుటుంబ సభ్యుల పరామర్శించి కాంగ్రెస్ యువ నాయకుల ద్వారా రూ.5000 అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మాడుగుల మహేష్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

March 30, 2026 / 12:23 PM IST

ఎర్రవెల్లిలో ఘనంగా పౌర హక్కుల దినోత్సవం

SDPT: మర్కూక్ మండలం ఎర్రవెల్లి గ్రామంలో పౌర హక్కుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ కవిత రామ్మోహన్ రెడ్డి, స్థానిక ఎస్ఐ దామోదర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామస్తులకు రాజ్యాంగం కల్పించిన హక్కులు మరియు బాధ్యతలపై సమగ్ర అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..సమాజంలో ప్రతి ఒక్కరూ చట్టం ముందు సమానమేనని అని అన్నారు.

March 30, 2026 / 12:22 PM IST

జాతీయస్థాయిలో వికారాబాద్ విద్యార్థికి ‘రజతం’

VKB: వికారాబాద్ మహాత్మా జ్యోతిబా ఫులే (ఎంజేపీ) బాలుర గురుకుల విద్యార్థి సాయి కిరణ్ సోమవారం జాతీయస్థాయిలో సత్తా చాటాడు. బెంగళూరులో జరిగిన క్రీడా పోటీల్లో షాట్‌పుట్ విభాగంలో బంతిని 17 మీటర్ల దూరం విసిరి రెండో స్థానంతో రజత పతకాన్ని కైవసం చేసుకున్నారు. ఈ ఘనత సాధించిన సాయి కిరణ్‌ను ఎంజేపీ పాఠశాల ఉపాధ్యాయులు, స్థానికులు ఘనంగా అభినందించారు.

March 30, 2026 / 12:21 PM IST

వేసవి తీవ్రత దృష్ట్యా చలివేంద్రం ప్రారంభం

PDPL: కమాన్పూర్ మండలం రొంపికుంట గ్రామంలో శివాజీ యువసేన ఆధ్వర్యంలో సోమవారం చలివేంద్రాన్ని ప్రారంభించారు. వేసవి తీవ్రత దృష్ట్యా ప్రజలకు తాగునీరు అందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రారంభోత్సవంలో గ్రామ సర్పంచ్ శ్రీనివాస్, మాజీ వైస్ ఎంపీపీ శ్రీనివాస్ యాదవ్, మాజీ సర్పంచ్ రవీందర్, తదితరులు పాల్గొన్నారు.

March 30, 2026 / 12:20 PM IST

లోక్ అదాలత్ ద్వారా 6572 కేసులు పరిస్కారం:సునీల్ దత్

KMM: జిల్లావ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్‌కు విశేష స్పందన లభించిందని సీపీ సునీల్ దత్ అన్నారు. వీటి ద్వారా 6572 కేసులు పరిష్కారమయ్యాయని, 77 సైబర్ క్రైమ్ కేసుల్లో రూ. 36 లక్షలకు పైగా రిఫండ్ మొత్తాన్ని బాధితులకు అందజేశారని తెలిపారు. ఎఫ్ఎఆర్ కేసులు -764, ఈ పెట్టి కేసులు -1837, డ్రంకెన్ అండ్ డ్రైవ్ కేసులు – 3971, సైబర్ కేసులు -77 పరిష్కరించినట్లు చెప్పారు.

March 30, 2026 / 12:20 PM IST

‘ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి’

KMR: జిల్లా కలెక్టరేట్ సమావేశం మందిరంలో ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విక్టర్ పేర్కొన్నారు. సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను ఆన్‌లైన్ నమోదు చేసి రసీదులను అందజేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మధు మోహన్ జెడ్పీ సీఈవో చందర్ RDO, AO, జిల్లా అధికారులు ఉన్నారు.

March 30, 2026 / 12:19 PM IST

పోలీసు వారి ఆధ్వర్యంలో భద్రతపై అవగాహన

KMM: బోనకల్ మండల పోలీసు వారి ఆధ్వర్యంలో భద్రతా అవగాహన సదస్సు సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భద్రత వారోత్సవాలపై పోలీసులు స్థానికులకు అవగాహన కల్పించారు. ఇంటి నుంచి బయటికి వెళ్లే క్రమంలో ఇల్లాలు, ఇంటి సభ్యులు వాహనదారుడుకి తప్పకుండా రోడ్డు నియమాలు సూచించాలని అందువల్ల క్షేమంగా ఇంటికి తిరిగి వస్తారని తెలిపారు. సురక్షిత ప్రయాణం చేయాలని కోరారు.

March 30, 2026 / 12:19 PM IST

మన కళకు ఢిల్లీలో గౌరవం

NLG: ఢిల్లీలో జరిగిన ‘టీఈహెచ్ బజార్’ ఎగ్జిబిషన్‌లో తెలంగాణ చేనేత కళా వైభవం చాటిచెప్పారు. పుట్టపాక గ్రామానికి చెందిన జాతీయ అవార్డు గ్రహీత ఆనంద నాగరాజు ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. ప్రసిద్ధ తేలియా రుమాల్‌తో పాటు సింగిల్, డబుల్ ఇక్కత్ వస్త్రాలను ఆయన ప్రదర్శించారు. మన సంప్రదాయ కళకు ఢిల్లీ వేదికగా దక్కిన ఈ గౌరవంపై చేనేత కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

March 30, 2026 / 12:14 PM IST

‘తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి’

ASF: పిల్లలు సరదా కోసం చెరువులు, కాలువలకు ఈతకు వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ నితికా పంత్ సూచించారు. మధ్యాహ్నం వేళల్లో పిల్లల కదలికలపై తల్లిదండ్రులు నిఘా ఉంచాలని సూచించారు. కచ్చితంగా పెద్దల పర్యవేక్షణలోనే ఈతకు వెళ్లేలా చూడాలని SP కోరారు.

March 30, 2026 / 12:12 PM IST

నవాబుపేటలో మాదకద్రవ్య అవగాహన సదస్సులు

MBNR: నవాబుపేట మండలంలో 99 రోజుల ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా సోమవారం మాదకద్రవ్యాల నిరోధంపై ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు ఎస్సై విక్రం తెలిపారు. ఈగల్ టీం ఆధ్వర్యంలో ‘పిల్లల భద్రత-డ్రగ్స్‌కు అడ్డుకట్ట’ అంశంపై నవాబుపేట, చౌడూరు, యన్మన్ గండ్ల, కొల్లూరు గ్రామాల్లో కార్యక్రమాలు జరుగుతాయని పేర్కొన్నారు.

March 30, 2026 / 12:10 PM IST

రోడ్డుపై ఆశ వర్కర్ల రాస్తారోకో

NLG: చిట్యాల పట్టణ కేంద్రంలో చిట్యాల భువనగిరి రోడ్డుపై సిఐటీయూ ఆధ్వర్యంలో ఆశా వర్కర్ల రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వం ఆశ వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని, పెండింగ్ వేతనాలు ఇవ్వాలని, కనీస వేతనం 18 వేలకు పెంచారని డిమాండ్ చేశారు. రాస్తారోకోతో రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ప్రభుత్వం మొండి వైఖరి వీడి ఆశా వర్కర్లకు న్యాయం చేయాలన్నారు.

March 30, 2026 / 12:09 PM IST

విద్యుత్ ప్రజా బాట కార్యక్రమం

JGL: కథలాపూర్ మండలంలోని సిరికొండలో ట్రాన్స్‌కో ఆధ్వర్యంలో ‘విద్యుత్ ప్రజా బాట’ కార్యక్రమం నిర్వహించారు. ఏఈ దివాకర్ రావు మాట్లాడుతూ.. విద్యుత్ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలని, వైర్లు తెగితే సొంతంగా మరమ్మతులు చేసి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని హెచ్చరించారు. ఈ మేరకు సిబ్బందితోనే పనులు చేయించాలన్నారు. ఈ కార్యక్రమంలో సబ్ ఇంజనీర్, సిబ్బంది పాల్గొన్నారు.

March 30, 2026 / 12:08 PM IST

‘స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకోవాలి’

SRCL: ప్రైవేటు కళాశాలల SC, ST, BC, EBC విద్యార్థిని విద్యార్థులు స్కాలర్షిప్స్ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి వి.రవీందర్ రెడ్డి తెలిపారు. సిరిసిల్లలోని కలెక్టరేట్‌లో సోమవారం ప్రకటన విడుదల చేశారు. విద్యార్థులు https://telanganaepass.cgg.gov.in వెబ్‌సైట్‌లో ఏప్రిల్ 20వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు.

March 30, 2026 / 12:07 PM IST

రాత్రికి రాత్రే అరెస్టులా?: లింగం

SDPT: ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తే అక్రమ అరెస్టులు చేయడం సిగ్గుచేటని టీయూ జేఏసీ దుబ్బాక నియోజకవర్గ ఛైర్మన్ సూకురి లింగం అన్నారు. అసెంబ్లీ ముట్టడికి యత్నిస్తారనే నేపథ్యంలో ముందస్తుగా లింగంతో పాటు మల్లుపల్లి భూపతి గౌడ్ తదితరులను అదుపులోకి తీసుకొని మిరుదొడ్డి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వారు మాట్లాడుతూ.. ప్రజా పాలన అంటే రాత్రికి రాత్రే అరెస్టుల? అని ప్రశ్నించారు.

March 30, 2026 / 12:06 PM IST

‘కాంగ్రెస్ ప్రభుత్వంలో గ్రామాల అభివృద్దే ధ్యేయం’

RR: ఫరూఖ్ నగర్ మండలం దూసకల్ గ్రామంలోని 6వ వార్డులో రూ.5 లక్షలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంలో గ్రామాల అభివృద్ధే ధ్యేయమని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ జ్యోతిర్మయి అంజి, గ్రామస్తులు పాల్గొన్నారు.

March 30, 2026 / 12:04 PM IST