నిర్మల్: బీజేపీపై ప్రజలకు ఆదరణ పెరిగిందని బీజేపీ జిల్లా అధ్యక్షులు రితేష్ రాథోడ్ అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి మల్కా కొమురయ్య విజయం సాధించడంపై హర్షం వ్యక్తం చేస్తూ బీజేపీ నాయకులతో కలిసి మంగళవారం ఖానాపూర్ పట్టణంలో సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ అంకం మహేందర్, రాష్ట్ర కౌన్సిలర్ మెంబర్ శ్రీనివాస్ ఉన్నారు.