NGKL: స్వేరోస్ ఆధ్వర్యంలో నెల రోజుల పాటు భీమ్ దీక్ష కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యాచరణ గురించి రేపు జిల్లా కేంద్రంలో స్వేరోస్ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించబోతున్నట్లు స్వేరోస్ జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డపాకుల శివశంకర్ ఒక ప్రకటనలో తెలిపారు. సమావేశం అనంతరం అంబేద్కర్ విగ్రహం వద్ద భీమ్ దీక్ష కార్యక్రమం వాల్ పోస్టర్ ఆవిష్కరణ ఉంటుందని తెలిపారు.