KMM: రాష్ట్రంలోనే అత్యధికంగా మిర్చి క్రయవిక్రయాలు జరిగే ఖమ్మంలో మిర్చిబోర్డు ఏర్పాటు చేసి క్వింటాకు రూ. 25 వేల చొప్పున ధర చెల్లించాలని ఎమ్మెల్సీ తాతా మధు, రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బాగం హేమంతరావు డిమాండ్ చేశారు. ఖమ్మం కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించి మాట్లాడారు. వ్యాపారులు ధరలు తగ్గిస్తుండడంతో మరింత నష్టం ఎదురవుతోందని చెప్పారు.