VKB: ధరూర్ మండల గ్రామీణ ప్రాంతాల్లో వీధి కుక్కలు మరోసారి రెచ్చిపోయాయి. ప్రతి గల్లీలో స్వైరవిహారం చేస్తూ ద్విచక్రవాహనదారులు, కాలినడకన వెళ్లేవారిపై దాడులు చేస్తున్నాయి. రాత్రి వేళల్లో అరుస్తూ ప్రజలకు నిద్ర లేకుండా చేస్తున్నాయని గ్రామస్థులు వాపోతున్నారు. కాగా, గతంలో వీధి కుక్కల దాడిలో చాలామంది గాయపడిన సంఘటనలు ఉన్నాయి. దీంతో వీధి కుక్కల బెడదకు అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు.