WNP: శ్రీరంగాపురం మండల కేంద్రంలోని శ్రీదేవి, భూదేవి సమేతంగా వెలిసిన శ్రీరంగనాథ స్వామి ఆలయంలో గురువారం పంచాంగ శ్రవణం కార్యక్రమం ఉంటుందని ఆలయ అర్చకులు తెలిపారు. నేడు ఉగాది పండుగను పురస్కరించుకుని ఉదయం 8 గంటలకు ఆలయ సన్నిధిలో పంచాంగ శ్రవణం అనంతరం సాయంత్రం స్వామి అమ్మవార్లకు తిరువీధి సేవ కార్యక్రమాలు ఉంటాయని ఆలయ అర్చకులు చెప్పారు.