SRPT: సూర్యాపేట మున్సిపాలిటీని సుందరీకరణకు కృషి చేస్తామని ఏఐసీసీ సభ్యుడు సర్వోత్తమ్ రెడ్డి అన్నారు. సోమవారం సూర్యాపేటలోని 46, 47వ వార్డుల్లో రూ.50 లక్షలతో నాలా కల్వర్టు, సీసీ రోడ్డు నిర్మాణ పనులకు మున్సిపల్ ఛైర్పర్సన్ నివేదితతో కలిసి శంకుస్థాపన చేసి మాట్లాడారు. వారం రోజుల్లో సీఎంని కలిసి ప్రత్యేక నిధులు విడుదల చేయాలని కోరనున్నట్లు పేర్కొన్నారు.