NZB: రాజస్థాన్లోని అజ్మీర్ దర్గాకు తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతో మంది భక్తులు వెళ్తుంటారు. ఈ క్రమంలో రైల్వే శాఖ భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక రైలు నడపనున్నట్లు ప్రకటించింది. మచిలీపట్నం నుంచి అజ్మీర్ (07274)DEC 21న ప్రత్యేక రైలు వెళ్తుంది. దిగువ మార్గంలో అజ్మీర్ నుంచి మచిలీపట్నం (07275) రైలు DEC 28న ఉంటుంది. ఈ రైలు NZB, పెద్దపల్లి మార్గంలో రాకపోకలు సాగిస్తుంది.