PDPL: ధర్మారం మండలం మేడారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రతిరోజు సుమారు 40 మంది స్వయం సహాయక సంఘాల మహిళలకు ‘హెల్త్ ప్రొఫైల్’ ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వైద్యాధికారి డాక్టర్ సుస్మిత ఇవాళ తెలిపారు. ఈనెల 8న ప్రారంభమైన ప్రత్యేక వైద్య శిబిరం 31 వరకు కొనసాగుతుందని పేర్కొన్నారు. కావున మండలంలోని మహిళలు అందరూ వినియోగించుకోవాలని సూచించారు.