సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం తాళ్లాళ్లపల్లి గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి ఆదివారం భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. మానకొండూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ శంకుస్థాపన చేశారు. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. ఎంపీడీవో శశికళ, సర్పంచులు మీసాల కనకరాజు, ఖాతా మల్లేశం పాల్గొన్నారు.