NLG: మర్రిగూడ మండలంలో యాసంగి 2025–26 రైతు భరోసా పథకానికి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు మండల వ్యవసాయ అధికారి సహాస్ తెలిపారు. రైతులు పట్టాదార్ పాస్ పుస్తకం, ఆధార్ కార్డు జిరాక్స్, బ్యాంకు పాస్బుక్ జిరాక్స్ పాటు దరఖాస్తు ఫారం నింపి తమ క్లస్టర్ వ్యవసాయ అధికారికి సమర్పించాలని సూచించారు. ఈ అవకాశాన్ని రైతులు వినియోగించుకోవాలని కోరారు.